అన్వేషించండి

Chandrababu: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, జగన్ హయాంలో అన్నీ అరాచకాలే - చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Naidu: ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం మంగళగిరిలో జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల పవిత్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Naidu Comments: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలను గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని విమర్శించారు. ఆఖరికి తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కూడా మొత్తం కల్తీ చేశారని ఆరోపించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపిన పరిస్థితి ఉందని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వును గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వాడినట్లుగా చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తిరుమలలో అరాచకాలు చేసిందని చంద్రబాబు అన్నారు. తద్వారా వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీశారని అన్నారు. అంతా నాణ్యత లేని పదార్థాలతో తిరుమల లడ్డూను తయారు చేసి, దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను కూడా అపవిత్రం చేశారని విమర్శించారు. జగన్ హాయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడితే.. తాము అధికారంలోకి రాగానే అన్నీ నాణ్యమైన పదార్థాలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నామని చెప్పారు. 

వారికి శిక్ష పడాల్సిందే
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో ఎన్నో అవకతవకలకు పాల్పడిందని చంద్రబాబు అన్నారు. ఇలా తప్పు చేసి, డబ్బు దండుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని చంద్రబాబు అన్నారు. ‘‘తప్పు చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. అన్నా క్యాంటీన్‌ రద్దు చేసి జగన్‌ దుర్మార్గమైన పని చేశారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసింది. అయినా రెన్యువల్‌ చేయలేదు. ఇంకా మరెన్నో తప్పులు వారు చేశారు. జగన్ హయాంలో తప్పులు చేసిన వాళ్లని వదిలిపెట్టబోను.. విచారణలు జరుగుతున్నాయి. అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో ఒక్క తప్పు చేయడానికి కూడా వీల్లేదు. అందరూ జాగ్రత్త వహించాలి. వారు మద్యం విధానాన్ని అత్యంత గందరగోళం చేశారు.. అందుకని కూటమి ప్రభుత్వం అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకువస్తుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని చంద్రబాబు మాట్లాడారు.

‘‘గత ప్రభుత్వం ఎన్నో నిధులను దుర్వినియోగం చేసింది.. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించింది. అధికారంలోకి వచ్చేసరికి ఖజానాలో ఎక్కడా డబ్బులు లేవు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అయినా మనం ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. రాబోయే ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల్ని యువతకు కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నాం. మనం మూడు పార్టీల సమష్ఠి కృషితోనే ఏపీలో ఇంత ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చాం. నా జీవితంలో ఎన్నడూ చూడని విజయం ఇది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. కేంద్ర సహాయం వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తికి ఆక్సిజన్‌ లాంటిది’’ అని చంద్రబాబు చెప్పారు.       

Also Read: యువకుడు కూడా చంద్రబాబులా పని చేయలేడు, మేం అండగా ఉంటాం - పవన్ కల్యాణ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
AP CM Chandrababu: బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget