అన్వేషించండి

Chandra Babu On Cyclone:మొంథా తుపాను నష్టం ఐదువేల కోట్లకుపై మాటే- ఫేక్ ప్రచారాన్ని పట్టించుకోవద్దు: చంద్రబాబు

Chandra Babu On Cyclone: తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని వ్యవస్థలు ఒకే మైండ్‌సెట్‌తో పని చేశాయని వెల్లడించారు.

Chandra Babu On Cyclone:ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ధాటికి దాదాపు ఐదు వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వేసింది. పూర్తి అంచనాలు వచ్చిన తర్వాత కేంద్రానికి లెక్కలు పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో చాలా వరకు నష్టాన్ని తగ్గించామని లేకుంటే ఎవరూ ఊహించని స్థాయిలో విధ్వంసం ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు జరిగిన నష్టమంతా మన చేతుల్లో లేదని పేర్కొన్నారు. తుపాను సమయంలో ప్రజల కోసం క్షేత్రస్థాయి అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అంతా బాగా పని చేశారని, టీం వర్క్ చేస్తే ఫలితాలు ఇలా ఉంటాయని ముఖ్యమంత్రి కొనియాడారు. 

అంతా కలిసి ఒకే మైండ్‌సెట్‌తో పని చేసి తీవ్ర తుపానును ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గురవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రపంచంలో ఏ దేశం వాడుకోని విధంగా టెక్నాలజీని వాడుకున్నట్టు తెలిపారు. తుపాను సమయంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో రియల్‌ టైంలో వివరాలు తెలుసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని వివరించారు. ఇంత విధ్వంసకర తుపాను రాష్ట్రంలో వచ్చిన ఒక్క రోజులోనే పరిస్థితులను నార్మలైజ్ చేయగలిగామని పేర్కొన్నారు. గతంలో తుపానులు వస్తే వారం పదిరోజుల వరకు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవి కావని ఈసారి మాత్రం ఒక్క రోజులో మాత్రమే అన్నీ సరి చేశామని వివరించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సచివాలయ ఉద్యోగి వరకు అంతా బాగా పని చేశారని అందుకే నష్టాన్ని తగ్గించామన్నారు. ఇప్పటి వరకు వచ్చిన అంచనాలు ప్రకారం 5,265.51 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇంకా ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు. 

అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మెకానిజాన్ని సిద్ధం చేశామని అది ఇప్పుడు బాగా ఉపయోగపడిందన్నారు సీఎం. తుపాన్లు రాకుండా అపలేం కానీ సమర్థంగా ఎదుర్కోగలమని నిరూపించామని తెలిపారు. పక్కా ప్లానింగ్‌తో ఉంటే యంత్రాంగానికి సరైన డైరెక్షన్ ఇవ్వగలిగితే ఇలాంటి ఫలితాలు వస్తాయని వెల్లడించారు. ఆర్టీజీఎస్ కేంద్రం ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఏం చేయాలనే చెప్పే స్థాయికి వచ్చామని అన్నారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకున్నామని వివరించారు. ఇలాంటి విపత్కార పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఒక మాన్యువల్ తయారు చేశామని వెల్లడించారు.  

వివిధ మార్గాల్లో వచ్చిన డేటాను ఆధారంగా చేసుకొని ప్రజలను అధికారులను అప్రమత్తం చేసినట్టు సీఎం తెలిపారు. వచ్చే కాలంలో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అమరావతి నుంచే గ్రామాలకు నేరుగా చేర వేసే ప్రక్రియ కూడా వస్తుందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల కార్యకర్తలు, నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి భరోసా ఇచ్చారని సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేశారని వెల్లడించారు. అన్ని వ్యవస్థలు ఇంత సమర్థంగా పని చేస్తున్నా కొందరు ఫేక్ మనుషులు ఇంకా బురదజల్లే పని చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు చేశారు. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పుడు కేంద్రానికి నివేదికలు పంపిన తర్వాత ప్రత్యేక చొరవతో నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget