అన్వేషించండి

Amaravati Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి శ్రీకారం.. దేశంలో తొలి సహా దీని ప్రత్యేకతలు ఇవే

Quantum Computing | తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీ భవనానికి పునాది వేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు అట్టహాసంగా శంకుస్థాపన జరిగింది. ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిసి ఈ భారీ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించి పునాదిరాయి వేశారు. భవిష్యత్ టెక్నాలజీకి చిరునామాగా నిలవబోయే ఈ వ్యాలీని సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించారు. క్వాంటం కంప్యూటింగ్ సహా, కమ్యూనికేషన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం సెన్సార్స్, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ తదితర రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ నిలవనుంది.

తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో క్వాంటమ్‌ వ్యాలీ బిల్డింగ్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, పి.నారాయణ, కందుల దుర్గేష్‌, ఐబీఎం, టీసీఎస్,ఎల్  అండ్ టీ సంస్థలకు చెందిన ప్రతినిధులు, తిరుపతి, చెన్నై ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు, వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులు  పాల్గొన్నారు. ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్, వైసర్ క్వాంటం ట్యాలెంట్ హబ్‌

ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు వరుసల్లో 8 భారీ టవర్ల నిర్మాణం చేపట్టారు. అందులో ఒకటి 48 అంతస్తులు కాగా, మరొకటి 29 అంతస్తుల ఎత్తుతో రాజధానికే తలమానికంగా నిలిచేలా ప్లాన్ చేశారు. మొత్తం 8.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు సాగాయి. అలాగే, రెండెకరాల స్థలంలో 43 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో జీ ప్లస్ వన్ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవన నిర్మాణానికి అంకురార్పణ చేశారు.


Amaravati Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి శ్రీకారం.. దేశంలో తొలి సహా దీని ప్రత్యేకతలు ఇవే

ఈ ప్రతిష్టాత్మక టవర్ల నిర్మాణ బాధ్యతను ప్రముఖ సంస్థ ఎల్ అండ్ టీ (L&T) తీసుకోగా, క్వాంటం కంప్యూటర్ల తయారీలో గ్లోబల్ జెయింట్ ఐబిఎం (IBM) భాగస్వామి అయ్యింది. వీటికి అవసరమైన సాఫ్ట్‌వేర్ సేవలను అందించేందుకు టీసీఎస్ (TCS) ముందుకు వచ్చింది. అమరావతిలో 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి ప్రపంచ స్థాయి నగరాల సరసన మన రాజధాని కూడా నిలిచింది.

క్వాంటం కంప్యూటర్లు ఎగుమతి

ఈ క్వాంటం వ్యాలీ సెంటర్ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు క్వాంటం కంప్యూటర్లను ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా అమరావతి అవతరించింది. ప్రభుత్వ లక్ష్యం మేరకు అదే ఏడాది ఆగస్ట్ నాటికి క్వాంటం వ్యాలీని ప్రారంభించి, డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో క్వాంటం కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 

భారత్‌లో తొలి ఐక్యూసీ అమరావతిలో..
అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ క్వాంటం నెర్వ్ సెంటర్ గా మారుతుంది. అమరావతి క్వాంటం వ్యాలీ నుంచి క్వాంటం హార్డ్ వేర్ యాక్సెస్ ఉంటుంది. పరిశోధనలు, ఆవిష్కరణల కోసం కొత్త ఆల్గారిథమ్స్, క్రిప్టో గ్రఫీ అవసరం అవుతుంది. దానికి అనుగుణంగా నిపుణులు అవసరం. అందుకే అమరావతిలో క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 35 క్యూఐసీలతో పాటు భారత్‌లో మొదటి క్యూఐసీ అమరావతిలో అందుబాటులోకి వస్తోంది - ఐబీఎం ప్రతినిధి అమిత్ సింఘీ 

35 లక్షల మంది విద్యార్ధులకు క్వాంటం కంప్యూటింగ్ లో శిక్షణ
వైసర్ క్వాంటం ట్యాలెంట్ హబ్‌ను ఆవిష్కరించారు. వైసర్ సంస్థ ప్రతినిధి వరదాన్ మాట్లాడుతూ.. ‘ అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ద్వారా క్వాంటం రంగంలో నిపుణుల్ని తయారు చేసేలా వైసర్ సంస్థ శిక్షణ ఇవ్వనుంది. సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ద్వారా దశలవారీగా 2035 నాటికి 35 లక్షల మంది విద్యార్ధులకు క్వాంటం కంప్యూటింగ్ లో శిక్షణ ఇస్తాం. క్వాంటం హార్డ్ వేర్, సిమ్యులేటర్లు, టూల్ కిట్స్ సహా 10 వేల నిముషాల క్వాంటం హెచ్ పీసీ కంప్యూటర్ క్రెడిట్స్ ను ఇచ్చేలా నిర్ణయం. క్వాంటం రెడీ వర్క్ ఫోర్సును తయారు చేసే లక్ష్యంగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయనున్నాం. ఆధునిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధి సాధించే విజన్ ఆంధ్రప్రదేశ్ లో భారత్ లోనూ కనిపిస్తోంది. భారతీయుడిగా దీని పట్ల నేను గర్విస్తున్నాను. అమరావతిలో వైజర్ క్వాంటం ట్యాలెంట్ హబ్ ను ఆవిష్కరిస్తున్నాం. వైసర్ సంస్థ అమెరికా వెలుపల తొలిసారి అమరావతిలో ఈ  ఎక్స్ లెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోందని’ తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
Ind vs Ire 2nd T20: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ డకౌట్.. టీమిండియా ఓపెనర్ల ఖాతాలోకి చెత్త రికార్డు
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ డకౌట్.. టీమిండియా ఓపెనర్ల ఖాతాలోకి చెత్త రికార్డు
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Coffee Sugar Scrub : కాఫీ, పంచదారతో బాడీ స్క్రబ్.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారాలంటే ఇలా చేయండి
కాఫీ, పంచదారతో బాడీ స్క్రబ్.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారాలంటే ఇలా చేయండి
Embed widget