అన్వేషించండి

Chandra Babu On Cyclone:మొంథా తుపాను నష్టం ఐదువేల కోట్లకుపై మాటే- ఫేక్ ప్రచారాన్ని పట్టించుకోవద్దు: చంద్రబాబు

Chandra Babu On Cyclone: తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని వ్యవస్థలు ఒకే మైండ్‌సెట్‌తో పని చేశాయని వెల్లడించారు.

Chandra Babu On Cyclone:ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ధాటికి దాదాపు ఐదు వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వేసింది. పూర్తి అంచనాలు వచ్చిన తర్వాత కేంద్రానికి లెక్కలు పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో చాలా వరకు నష్టాన్ని తగ్గించామని లేకుంటే ఎవరూ ఊహించని స్థాయిలో విధ్వంసం ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు జరిగిన నష్టమంతా మన చేతుల్లో లేదని పేర్కొన్నారు. తుపాను సమయంలో ప్రజల కోసం క్షేత్రస్థాయి అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అంతా బాగా పని చేశారని, టీం వర్క్ చేస్తే ఫలితాలు ఇలా ఉంటాయని ముఖ్యమంత్రి కొనియాడారు. 

అంతా కలిసి ఒకే మైండ్‌సెట్‌తో పని చేసి తీవ్ర తుపానును ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గురవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రపంచంలో ఏ దేశం వాడుకోని విధంగా టెక్నాలజీని వాడుకున్నట్టు తెలిపారు. తుపాను సమయంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో రియల్‌ టైంలో వివరాలు తెలుసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని వివరించారు. ఇంత విధ్వంసకర తుపాను రాష్ట్రంలో వచ్చిన ఒక్క రోజులోనే పరిస్థితులను నార్మలైజ్ చేయగలిగామని పేర్కొన్నారు. గతంలో తుపానులు వస్తే వారం పదిరోజుల వరకు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవి కావని ఈసారి మాత్రం ఒక్క రోజులో మాత్రమే అన్నీ సరి చేశామని వివరించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సచివాలయ ఉద్యోగి వరకు అంతా బాగా పని చేశారని అందుకే నష్టాన్ని తగ్గించామన్నారు. ఇప్పటి వరకు వచ్చిన అంచనాలు ప్రకారం 5,265.51 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇంకా ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు. 

అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మెకానిజాన్ని సిద్ధం చేశామని అది ఇప్పుడు బాగా ఉపయోగపడిందన్నారు సీఎం. తుపాన్లు రాకుండా అపలేం కానీ సమర్థంగా ఎదుర్కోగలమని నిరూపించామని తెలిపారు. పక్కా ప్లానింగ్‌తో ఉంటే యంత్రాంగానికి సరైన డైరెక్షన్ ఇవ్వగలిగితే ఇలాంటి ఫలితాలు వస్తాయని వెల్లడించారు. ఆర్టీజీఎస్ కేంద్రం ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఏం చేయాలనే చెప్పే స్థాయికి వచ్చామని అన్నారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకున్నామని వివరించారు. ఇలాంటి విపత్కార పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఒక మాన్యువల్ తయారు చేశామని వెల్లడించారు.  

వివిధ మార్గాల్లో వచ్చిన డేటాను ఆధారంగా చేసుకొని ప్రజలను అధికారులను అప్రమత్తం చేసినట్టు సీఎం తెలిపారు. వచ్చే కాలంలో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అమరావతి నుంచే గ్రామాలకు నేరుగా చేర వేసే ప్రక్రియ కూడా వస్తుందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల కార్యకర్తలు, నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి భరోసా ఇచ్చారని సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేశారని వెల్లడించారు. అన్ని వ్యవస్థలు ఇంత సమర్థంగా పని చేస్తున్నా కొందరు ఫేక్ మనుషులు ఇంకా బురదజల్లే పని చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు చేశారు. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పుడు కేంద్రానికి నివేదికలు పంపిన తర్వాత ప్రత్యేక చొరవతో నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Bank Holiday: నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
శ్రీ చరణి నుంచి స్మృతి మంధాన వరకు ప్రభుత్వాలు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఇదే! ఏ రాష్ట్రం ఎన్ని కోట్లు ఇచ్చింది?
శ్రీ చరణి నుంచి స్మృతి మంధాన వరకు ప్రభుత్వాలు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఇదే! ఏ రాష్ట్రం ఎన్ని కోట్లు ఇచ్చింది?
Advertisement

వీడియోలు

Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Bank Holiday: నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
శ్రీ చరణి నుంచి స్మృతి మంధాన వరకు ప్రభుత్వాలు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఇదే! ఏ రాష్ట్రం ఎన్ని కోట్లు ఇచ్చింది?
శ్రీ చరణి నుంచి స్మృతి మంధాన వరకు ప్రభుత్వాలు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఇదే! ఏ రాష్ట్రం ఎన్ని కోట్లు ఇచ్చింది?
Car Safety Tips: కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
Arjun Sarja Family in Tirumal
Arjun Sarja Family in Tirumal
Telangana Srirangam: తమిళనాడు ఆలయానికి ప్రతిరూపం తెలంగాణ శ్రీరంగం దర్శించుకున్నారా? వివాహాలకు ప్రసిద్ధి ఈ ఆలయం!
తమిళనాడు ఆలయానికి ప్రతిరూపం తెలంగాణ శ్రీరంగం దర్శించుకున్నారా? వివాహాలకు ప్రసిద్ధి ఈ ఆలయం!
K Ramp OTT : కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పటినుంచంటే?
కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పటినుంచంటే?
Embed widget