అన్వేషించండి

Amit Shah AP Leaders : కేంద్ర నిధులతో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.. ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా సూచన !

ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు అమిత్ షా సూచించారు. ఏపీ ముఖ్య నేతలతో తిరుపతిలో సమావేశమయ్యారు.

తిరుపతి పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. తిరుపతిలోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఏపీలో బీజేపీని ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై సమాలోచనలు చేశారు. పార్టీ నేతలకు అమిత్ షా కీలక సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు విరివిగా నిధులు ఇస్తోందని..  కేంద్ర నిధులతో ఏపీలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియచేయాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. ఏపీకి ఉదారంగా కేంద్రం నిధులు మంజూరు చేస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కరోనా సమయంలో ఆంధ్ర ప్రజలను కేంద్రం ఆదుకుందుని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 

Also Read : అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !

బీజేపీ నేతలు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ కొన్ని విషయాల్లో స్పష్టంగా ప్రజలకు అభిప్రాయాలను చెప్పలేకపోతోందని ఈ విషయంలో స్పష్టత ఉంటే బాగుంటుందని అమిత్ షా దృష్టికి కొంత మంది నేతలు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అమరావతి రాజధాని విషయంలో ఏపీ బీజేపీ తీర్మానం చేసిందని కానీ రైతులకు మద్దతుగా ఇచ్చే విషయంలో మాత్రం ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. మరికొన్ని విషయాల్లోనూ అదే పరిస్థితి ఉందని.. ఈ గందరగోళానికి తెర దించాలని షాను కొంత మంది నేతలు కోరినట్లుగా చెబుతున్నారు. 

Also Read : విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా

కొంత మంది నేతలు ఏపీ ప్రభుత్వ నిర్బంధాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులపైనా దాడులు చేశారని..  పలు చోట్ల బీజేపీ నేతలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే జనసేనతో పొత్తు ఉన్నప్పటికి రాష్ట్ర స్థాయిలో సమన్వయం కుదరడం లేదని.. రెండు పార్టీలు వేర్వేరుగా కార్యాచరణ చేపట్టాయని.. అలా చేయడం వల్ల రెండు పార్టీల క్యాడర్ కలసి పని చేయడం లేదన్న అభిప్రాయం వస్తోందన్నారు.  పార్టీల నేతల అభిప్రాయాలన్నింటినీ అమిత్ షా జాగ్రత్తగా విన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read : ఎంపీ అవినాష్ రెడ్డికి ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వాలి... వివేకా డ్రైవర్ వాంగ్మూలంపై డీజీపీ స్పందించాలి... టీడీపీ నేతల కామెంట్స్

బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కొన్ని కీలకమైన చర్యలను అమిత్ షా పార్టీ నేతలకు సూచించి అమలు చేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. అమిత్ షాతో సమావేశంలో పాల్గొన్న వారిలో పురందేశ్వరి, సత్యకుమార్, సోము వీర్రాడు, కన్నా లక్ష్మినారాయణ, జీవీఎల్, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఉన్నారు. అమిత్ షా కొంత మందితో ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. 

Also Read : కుప్పంలో దొంగ ఓటర్ల కలకలం ... పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget