By: ABP Desam | Updated at : 15 Dec 2022 03:35 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
చంద్రబాబు
Chandrababu Letter To CS : మాండూస్ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని లేఖలో కోరారు. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. తుపాను ప్రభావంతో అనంతపురం, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరి, అరటి, బొప్పాయి, అపరాలు, పొగాకు, శనగ, మిరప, ప్రత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. వర్షాలతో కోతకు వచ్చిన వరి పంట నీటమునిందన్నారు. కోతలు కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు వేల కోట్ల నష్టం జరిగిందని, అయినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు.
వరి రైతులకు గోనె సంచుల కొరత
"ధాన్యం సేకరణలో ప్రభుత్వం భారీగా కోత విధించింది. ప్రభుత్వ ఆంక్షలు, కొత్త నిబంధనలతో పంటను సరైన ధరకు అమ్ముకునే పరిస్థితి లేకపోయింది. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ధాన్యంలో తేమ 17 శాతం కన్నా అధికంగా ఉంటే మద్దతు ధరలో కోత విధిస్తున్నారు. తేమ శాతం తగ్గించుకునేందుకు 20 రోజులుపైగా ధాన్యాన్ని రోడ్లపై, కళ్లాల్లో ఉంచాల్సి వస్తుంది. ధాన్యం ఆరబెట్టడానకి బరకాలు, టార్పాలిన్లు, కూలీల ఖర్చు రైతుకు అదనపు భారంగా మారింది. ధాన్యం కొనుగోలుపై పరిమితులు విధించి, దళారులకు అమ్ముకోవాలని ప్రభుత్వమే సూచించడం సరైన పద్ధతి కాదు. వరి రైతులకు గోనె సంచుల కొరత కూడా వేధిస్తుంది. రాయితీపై రైతులకు అందించే టార్పాలిన్ల పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది." - చంద్రబాబు
ఏపీలో రైతు ఆత్మహత్యలు పెరగడానికి కారణం జగన్ రెడ్డి రైతు వ్యతిరేక పాలనే అంటున్నారు. పాలకులు చెబుతున్న రైతు భరోసా కేంద్రాలు రైతును దగా చేస్తున్నాయి. ఈ మాట వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన రైతులే చెబుతున్నారు. ఈసారి జగన్ రెడ్డి గెలిస్తే వ్యవసాయం బతకదని వారు అంటున్నారు pic.twitter.com/AUVdLZjkN5
— Telugu Desam Party (@JaiTDP) December 12, 2022
తేమతో సంబంధంలేకుండా ధాన్యం కొనుగోలు
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 1.25 లక్షల ఎకరాల్లో పొగాకు రైతులు నష్టపోయారని చంద్రబాబు అన్నారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు. తుపానుతో నష్టపోయిన వరి, అపరాలకు ఎకరానికి రూ.20 వేలు, వాణిజ్య, ఉద్యానవన పంటలకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం చెల్లించాలని చంద్రబాబు లేఖలో కోరారు. ఈ-క్రాప్ నిబంధలు, ఆంక్షలు లేకుండా ఇన్యూరెన్స్ అందించాలన్నారు. కౌలు రైతులకు నేరుగా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పంట నూర్చిన వెంటనే అక్కడే కొనుగోలు చేసే విధానం అమలుచేయాలన్నారు. ధాన్యంలో తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Minister Botsa Satyanarayana : రాజకీయాలు దిగజారడానికి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులే కారణం - మంత్రి బొత్స
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
గంజాయి స్మగ్లర్లు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసుల స్పెషల్ కౌన్సిలింగ్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ