అన్వేషించండి

Amaravati Railway Line : అమరావతి రైల్వే లైన్ రూట్ మ్యాప్ ఇదే ! ఎన్ని స్టేషన్లు, బడ్జెట్ ఎంతంటే?

Amaravati Railway Line : అమరావతి రైల్వే లైన్ రూట్ మ్యాప్ ఎక్కడ ప్రారంభమవుతుంది. ఎక్కడ వరకు ఉంటుంది. ఏయే స్టేషన్లను టచ్ చేస్తుంది. ఇంతకీ ఎంత బడ్జెట్‌తో రూట్ పూర్తి అవుతుంది లాంటి వివరాలు ఇక్కడ చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమరావతి మీదుగా 57 కి.మీ. రైల్వే లైన్, రూ. 2047 కోట్ల వ్యయంతో రానుంది.
  • ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త స్టేషన్లతో అమరావతి లైన్ ఏర్పాటు కానుంది.
  • 2029 నాటికి నిర్మాణం పూర్తి, భూసేకరణపై రైల్వే శాఖ ఆధారపడి ఉంది.
  • రాష్ట్ర, రైల్వే శాఖల మధ్య చర్చలు, భూసేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

Amaravati Railway Line : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మీదుగా ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం ఓకే చెప్పింది. అయితే దాని రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అనే దానిపై చాలా మందికి క్లారిటీ లేదు. వాటికి స్పష్టత ఇచ్చేలా ABP దేశం ఇస్తున్న exclusive డీటెయిల్స్ ఇవి.

57కిలోమీటర్ల పొడవు... 2047కోట్ల ఖర్చు 

అమరావతికి ప్రత్యేక లైన్ 08.11.24న శాంక్షన్ అయింది. దీని పొడవు 56.53 కిలోమీటర్లు (దాదాపు 57కిలోమీటర్లు). ఈ ప్రాజెక్ట్‌కి అయ్యే ఖర్చు 2047.40కోట్లు. ఈ బడ్జెట్ మొత్తం రైల్వే శాఖ భరిస్తుంది. కానీ భూమిని మాత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది.

ఎర్రుపాలెం నుంచి నంబూరు స్టేషన్ల మధ్య రానున్న అమరావతి రైల్వే లైన్, కొత్తగా వచ్చే స్టేషన్స్ ఇవే.

అమరావతి రైల్వే లైన్ ప్రస్తుతం  మధిర -విజయవాడ లైన్‌లోని ఉన్న ఎర్రుపాలెం స్టేషన్ నుంచి విజయవాడ -గుంటూరు లైన్‌లో ఉన్న నంబూరు స్టేషన్ వరకూ సపరేట్‌గా రానుంది. ఈ లైన్ రాజధాని గ్రామాల గుండా సాగనుంది. ఎర్రుపాలెం -నంబూరు మధ్య పెదపురం, చెన్నారావు పాలెం,గొట్టుముక్కల, పరిటాల,కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం స్టేషన్‌లు కొత్తగా ఏర్పడనున్నాయి. రాష్ట్రప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలపడంతో భూసేకరణ జరగగానే ఈ లైన్ ఏర్పాటు పనులు ప్రారంభించనుంది రైల్వే శాఖ. ఈ లైన్ పూర్తి అయితే అమరావతి నుంచి ఎర్రుపాలెం మీదుగా హైదరాబాద్.. నంబూరు మీదుగా విజయవాడ,వైజాగ్,గుంటూరు, చెన్నై,బెంగుళూరు లాంటి మార్గాలకు కనెక్టివిటీ రానుంది.

ఎప్పటికి పూర్తవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు 2029 జనవరి కల్లా అమరావతి రైల్వే లైన్ పూర్తి కావాలని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి రైల్వేకి అప్పగిస్తారు అనే దానిపై ఆధారపడి అమరావతి రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అవుతుందని అని నిపుణులు చెబుతున్నారు

ఇప్పటికే ప్రభుత్వంతో రైల్వే చర్చలు 

ఏపీ సీఎం చంద్రబాబుతో ఇప్పటికే విజయవాడ DRM సహా రైల్వే అధికారులు పలుమార్లు భేటీ అయ్యారు. అమరావతి రైల్వే లైన్‌ఫై రాష్ట్రప్రభుత్వం, రైల్వే శాఖ క్లారిటీతో ఉన్నాయి. మరోవైపు అమరావతి రైల్వే స్టేషన్‌ను భారీగా నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నా దానికి పెద్ద ఎత్తున భూమి కావాలి. దానికోసం ప్రస్తుతం భూసేకరణ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రైల్వే లైన్ ఖర్చు మాత్రం రైల్వే శాఖదే. ఈ లైన్ మధ్య కొన్ని బ్రిడ్జ్ లు కూడా నిర్మించాల్సి ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా ప్రభుత్వం భూ సేకరణ జరిపి ఇస్తే అంత త్వరగా పనులు మొదలు పెట్టడానికి రైల్వే రెడీగా ఉంది.

Frequently Asked Questions

అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ ఎప్పటినుండి మంజూరు చేయబడింది?

అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ 08.11.24న మంజూరు చేయబడింది. ఈ ప్రాజెక్ట్‌కి అయ్యే ఖర్చు 2047.40కోట్లు. రైల్వే శాఖ మొత్తం బడ్జెట్‌ను భరిస్తుంది.

అమరావతి రైల్వే లైన్‌ను ఎవరు నిర్మిస్తారు మరియు భూసేకరణ బాధ్యత ఎవరిది?

ఈ ప్రాజెక్ట్‌ను రైల్వే శాఖ నిర్మిస్తుంది మరియు మొత్తం బడ్జెట్‌ను అదే భరిస్తుంది. అయితే, భూసేకరణ బాధ్యత మాత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే.

అమరావతి రైల్వే లైన్‌కు సంబంధించిన కొత్త స్టేషన్లు ఏవి?

ఈ లైన్‌లో పెదపురం, చెన్నారావు పాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం స్టేషన్‌లు కొత్తగా ఏర్పడనున్నాయి.

అమరావతి రైల్వే లైన్‌ను ఎప్పటిలోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు?

రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, 2029 జనవరి కల్లా అమరావతి రైల్వే లైన్ పూర్తి కావాలని భావిస్తున్నారు. అయితే, ఇది భూసేకరణ వేగంపై ఆధారపడి ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget