అన్వేషించండి

Amaravati : అమరావతి లో రెండో విడత భూ సమీకరణ ఏయే గ్రామాల్లో ఎన్నెన్ని ఎకరాలు అంటే...!

Amaravati : అమరావతిలోని ఏయే గ్రామాల్లో ఎన్నెన్ని ఎకరాలు ఏపీ ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ చేపట్టనుంది. పూర్తి వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

Amaravati : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం అదనంగా భూ సమీకరణ చెయ్యాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్ కూడా దానికి ఆమోదం తెలపడంతో ఇక భూ సమీకరణ ప్రక్రియ మొదలైనట్టే. రెండో విడతలో ప్రభుత్వ భూములతో కలిపి గ్రామాల వారీగా రాజధాని కోసం తీసుకోబోతున్న భూముల వివరాలు ఇలా ఉన్నాయి.

తుళ్లూరు మండలం (ఎకరాల్లో)

పెదపరిమి 6513.52
వడ్డ మాను 1936.87
హరిచంద్రపురం 2428.25
మొత్తం 10878.64

అమరావతి మండలం

వైకుంఠపురం 3361.48
యండ్రాయి 2166.04
కర్లపూడి 2944.10
మొత్తం 9617.58

గతంలో అమరావతి కోసం 29 గ్రామాల్లో  34,000 ఎకరాలు సేకరించింది ప్రభుత్వం. ఇది తొలిదశలో చేసిన ల్యాండ్ పూలింగ్. ఇప్పుడు రెండో దశలో మరో 16,666 ఎకరాలు భూ సమీకరణ కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి ప్రభుత్వ భూములు కూడా కలిపి మొత్తం 20,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లోనికి రానున్నాయి.

అమరావతి లో రెండో దశ భూముల సేకరణ జరిగే విధానం ఏంటంటే...!

రెండోదశ పూలింగ్ ప్రక్రియ దశలు ఈ విధంగా ఉండబోతున్నాయి.

ముందుగా సెక్షన్‌ 55(4) కింద కాంపిటెంట్‌ అధికారి ప్రాంతాల వారీ పూలింగు ప్రకటన చేస్తారు. కొత్తగా సమీకరించే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజియన్‌ భూ సమీకరణ పథకం 2025 రూల్స్‌ వర్తిస్తాయి. దానివల్ల ప్రభుత్వానికి లీగల్ సమస్యలు రావు. రైతులకు ఇచ్చే రిటర్నబుల్‌ ప్లాట్లను ఎపిసిఆర్‌డిఎ చట్టం 2014లో సెక్షన్‌ 43(3) కింద నమోదు చేస్తారు.

సెక్షన్‌ 48(1), 50 ప్రకారం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

పూలింగు ఏరియాలో నియమించే అధికారులు రైతుల నుంచి అభ్యంతరాలు ఏవైనా ఉంటే స్వీకరిస్తారు. ఈ అభ్యంతరాలను తెలిపేందుకు 30 రోజులపాటు అవకాశం ఇస్తారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణాన్ని సర్వేచేసి రైతులు ఇచ్చిన దరఖాస్తులకు ఆమోదం తెలుపుతుంది CRDA.

అనంతరం రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు తిరిగి ఇచ్చేందుకు గతంలో మాదిరి కాకుండా సింగిల్ టైం లోనే సెటిల్ చేస్తారు.2025 పూలింగు చట్టంలో సెక్షన్లు 44, 53కి అనుగుణంగా అభివృద్ధి అవసరాలకు 50 శాతం భూమిని కేటాయిస్తారు. దీనిలో పార్కులు, ఆటస్థలాలు, తోటలకు, ఓపెన్‌స్పేస్‌కు 10 శాతం, రోడ్లు, యుటిలిటీ సేవలకు 30 శాతం, సామాజిక సదుపాయాలకు ఐదుశాతం, గృహాలకు ఐదుశాతం కేటాయింపులు చేస్తారు.సెక్షన్‌ 57(2) ప్రకారం తుది నోటిఫికేషన్‌ జారీచేసిన అనంతరం సిఆర్‌డి.ఏ చేతిలోకి భూమి బదిలీ అవుతుంది.

తరువాత సెక్షన్‌ 57(3) ప్రకారం రైతులకు ల్యాండ్‌ పూలింగ్‌ ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. దీనికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం.ఈ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌ పద్ధతిలోనే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దానినే అసలు ధ్రువపత్రంగా గుర్తిస్తారు. 

పూలింగ్‌ ఏరియాలో జాయింట్‌ కలెక్టర్‌ నిర్ధారించిన అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ భూములపై అభ్యంతరాలకు 15 రోజుల గడువు ఇచ్చి అనంతరం 6 నెలల్లో మూడో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అదే అమరావతి ల్యాండ్ పూలింగ్ కి సంబంధించిన తుది నోటిఫికేషన్‌గా ఎండ్ అవుతుంది.

పాత చేదు అనుభవాల దృష్ట్యా లీగల్ సమస్యలు  రాకుండా జాగ్రత్త పడుతున్న ప్రభుత్వం

గతంలో ఉన్న అనుభవాలు, అభ్యంతరాలపై ల్యాండ్ పూలింగ్ ఇష్టం లేని రైతులు కోర్టును ఆశ్రయించడం వంటి ఇబ్బందులు పెట్టకుండా కొత్త పూలింగ్‌ చట్టంలో సెక్షన్‌ 55 (2) కింద రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నట్లుగా అంగీకారపత్రం తీసుకుంటుంది ప్రభుత్వం. దీనికోసం ఆధార్‌ ఆధారిత గ్యారంటీతోపాటు రిజిస్ట్రేషన్‌ తరహాలో ముందుగానే ఆమోదం తెలిపినట్లు వేలిముద్ర తీసుకుంటారు. పూలింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటి సెక్షన్‌ 49 ప్రకారం రైతులు భూములు వ్యవసాయ అవసరాలకు వినియోగించకుండా నిషేధం అమలులోకి తెచ్చి రాజధాని పనుల కోసం కేటాయిస్తారు. దానితో అమరావతిలో రెండో విడత పూలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lokesh Latest News: వీడిన నారా లోకేశ్ పూజ గదిలోని బొమ్మ మిస్టరీ! క్షుద్ర పూజలంటూ వస్తున్న విమర్శలపై మంత్రి వివరణ! 
వీడిన నారా లోకేశ్ పూజ గదిలోని బొమ్మ మిస్టరీ! క్షుద్ర పూజలంటూ వస్తున్న విమర్శలపై మంత్రి వివరణ! 
Andhra Pradesh Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Vijayd Deverakonda Rashmika : చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget