Modi Tour In Andhra Pradesh: ప్రధాని మోదీ టూర్ ఎఫెక్ట్- విజయవాడలో భారీగా ట్రాఫిక్ మళ్ళింపు
Modi Tour In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రధానమంత్రి మోదీ మే 2న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో రోజంతా ట్రాఫిక్ మళ్లించబోతున్నారు.

Modi Tour In Andhra Pradesh:ప్రధాన మోడీ అమరావతికి వచ్చేస్తున్నారు. మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు ఏపీ పోలీసులు. ఎవరు ఏ రూట్లో వెళ్ళాలి అనే అంశంపై ఏపీ డీజీపీ కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మే 2 న విజయవాడపై నుంచి వెళ్లే వాహనాల దారి మళ్ళింపు ఇలా..!
మే 2, 2025న ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి వస్తాయి.
ట్రాఫిక్ మళ్లింపులు (భారీ, ఇతర వాహనాలతో సహా) :
1. చెన్నై వైపు నుంచి విశాఖపట్నానికి విజయవాడ మీదుగా, ఇబ్రహీంపట్నం, నందిగామ వైపునకు వెళ్లే భారీ గూడ్స్ వాహనాలని దారిమళ్లించారు. వీటని త్రోవగుంట నుంచి చీరాల- బాపట్ల - రేపల్లె - అవనిగడ్డ- పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా ఇబ్రహీంపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది. అదే విధంగా విశాఖపట్నం నుంచి చెన్నైవైపు వాహనాలు కూడా అలానే రావాల్సి ఉంటుంది.
2. చిలకలూరిపేట వైపు నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను చిలకలూరిపేట నుంచి NH-16 మీదుగా పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.
3. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుంచి ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు -గుడివాడ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.
4. గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలును బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి - వేమూరు- కొల్లూరు - వెల్లటూరు జంక్షన్ – పెనుముడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.
5. గన్నవరం వైపు నుంచి హైదరాబాద్కు ఆగిరిపల్లి - శోభనాపురం గణపవరం మీదుగా వెళ్లాలి. మైలవరం జి. కొండూరు ఇబ్రహీంపట్నం మీదుగా దారి మళ్లించారు.
6. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు- మైలవరం జి. కొండూరు - ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాలి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలు కూడా ఇదే మార్గంలో వెళ్లాలి.
మల్టీ-యాక్సిల్ గూడ్స్ వాహనాలకు ప్రత్యేక సూచనలు :
చెన్నై నుంచి విశాఖపట్నం: ఈ వాహనాలు చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద జాతీయ రహదారి దగ్గర మళ్లింపు లేకుండా వేస్తున్నారు.
విశాఖపట్నం నుంచి చెన్నై: ఈ వాహనాలు హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారి దగ్గర ఆపివేస్తారు. ఆగిన అన్ని మల్టీ-యాక్సిల్ వాహనాలు మే 2, 2025న రాత్రి 9:00 గంటల తర్వాత ముందుకు సాగడానికి అనుమతిస్తారు.
ఈ సమయంలో ట్రాఫిక్ లేకుండా వాహనాలు సజావుగా ముందుకు సాగేలా ప్రయాణీకులు సహకరించాలని కోరుతున్నట్టు ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది.





















