అన్వేషించండి

ఏపీ కరికులమ్‌లో వర్చువల్‌, అగ్‌మెంటెడ్‌ రియాలటీ టెక్నాలజీ- ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం

విద్యాశాఖ అధికారులు, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, డేటావివ్‌ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో కలసి ముఖ్యమంత్రి జగన్‌ సమావేశం అయ్యారు.

పాఠశాల విద్య, ఉన్నత విద్యపై అధికారులు ఎప్పటికప్పుడు సాంకేతికను ఉపయోగించి పని చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఫ్యూచర్‌ టెక్నాలజీ స్కిల్స్‌పై ముందు చూపుతో వ్యవహరించాలని సూచించారు.

తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో హైపవర్‌ వర్కింగ్‌ గ్రూపుతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశం అయ్యారు. విద్యాశాఖ అధికారులు, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, డేటావివ్‌ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో కలసి ముఖ్యమంత్రి కీలక అంశాలపై చర్చించారు. 

విద్యా రంగంలో కీలక మార్పులపై సమాలోచనలు చేసి కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకూ విద్యార్థులకు ఫ్యూచర్‌ టెక్నాలజీ పై నైపుణ్యాభివృద్ధి ఉండాలన్నారు. అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళిక రూప కల్పన తో పాటుగా, బోధనలో, శిక్షణలో ఫ్యూచర్‌ టెక్నాలజీ వినియోగం జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

వచ్చే సమావేశం నాటికి వీటిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యపై ప్రత్యేకంగా చర్యలను చేపట్టాలన్నారు. పాఠశాల దశ నుంచి ఉన్నత విద్య వరకు ఈ రెండింటిని అనుసంధానం చేయాలన్నారు. పాఠ్య ప్రణాళిక కూడా సమ్మిళితం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే ప్రధాన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.  

ఉన్నత విద్యలో మరింత మెరుగైన సంస్కరణలు అవసరమని, ఇండియాలో ఏఐ వంటి వర్టికల్స్‌ అభివృద్ధి చాలా తక్కువగా ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. రిస్క్‌ మేనేజిమెంట్, అసెట్‌ మేనేజిమెంట్, రియల్‌ ఎస్టేట్‌ మేనేజిమెంట్, ఫైనాన్స్‌ వంటి అంశాలను కరిక్యులమ్‌లో భాగం చేయటం ద్వార మంచి ఫలితాలు సాధించగలమని అభిప్రాయపడ్డారు. వెస్టర్న్‌ వరల్డ్‌లో వీటికి సంబంధించిన ఫ్యాక్టలీ ఉందని, ఇవన్నీ అక్కడ కరిక్యులమ్‌లో భాగమని తెలిపారు.

వర్చువల్ రియాలిటి...
వర్చువల్‌ రియాలిటీ, అగ్‌మెంటెడ్‌ రియాలటీ వంటి అంశాలు కూడా కీలకమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేవలం ఒక సంస్ధకే పరిమితం కాకుండా, పెద్ద సంఖ్యలో స్కూళ్లు, కాలేజీల్లో ఈ కరిక్యులమ్‌ని తీసుకురావాలన్నారు. ఒక తరానికి అందుబాటులోకి తీసుకు వస్తే, వర్టికల్స్‌లో మనం నిపుణులను తయారు చేయగలుగుతామని వివరించారు. వెస్టర్న్‌ వరల్డ్‌తో పోటీపడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కూల్‌ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఎలా సమ్మిళతం చేయాలన్నది కూడ కీలకమని జగన్ అధికారులకు వివరించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఆరో తరగతి నుంచి తరగతి గదులు డిజిటలైజేషన్‌ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. విద్యార్దులకు అవసరం అయిన అన్ని పాఠ్యాంశాలను కీలకంగానే చూడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌ ఏర్పాటు కావాలన్నారు. మొత్తం 63 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌ను డిసెంబరు ఆఖరు నాటికి రెడీ చేయాలన్నారు. ఇప్పటికే 32వేల తరగతి గదుల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియ ముగిసిందని, 3వతరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెఫ్ట్‌ను అమలు జరగాలన్నారు. 

బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ పంపిణీ, ఇంగ్లిషు మీడియం అమలు, 8వతరగతి విద్యార్ధులకు ట్యాబులు వంటి కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేసిన ఘనత తమదేనని అన్నారు. ఈ మార్పులన్నీ ఏపీలోని స్కూళ్లలో చోటు చేసుకుంటున్నాయని, స్కూళ్లలో వస్తున్న ఈ మార్పులను ఇప్పుడు ఉన్నత విద్యతో సమ్మిళతం చేస్తూ మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నదే సవాల్‌గా భావించాలని జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

SIR in Andhra Pradesh: ఓటర్ల జాబితా సవరణకు నేటితో యుగియనున్న గడువు.. 39.8 లక్షల అన్ కలెక్టబుల్ ఎన్యూమరేషన్ పత్రాలు
ఓటర్ల జాబితా సవరణకు నేటితో యుగియనున్న గడువు.. 39.8 లక్షల అన్ కలెక్టబుల్ ఎన్యూమరేషన్ పత్రాలు
Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Supreme Court: పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
Healthy Millet Khichdi: మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
Mancherial Latest News:
"అప్పుల ఊబిలో చిక్కుకొని అనాథలా సింగరేణి" భరోసా యాత్రలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget