అన్వేషించండి

ఏపీలో స్కూల్స్‌ మూసివేయలేదన్న బొత్స - రాజీనామాకు సిద్ధమని ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ మూసివేతపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ, వైసీపీ మధ్య చర్చ నడిచింది. స్కూల్స్ మూసివేయలేదన్న బొత్స... విద్యలో ఏపీ ఉత్తమ ర్యాంకులో ఉందన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో స్కూల్‌ మెర్జింగ్‌పై డిస్కషన్ జరిగింది. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ... ఏపీలో ఒక్క స్కూల్‌ కూడా మూసి వేయలేదని చెప్పారు. విద్యను ప్రాధాన్య అంశంగా తీసుకొని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. 

ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కారణంగా ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాల్లోకి మారుతున్నారని టీడీపీ సభ్యులు వీరాంజనేయులు ఆరోపించారు. ప్రభుత్వ అధికారులకు, మంత్రికి మధ్య సమన్వయ లోపం ఉందని... అందుకే ఆలాంటిదేమీ లేదని మంత్రి బుకాయిస్తున్నారని మండిపడ్డారు. మూడు లక్షల మంది తగ్గారని అధికారులు చెప్పారన్నారు. న్యూఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మెర్జింగ్ విధానంతో కిలోమీటర్ పరిధిలో పాఠశాలలు లేకుండా పోయాయన్నారు. 

దీనిపై మంత్రి బొత్స రియాక్ట్ అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 102 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయన్నారు. 2018-19 సంవత్సరంలో 70,43000 విద్యార్థుల్లో ప్రభుత్వంలో 37 లక్షలు ఎయిడెడ్‌లో 2లక్షల 8వేలు, ప్రైవేటులో 31 లక్షల 14వేలు మంది చదివేవాళ్లు. 2022-23 లెక్కలు చూసుకుంటే... 70,18000 ప్రభుత్వంల 39,69640, ఎయిడెడ్‌లో లక్షా తొమ్మిదివేల మంది, ప్రైవేటులో 29 లక్షల 39వేల మంది చదువుతున్నారని తెలిపారు. సుమారు రెండు లక్ష మందికిపై విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్నారని వివరించారు. 2014-19 మధ్యలో ఏపీలో 5వేల స్కూల్స్ మూసివేశారన్నారు. ఐదు వేల స్కూల్స్ పేర్లు సభ్యులకు ఇవ్వడానికి సిద్ధమన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల స్కూల్స్‌ను తెరిపించామన్నారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన  ఏ ఒక్క స్కూల్‌ను మూసివేయలేదన్నారు. ఏవరైనా అలా చేసినట్టు ఎరైనా చెప్పగలరా అని సవాల్ చేశారు. 

బొత్స చేసిన సవాల్‌కు టీడీపీ సభ్యులు స్పందిస్తూ మాట్లాడుతుండగానే స్పీకర్ కట్ చేశారు.ఏ ఊరిలో స్కూల్‌ క్లోజ్ చేశారో మాత్రమే చెప్పాలని ఆదేశించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మళ్లీ బొత్స మాట్లాడుతూ... టీడీపీ వద్ద విషయం లేదని ఎద్దేవా చేశారు. విద్యా సంస్కరణలో భాగంగానే స్టేట్‌లో కూడా సీబీఎస్‌ఈ సిలబస్ తరహా విధానం తీసుకురావాలన్న ఉద్దేశంతో సబ్జెక్ట్ టీచర్స్‌ను ప్రవేశ పెట్టామన్నారు. మూడో తరగతి నుంచే ప్రతి సబ్జెక్ట్‌కు ఓ టీచర్‌ను నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కాన్సెప్టును మూడు కిలోమీటర్‌ పరిధిలో ఉన్న స్కూల్స్‌లో పెట్టాలనుకున్నామని అయితే మూడు కిలోమీటర్లు విద్యార్థులకు దూరమవుతుందన్న ఉద్దేశంతో దాన్ని కిలోమీటర్‌కు తగ్గించినట్టు చెప్పారు. ఇక్కడ కూడా కొన్నిరూల్స్ పెట్టామన్నారు. హైవేలు, వాగులు, చెరువుగట్లు ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేశామన్నారు. మెర్జింగ్ చేసినప్పటికీ ఎక్కడా స్కూల్స్ మూసివేయలేదన్నారు. ఐదువేల నాలుగు వందల 19 పోస్టులను అప్‌గ్రేడ్ చేశామన్నారు. ప్రతి 15రోజులకు ఓసారి రివ్యూ చేస్తున్న ముఖ్యమంత్రి... విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. 

తర్వాత టీడీపీ సభ్యులు సాంబశివరావు మాట్లాడుతూ... తమకు అనుకూలంగా ఉన్న విషయాలనే సభ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారిచ్చిన వివరాలను పరిశీలిస్తే.. 2021-22 సంవత్సరంలో ప్రభుత్వం పాఠశాలల్లో 44 లక్షల29 వేల 569మంది ఉంటే.. ఈ ఏడాది 40,31,239 మంది మాత్రమే ఉన్నారని ఈ ఏడాడి సుమారు నాలుగు లక్షళ మంది వెళ్లిపోయారన్నారు. ప్రభుత్వం ఏ స్కూల్‌ను మూసివేయడం లేదు కానీ... 3627 పాఠశాలల్లో మూడు నాలుగు, ఐదు తరగతులను వేరే పాఠశాలల్లోకి షిఫ్టు చేశారన్నారు. దీని వల్ల కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందన్నారు. 8,4 12 స్కూల్స్‌ను షిఫ్టు చేయడానికి రెడీ అవుతున్నారని ఆరోపించారు. దీని వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. 

జాతీయ విద్యావిధానం ప్రకారం తీసుకున్న నిర్ణయమని.. దీని వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాము తీసుకున్న చర్యల వల్ల విద్యలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలోకి వచ్చిందన్నారు. గతంలో 14వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. దీనికి ప్రతిపక్షం రియాక్ట్ అవుతూ... విద్యలో ఏపీ 27వ స్థానానికి వెళ్లిందని గట్టిగా అరిచి చెప్పారు. దానికి బొత్స స్పందిస్తూ...విద్యలో ఏపీ 27వ స్థానంలో ఉంటే ఇక్కడే రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు.  
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, అందుకే కొన్ని ఫిలిమ్స్ చేయలేదు - ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, అందుకే కొన్ని ఫిలిమ్స్ చేయలేదు - ఆయుషి పటేల్
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Embed widget