అన్వేషించండి

Supreme Court : మే 9 వ తేదీన సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - ప్రభుత్వ విజ్ఞప్తితో ముందే లిస్టింగ్ !

మే 9వ తేదీన సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణకు రానుంది. ముందే విచారణ జరపాలని ప్రభుత్వం కోరడంతో లిస్ట్ అయింది.


Supreme Court :  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు సుప్రీంకోర్టులో మళ్లీ ముందుకు వచ్చింది. ఈ నెల తొమ్మిదో తేదీన విచాణరణకు లిస్ట్ అయింది. జస్టిస్ కే.ఎం జోసెఫ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అమరావతిని అన్ని మౌలిక వసతులతో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని కోర్టు మార్చి 3, 2022న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పులోని రెండు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. రాష్ట్ర శాసనసభ అధికారాలపై కోర్టు నిర్ణయం తీసుకోలేనందున ఏపీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. 
Supreme Court :  మే 9 వ తేదీన సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - ప్రభుత్వ విజ్ఞప్తితో ముందే లిస్టింగ్ !

గత విచారణలో అమరావతి పై పిటిషన్ల విచారణ సందర్భంగా.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు పదే పదే కోరారు. తమ స్టే పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. జులై 11 న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం చెప్పింది. జులై 11 వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా వాడీ వేడి వాదనలు జరిగాయి. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదని.. ఏపీ తరఫున కెకె వేణుగోపాల్ వాదించారు. జూన్ 16వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ కెఎం జోసెఫ్.. అందుకే ఈ కేసు విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. తాను రిటైర్ అవుతున్న సమయంలో.. అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ గత విచారణలో వ్యాఖ్యానించారు.
  
సుప్రీంకోర్టు ఈ కేసును స్వీకరించి ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా పడింది. పిటిషనర్లుగా ఉన్న కొందరు రైతులు ఏళ్ల తరబడి చనిపోయారని రైతుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చనిపోయిన రైతుల ప్రతినిధులను పిటిషనర్లుగా అనుమతించాలని కోర్టును కోరారు. . ఆ మేరకు రైతుల ప్రతినిధులకు నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులకు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రతీ సారి అమరావతి కేసును త్వరగా విచారించాలని ప్రభుత్వం మెన్షన్ చేస్తోంది. ఈ సారి కూడా అలాంటి ప్రయత్నమే చేయడంతో మే 9వ తేదీన విచారణ చేపట్టాలని నిర్ణయించారు. 

సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. హైకోర్టు తీర్పుపై స్టే వస్తే పరిపాలనా రాజధానిని తరలించడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే సీఆర్డీఏ చట్టం  ప్రకారం.. రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో రైతులు  తమకు న్యాయం జరుగుతుందనే భావిస్తున్నారు.  రాజధాని కోసం మాత్రమే తాము భూములిచ్చారని.. ఇప్పుడు తమ భూముల్ని రాజధాని కోసం కాకుండా రాజకీయాల కోసం వాడుకుంటున్నారని వారు న్యాయపోరాటం చేస్తున్నారు.                                         

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget