అన్వేషించండి

Amaravathi Farmers Protest @ 900: నెలలు కాదు ఏళ్లు గడిచిన రాజధాని మార్చడం ప్రభుత్వ వల్ల కాదు- అమరావతి విషయంలో ప్రభుత్వం తీరుపై మేథావుల ఆగ్రహం

అమరావతికి అనుకూలంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 900 రోజులకు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక వేత్తలు వారికి మద్దతు ప్రకటించారు.

అమరావతికి అనుకూలంగా రైతులు చేస్తున్న ఉద్యమం 900 రోజులైన సందర్భంగా అమరావతి జేఏసీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న మేథావులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అమరావతి రైతులకు మద్దతు ప్రకటించారు. రాజధాని నిర్మాణ విషయంలో ఏపీ హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింద‌ని దాన్ని నుంచి తప్పించుకొని ప్రభుత్వం రాజధానిని మార్చలేదని వాళ్లంతా అభిప్రాయపడ్డారు.  అమరావతిపై హైకోర్టు తీర్పు - సర్కారు తీరు అనే అంశంపై వచ్చిన వాళ్లంతా విజయవాడలో సమావేశమై చర్చించారు. 

ప్రభుత్వానిది కోర్టు ధిక్కరణ: గోపాల గౌడ్ 

రాజధాని కోసం 33 వేల ఎకరాలు తీసుకుని  ప్రభుత్వం మారగానే దానికి భిన్నంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని సుప్రీం కోర్టు మాజీ న్యాయ‌మూర్తి గోపాల గౌడ్ అభిప్రాయ‌ప‌డారు. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు చట్టబద్దం, రాజ్యాంగ బద్దంగా ఉందన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు తీసుకుని రైతులకు విశ్వాసం కల్పించి ప్రభుత్వం మారగానే దానికి భిన్నంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.. న్యాయ స్థానం చెప్పినా దాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం ఏ ధైర్యంతో ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు. మూడు నెలలు గడుస్తున్నా కోర్టు తీర్పును అమలు చేయకపోతే అది కచ్చితంగా కోర్టు తిరస్కరణ అవుతుందని స్పష్టం చేశారు.

ప్రజలకు ఎలా విశ్వాసం ఉంటుంది?: ప్రొఫెసర్‌ హరగోపాల్

నాలుగేళ్ల క్రితం అమరావతి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందన్నారు పౌరుహక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్... ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయలేదని ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు ఎలా మారిపోతాయని నిలదీశారాయన. గత ప్రభుత్వం తప్పు చేసి ఉంటే దానిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలే తప్ప ఇలా ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టడం మాత్రం బాగాలేదన్నారు. కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా ప్రభుత్వం పట్టించున్నట్టు  కనిపించడం లేదని.... ప్రభుత్వాలే ఇలా చేస్తే ప్రజల్లో ఎలా విశ్వాసం వస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను నమ్మి మాత్రమే ప్రజలు భూములు ఇచ్చారని... అప్పటి పార్టీతో ప్రజలకు ఏం సంబంధమని అడిగారాయన. 

మోదీనే వెనక్కి తగ్గారు జగన్ ఓ లెక్కా?: గోపాలరావు 

రాజధాని అమరావతికి ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అన్న వర్గాల వాళ్లు భూములు ఇస్తే ఓ సామాకి వర్గానికి పరిమితం చేస్తూ ప్రజాప్రతినిధులు చేస్తున్న విమర్శలను చర్చావేదికకు వచ్చిన మేథావులు ఖండించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గోపాలరావు మాట్లాడుతూ... రైతులను ఇబ్బంది పెట్టి రాజకీయాలు చేయడమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. అమరావతి నుంచి రాజధాని తరలించడం ప్రభుత్వం వల్ల కాదని తెలిపారాయన. ఎన్నో చర్చలు, సమావేశాల తర్వాత గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని పెట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు గోపాలరావు. రాజధాని అక్కడే ఉంటుందని ఇప్పటికే కొన్ని నిర్మాణాలు ప్రారంభమయ్యాయని... కొన్ని విద్య, వైద్య సంస్థలు కూడా వచ్చాయని గుర్చు చేశారు. ఇదంతా ఆలోచించిన కోర్టులు ఇక్కడ ప్రజలకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. దాన్ని  ఉల్లంఘిస్తున్న ప్రభుత్వంపై ధిక్కరణ కేసు పెట్టాలన్నారు గోపాలరావు. మోదీ లాంటి వ్యక్తే రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారన్నారు. 

పెద్ద కుమారుడికి కేంద్రం చెప్పలేదా?:కమలానంద భారతి

కేంద్రంలో పాలించిన కాంగ్రెస్, బీజేపీ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇలా ఉందన్నారు ఆధ్యాత్మికవేత్త కమలానంద భారతి. రాజధాని లేకుండా రాష్ట్రం విభజించడం కాంగ్రెస్ చేసిన తప్పైతే... దాన్ని అంగీకరించి బీజేపీ అదే స్థాయి తప్పు చేసిందన్నారు. ఇప్పుడు రాజధాని లేకుండానే రాష్ట్రాన్ని పాలించేలా సీఎం జగన్‌ను కేంద్రం ప్రోత్సహిస్తోందన విమర్శించారు. జగన్‌ను పెద్ద కుమారుడిలా చూస్తున్న కేంద్రం.. రాజధానిపై సరైన దిశానిర్దేశం చేస్తే బాగుంటుందని సూచించారు. 

వికేంద్రీకరణకు వేరేగా మార్గాలున్నాయి: కోదండరామ్

వికేంద్రీకరణ చేయాలనుకుంటే దానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలే తప్ప అభివృద్ధి చెందుతున్న రాజధానిని ఎలా ముక్కలు చేస్తారని ప్రశ్నించారు ప్రొఫెసర్ కోదండరామ్‌. రైతుల మనోభావాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పని అభిప్రాయపడ్డారు. అదే టైంలో హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా అనుసరిస్తున్న వైఖరి కూడా ఏం బాగాలేదన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget