అన్వేషించండి

Montha Cyclone: మొంథా తుపాను నష్ట నివారణ కోసం చంద్రబాబు వార్ రూమ్‌- ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్‌లు

Montha Cyclone:మొంథా తుపాను నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. రియల్‌టైంలో వివరాలు తెలుసుకొని అప్రమత్తం చేశారు.

Montha Cyclone: మొంథా తుపాను తీవ్రతను తెలుసుకున్న ప్రభుత్వం నిరంతరం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది. అందుకే భారీ స్థాయిలో ప్రాణ నష్టాన్ని తగ్గించగలగింది. ఆస్తి నష్టాన్నికూడా కొంత వరకు కంట్రోల్ చేయగలిగారు. దీని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆర్టీజీఎస్‌లోనే ఉన్నారు. తుపాను తీరం దాటిన తర్వాత ఆయన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సమన్వయంతో పని చేశారని కితాబు ఇచ్చారు.  

Image

ఆంధ్రప్రదేశ్‌ను మొంథా తుపాను భయపెట్టింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా తుపాను విరుచుకుపడుతుందని అధికారులు అంచనాలు వేశారు. కేంద్రం నుంచి ఆ స్థాయిలోనే రిపోర్టులు వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్‌లోనే వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సచివాలయంలో ఉన్న అన్ని విభాగాల అధికారులు, మంత్రులతో నిరంతరం సమావేశమవుతూ వచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని సమీక్షించారు. టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వస్తున్న సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. వాటిని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేసి వాటిని పరిష్కరించారు. 

A group of officials including men and women in formal attire sit around a long white conference table with laptops and documents in a modern room featuring a podium and a backdrop displaying the Real Time Governance logo a circular orange design with swirling lines on a white panel behind the central seated figure at the podium.

గ్రామ,వార్డు సచివాలయం నుంచి అమరావతిలో సమీక్షలో ఉన్న మంత్రులు, అధికారులు, విభాగాల అధికారులు అందరూ సమన్వయంతో పని చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంతా వారి వారి పనుల చేసుకుంటూ చంద్రబాబుకు ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇస్తూ వచ్చారు. చంద్రబాబు మాత్రం ప్రభావిత ప్రాంతాల అధికారులు, ఆయా విభాగాల అధికారులు, మంత్రులతో  నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితిని సమీక్షించారు.  రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించారు. తుపాను తీరం దాటిన తర్వాత కూడా అర్ధరాత్రి టైంలో మూడోసారి ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్ష నిర్వహించారు. 

Image

ఆర్టీజీ సెంటర్‌కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. చెట్ల తొలగింపు, సబ్ స్టేషన్లల్లో సమస్యలను తక్షణం పరిష్కరించేలా అధికారులను ప్రోత్సహించారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తూ వచ్చారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆర్టీజీఎస్ కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,  మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నారాయణ కూడా ఉన్నారు. తుపాను ప్రభావంపై అధికారులకు సూచనలు చేశారు. వర్షప్రభావిత జిల్లాల్లో మంత్రులు, అధికారులతో ఆర్టీజీ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేశారు. 

Montha Cyclone: మొంథా తుపాను నష్ట నివారణ కోసం చంద్రబాబు వార్ రూమ్‌- ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్‌లు

ఎంత చిన్న పల్లెటూరైనా, లంక గ్రామామైనా తుఫాను సహయక చర్యలు అందేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు. పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలకు వెళ్లిన మంత్రులు, ప్రత్యేకాధికారులతో ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం చర్చించారు. చివరకు సచివాలయ సిబ్బందితో కూడా ముఖ్యమంత్రి టెలికాన్ఫెరెన్స్‌  నిర్వహించారు. మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మంచిగా చేశారని కితాబు ఇచ్చారు.

Dark stormy clouds dominate the sky with rays of light breaking through casting dramatic illumination over a beach scene. Large waves crash onto the sandy shore with white foam visible. Multi-story buildings line the background near the water edge. The overall atmosphere conveys intense weather conditions associated with a cyclone.
 
చంద్రబాబు అధికారులతో సమీక్ష చేస్తున్న టైంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధానమంత్రి మోదీ ఫోన్ చేశారు. పరిస్థితిపై ఆరా తీశారు. రాత్రికి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడ ఫోన్‌లో మాట్లాడారు. ఇక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని భారీగా నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా సరే తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం నుంచి మంత్రి భరోసా ఇచ్చారు. 

Image

Image

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Advertisement

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget