అన్వేషించండి

Pegasus House Committe : డేటా చోరీ జరిగిందన్న హౌస్ కమిటీ - రిపోర్ట్ ఇవ్వాలని టీడీపీ సభ్యుల డిమాండ్ !

పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీ నియమించిన హౌస్ కమిటీ డేటా చోరీ జరిగిందని ప్రాథమకంగా నిర్ధారించింది. తమకు రిపోర్ట్ ఇవ్వాలని టీడీపీ సభ్యులు సభలో ఆందోళన చేశారు.

Pegasus House Committe :  పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వ్యక్తులపై నిఘా పెట్టారా లేదా అన్న అంశంపై తేల్చేందుకు గత అసెంబ్లీ సమావేశాల్లో నియమించిన హౌస్ కమిటీ ఏపీ అసెంబ్లీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. హౌస్ కమిటీ ఛైర్మన్  భూమన కరుణాకర్ రెడ్డి నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.  గత ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందని కమిటీ ప్రాథమికంగా నిర్ధారించిందని తెలిపారు. దీనిపై ఇంకా విచారణ జరగాల్సి ఉందన్నారు.  డేటా చౌర్యం ఆరోపణలపై మార్చి 23న శాసనసభ ఒక సభా సంఘాన్ని వేసిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 

స్టేట్ డేటా సెంటర్‌లో ఉండాల్సింది టీడీపీ వ్యక్తులకు చేరిందన్న హౌస్ కమిటీ 

గత ప్రభుత్వ హాయాంలో 2016 నుంచి 2019 మే 30 వరకూ టీడీపీ ప్రభుత్వం స్టేట్ డేటా సెంటర్ ఉండాల్సిన సమాచారాన్ని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేరుగా ఆ సమాచారాన్ని పంపించారని తెలిపారు. తద్వారా వారు ప్రత్యేక లబ్ధి చేకూర్చుకున్నారని ఆరోపించారు. 2018, 2019 మధ్య కాలంలో వాళ్ల ప్రైవేటు సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, టీడీపీ వారు ఏర్పాటు చేసిన సేవా మిత్ర అనే యాప్ ద్వారా దాదాపు 30 లక్షలకు పైగా తమ ప్రభుత్వానికి వేయని ఓటర్ల ఓటు హక్కును రద్దు చేసిందని కమిటీ పరిశీలనలో తెలిపిందన్నారు.  

మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందన్న కమిటీ చైర్మన్

వివిధ శాఖల అధిపతులు, సంబంధిత అధికారులతో డేటా చౌర్యంపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశామని భూమన తెలిపారు. మొత్తం 85 పేజీలతో నివేదిక ఉంది. ఇది మధ్యంతర నివేదిక మాత్రమనని చెప్పడంతో హౌస్ కమిటీ విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే హౌస్ కమిటీ నివేదికను ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఆ తర్వాతే చర్చ ప్రారంభించాలన్నారు. అయితే నివేదిక ఇవ్వకపోవడంతో టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. వారి నిరసనల మధ్య సభా కార్యక్రమాలు కొనసాగించారు. 

చంద్రబాబు పెగాసస్ వాడారని మమతా బెనర్జీ అన్నట్లుగా వార్తలు రావడంతో హౌస్ కమిటీ 

పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను చంద్రబాబు ఉపోయగించారంటూ బెంగాల్‌లో మమతా బెనర్జీ వ్యాఖ్యానించారని ఓ సారి ప్రచారం జరగడంతో  అసెంబ్లీలో దీనిపై చర్చించారు.  సభా సంఘం వేయాలని నిర్ణయించి.. ఆ కమిటీ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. అయితే  పెగాసస్ అంశాన్ని ఉపయోగించారా లేదా అన్నదాని కన్నా ఎక్కువగా ఈ కమిటీ డేటా చౌర్యంపై విచారణ జరిపినట్లుగా కనిపిస్తోంది. 

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ 

ఉదయం నుంచి సంక్షోభంలో సంక్షేమం పేరుతో టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.  హౌస్ కమిటీ నివేదిక విషయంలోనూ వారు నివేదిక ఇవ్వాలని పట్టుబట్టారు. ఇవ్వకపోవడంతో  స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hasina death sentence: మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
Nitish Kumar To Take Oath As Bihar CM: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
Dhandoraa Teaser : చావు బతుకుల మధ్య ఎమోషన్ - ఆసక్తికరంగా 'దండోరా' టీజర్
చావు బతుకుల మధ్య ఎమోషన్ - ఆసక్తికరంగా 'దండోరా' టీజర్
Advertisement

వీడియోలు

Hombale Films to Buy RCB ? | RCB ఓనర్లుగా హోంబలే ఫిల్మ్స్ ?
Pujara on South Africa vs India Test Match | ప్లేయర్స్ కు సలహా ఇచ్చిన పుజారా
India vs South Africa First Test Match | భారత్ ఓటమికి కారణాలివే
Shubman Gill Injury India vs South Africa | పంత్ సారధ్యంలో రెండో టెస్ట్ ?
విశ్వం మూలం వారణాసి నగరమే! అందుకే డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hasina death sentence: మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
Nitish Kumar To Take Oath As Bihar CM: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
Dhandoraa Teaser : చావు బతుకుల మధ్య ఎమోషన్ - ఆసక్తికరంగా 'దండోరా' టీజర్
చావు బతుకుల మధ్య ఎమోషన్ - ఆసక్తికరంగా 'దండోరా' టీజర్
Delhi Blast Case Update: సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ - పెళ్లిపై సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్‌మెంట్
మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ - పెళ్లిపై సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్‌మెంట్
Kia Syros తో 9000 కిలోమీటర్లు జర్నీ: కంఫర్ట్‌, స్పేస్‌, పెర్ఫార్మెన్స్‌పై పూర్తి అనుభవం
Kia Syros లాంగ్ టర్మ్ రివ్యూ: 9000 km డ్రైవింగ్‌లో ఏం తేలింది?
Bison OTT : ఓటీటీలోకి విక్రమ్ కుమారుడి 'బైసన్' మూవీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విక్రమ్ కుమారుడి 'బైసన్' మూవీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget