అన్వేషించండి

Chandra Babu On Cyclone:మొంథా తుపాను నష్టం ఐదువేల కోట్లకుపై మాటే- ఫేక్ ప్రచారాన్ని పట్టించుకోవద్దు: చంద్రబాబు

Chandra Babu On Cyclone: తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని వ్యవస్థలు ఒకే మైండ్‌సెట్‌తో పని చేశాయని వెల్లడించారు.

Chandra Babu On Cyclone:ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ధాటికి దాదాపు ఐదు వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వేసింది. పూర్తి అంచనాలు వచ్చిన తర్వాత కేంద్రానికి లెక్కలు పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో చాలా వరకు నష్టాన్ని తగ్గించామని లేకుంటే ఎవరూ ఊహించని స్థాయిలో విధ్వంసం ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు జరిగిన నష్టమంతా మన చేతుల్లో లేదని పేర్కొన్నారు. తుపాను సమయంలో ప్రజల కోసం క్షేత్రస్థాయి అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అంతా బాగా పని చేశారని, టీం వర్క్ చేస్తే ఫలితాలు ఇలా ఉంటాయని ముఖ్యమంత్రి కొనియాడారు. 

అంతా కలిసి ఒకే మైండ్‌సెట్‌తో పని చేసి తీవ్ర తుపానును ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గురవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రపంచంలో ఏ దేశం వాడుకోని విధంగా టెక్నాలజీని వాడుకున్నట్టు తెలిపారు. తుపాను సమయంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో రియల్‌ టైంలో వివరాలు తెలుసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని వివరించారు. ఇంత విధ్వంసకర తుపాను రాష్ట్రంలో వచ్చిన ఒక్క రోజులోనే పరిస్థితులను నార్మలైజ్ చేయగలిగామని పేర్కొన్నారు. గతంలో తుపానులు వస్తే వారం పదిరోజుల వరకు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవి కావని ఈసారి మాత్రం ఒక్క రోజులో మాత్రమే అన్నీ సరి చేశామని వివరించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సచివాలయ ఉద్యోగి వరకు అంతా బాగా పని చేశారని అందుకే నష్టాన్ని తగ్గించామన్నారు. ఇప్పటి వరకు వచ్చిన అంచనాలు ప్రకారం 5,265.51 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇంకా ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు. 

అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మెకానిజాన్ని సిద్ధం చేశామని అది ఇప్పుడు బాగా ఉపయోగపడిందన్నారు సీఎం. తుపాన్లు రాకుండా అపలేం కానీ సమర్థంగా ఎదుర్కోగలమని నిరూపించామని తెలిపారు. పక్కా ప్లానింగ్‌తో ఉంటే యంత్రాంగానికి సరైన డైరెక్షన్ ఇవ్వగలిగితే ఇలాంటి ఫలితాలు వస్తాయని వెల్లడించారు. ఆర్టీజీఎస్ కేంద్రం ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఏం చేయాలనే చెప్పే స్థాయికి వచ్చామని అన్నారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకున్నామని వివరించారు. ఇలాంటి విపత్కార పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఒక మాన్యువల్ తయారు చేశామని వెల్లడించారు.  

వివిధ మార్గాల్లో వచ్చిన డేటాను ఆధారంగా చేసుకొని ప్రజలను అధికారులను అప్రమత్తం చేసినట్టు సీఎం తెలిపారు. వచ్చే కాలంలో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అమరావతి నుంచే గ్రామాలకు నేరుగా చేర వేసే ప్రక్రియ కూడా వస్తుందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల కార్యకర్తలు, నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి భరోసా ఇచ్చారని సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేశారని వెల్లడించారు. అన్ని వ్యవస్థలు ఇంత సమర్థంగా పని చేస్తున్నా కొందరు ఫేక్ మనుషులు ఇంకా బురదజల్లే పని చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు చేశారు. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పుడు కేంద్రానికి నివేదికలు పంపిన తర్వాత ప్రత్యేక చొరవతో నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Yellamma Glimpse: హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Advertisement

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Yellamma Glimpse: హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Sai Pallavi: రామాయణం కాదు... సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఇదే - రిలీజ్ డేట్ ఫిక్స్, హీరో బ్యాగ్రౌండ్ తెలుసా?
రామాయణం కాదు... సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఇదే - రిలీజ్ డేట్ ఫిక్స్, హీరో బ్యాగ్రౌండ్ తెలుసా?
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Tesla Full Self Driving Software :టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
Embed widget