By: ABP Desam | Updated at : 24 Mar 2022 02:46 PM (IST)
సభలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాద్రావు
విధానాలు మార్పు చేయొద్దని కోర్టులు చెబితే ఎన్నికలు ఎందుకు అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీలో ప్రశ్నించారు. కోర్టులు ఒక్క సారి పాలసీ చెప్తే కార్యనిర్వాహక శాఖ నిర్వహించేస్తుందనిని వ్యాఖ్యానించారు. పీవీ నరసింహరావు అప్పట్లో సరళీకృత విధానం తీసుకోకుంటే దేశం ఎప్పుడో మునిగిపోయి ఉండేదని ..పాలసీ తీసుకునే నిర్ణయం ప్రభుత్వాలకు ఉందని ధర్మాన వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. చర్చను ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. గతంలో ఆయనే అసెంబ్లీలో చర్చించాలని సీఎంకు లేఖ రాశారు.
ఒక వ్యవస్థను ఇంకో వ్యవస్థ పలచన చేస్తుంటే ఇది పరువు తీసుకోవడమే కాకుండా తగని పని అని ఆయన చెప్పారు. అధికారం ప్రజల చేతిలో ఉండాలనే స్వాతంత్ర్య యోధులు కోరుకున్నారు. స్వాతంత్య్రం రాకముందే తీర్మానాలు చేశారన్నారు. రాజ్యాంగం లక్ష్యం ప్రజలు. మిగతా సంస్థలు, వ్యవస్థలు ఎన్ని ఉన్నా అంతిమ నిర్ణేతలు ప్రజలేనన్నారు. శాసన వ్యవస్థే నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటుందన్నారు. అందుకే వ్యవస్థలపై స్పష్టత ఉండాలన్నారు. వారి అధికారాలు, బాధ్యతలపై క్లారిటీ లేనప్పుడు ఫలితాలు రావు. ప్రజలకు సంబంధించిన, పాలనకు సంబంధించిన విషయాలపై కూడా క్లారిటీ ఉండాలి. ఎవరి పరిధి ఏంటి, ఎవరి విధులేంటి అనేది లేకుండా ఉంటే ఎప్పటికైనా లక్ష్యాలు చేరుకోలేం. . సుప్రీంకోర్టు 1988లో న్యాయవ్యవస్థ లేదా న్యాయమూర్తులు పబ్లిక్ విమర్శని స్వీకరించాలని చెప్పింది. న్యాయవ్యవస్థ తీర్పును సమీక్షించే అధికారం ప్రజలకే ఉందన్నారు. న్యాయమూర్తులు స్వీయనియంత్రణ పాటించాలని 2007లో చెప్పింది సుప్రీంకోర్టు. మిగతా రెండు విషయాలు పని చేయకపోతే ప్రజలు చూసుకుంటారని సుప్రీం కోర్టు చెప్పింది. మూడు విభాగాలు సంయమనం పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొంది. పరిధిలు దాటొద్దనికూడా సూచించింది. అతీతులం అనే భావన విడనాడాలని సుప్రీం కోర్టు సూచించింది. ఆ రెండు విభాగాలతో సమానం అనే భావం వాటి విధులను గౌరవిస్తూ స్వీయనియంత్రణ పాటిస్తే సమస్య రాదని చెప్పింది. న్యాయవ్యవస్థలో కత్తీ ఉండదు, పర్స్ ఉండదని... అయినా కొందరు వ్యక్తులు అవి ఉన్నాయనే అభిప్రాయంతో ఉన్నట్టు సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని ధర్మాన ప్రసంగించారు.
శాసనాలు చేసే అధికారం అసెంబ్లీ, పార్లమెంట్కు తప్ప వేరే వాళ్లకు లేదు. రాజ్యాంగ వ్యతిరేకమైనప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవచ్చు. దీన్ని పాటించాలి. కోర్టులు ప్రభుత్వాన్ని నడపలేవు అని చాలా జడ్జిమెంట్స్లో చెప్పారు.ఇది రాజధానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరిస్తే ఎలా అనేది నా డౌట్. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సభను అడ్డుకుంటుందా.. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడే ఈ లేఖ రాయాల్సి వచ్చింది. ప్రభుత్వం మారితే విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని చెప్తే ఎలా. ప్రజలు తీర్పు ఇచ్చి పంపించారు అంటే అప్పటి ప్రభుత్వం చేస్తున్న విధానాలు నచ్చలేదనే అర్థం కదా. కొత్త విధానాలు చేయండనే కదా అర్థం. ఆ అధికారమే మీకు లేదంటే ఏం చేయాలని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.
Krishna Road Accident : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లెక్సీ అడ్డురావడంతో బోల్తా పడిన ఆటో, నలుగురి మృతి
YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్
AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర
Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్కు కూడా!