అన్వేషించండి

Chandra Babu On Cyclone:మొంథా తుపాను నష్టం ఐదువేల కోట్లకుపై మాటే- ఫేక్ ప్రచారాన్ని పట్టించుకోవద్దు: చంద్రబాబు

Chandra Babu On Cyclone: తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని వ్యవస్థలు ఒకే మైండ్‌సెట్‌తో పని చేశాయని వెల్లడించారు.

Chandra Babu On Cyclone:ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ధాటికి దాదాపు ఐదు వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వేసింది. పూర్తి అంచనాలు వచ్చిన తర్వాత కేంద్రానికి లెక్కలు పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో చాలా వరకు నష్టాన్ని తగ్గించామని లేకుంటే ఎవరూ ఊహించని స్థాయిలో విధ్వంసం ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు జరిగిన నష్టమంతా మన చేతుల్లో లేదని పేర్కొన్నారు. తుపాను సమయంలో ప్రజల కోసం క్షేత్రస్థాయి అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అంతా బాగా పని చేశారని, టీం వర్క్ చేస్తే ఫలితాలు ఇలా ఉంటాయని ముఖ్యమంత్రి కొనియాడారు. 

అంతా కలిసి ఒకే మైండ్‌సెట్‌తో పని చేసి తీవ్ర తుపానును ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గురవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రపంచంలో ఏ దేశం వాడుకోని విధంగా టెక్నాలజీని వాడుకున్నట్టు తెలిపారు. తుపాను సమయంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో రియల్‌ టైంలో వివరాలు తెలుసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని వివరించారు. ఇంత విధ్వంసకర తుపాను రాష్ట్రంలో వచ్చిన ఒక్క రోజులోనే పరిస్థితులను నార్మలైజ్ చేయగలిగామని పేర్కొన్నారు. గతంలో తుపానులు వస్తే వారం పదిరోజుల వరకు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవి కావని ఈసారి మాత్రం ఒక్క రోజులో మాత్రమే అన్నీ సరి చేశామని వివరించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సచివాలయ ఉద్యోగి వరకు అంతా బాగా పని చేశారని అందుకే నష్టాన్ని తగ్గించామన్నారు. ఇప్పటి వరకు వచ్చిన అంచనాలు ప్రకారం 5,265.51 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇంకా ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు. 

అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మెకానిజాన్ని సిద్ధం చేశామని అది ఇప్పుడు బాగా ఉపయోగపడిందన్నారు సీఎం. తుపాన్లు రాకుండా అపలేం కానీ సమర్థంగా ఎదుర్కోగలమని నిరూపించామని తెలిపారు. పక్కా ప్లానింగ్‌తో ఉంటే యంత్రాంగానికి సరైన డైరెక్షన్ ఇవ్వగలిగితే ఇలాంటి ఫలితాలు వస్తాయని వెల్లడించారు. ఆర్టీజీఎస్ కేంద్రం ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఏం చేయాలనే చెప్పే స్థాయికి వచ్చామని అన్నారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకున్నామని వివరించారు. ఇలాంటి విపత్కార పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఒక మాన్యువల్ తయారు చేశామని వెల్లడించారు.  

వివిధ మార్గాల్లో వచ్చిన డేటాను ఆధారంగా చేసుకొని ప్రజలను అధికారులను అప్రమత్తం చేసినట్టు సీఎం తెలిపారు. వచ్చే కాలంలో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అమరావతి నుంచే గ్రామాలకు నేరుగా చేర వేసే ప్రక్రియ కూడా వస్తుందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల కార్యకర్తలు, నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి భరోసా ఇచ్చారని సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేశారని వెల్లడించారు. అన్ని వ్యవస్థలు ఇంత సమర్థంగా పని చేస్తున్నా కొందరు ఫేక్ మనుషులు ఇంకా బురదజల్లే పని చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు చేశారు. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పుడు కేంద్రానికి నివేదికలు పంపిన తర్వాత ప్రత్యేక చొరవతో నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati pipes on fire: అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !
అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !
Rajahmundry King: ఇండోనేషియా, మలేషియాలను జయించిన రాజమండ్రి రాజు ! గొప్ప చక్రవర్తి పుట్టింది గోదావరి జిల్లాలోనా?
ఇండోనేషియా, మలేషియాలను జయించిన రాజమండ్రి రాజు ! గొప్ప చక్రవర్తి పుట్టింది గోదావరి జిల్లాలోనా?
Supreme Court: క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget