అన్వేషించండి

PM Kisan Mobile App: పీఎం కిసాన్ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొని అప్లై చేసుకోవచ్చు

PM Kisan Mobile App: పీఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేంద్ర సర్కారు మొబైల్ యాప్ తీసుకువచ్చింది.

PM Kisan Mobile App: వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా రైతుల కోసం కేంద్ర సర్కారు 2019 లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం - కిసాన్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ.6 వేల చొప్పున, మూడు వాయిదాల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. దీని కోసం కిసాన్ మొబైల్ యాప్ ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు రైతులు ఇంటి వద్ద కూర్చొని సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫేస్-రికగ్నిషన్ టెక్నాలజీతో ఈ ప్రక్రియ సాగుతుంది. ఇందులో పేపర్ వర్క్, మాన్యువల్ అప్లికేషన్లు లేకుండా చాలా సులభతరంగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. ఈ యాప్ తో ఉన్న ప్రయోజనాలను కూడా కేంద్ర మంత్రి వివరించారు.

ఈ యాప్ ద్వారా ఇంటిగ్రేటెడ్ e-know యువర్ కస్టమర్(eKYC) ధ్రువీకరణ ఫీచర్ తో ఈ యాప్ ను తయారు చేసినట్లు కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. అలాగే ఈ యాప్ ద్వారా ఇతర వివరాలు కూడా తెలుసుకునే వీలు ఉంటుంది. లావాదేవీల స్థితి, భూమి రికార్డులను లింక్ చేసుకునే వెసులుబాటు( పీఎం కిసాన్ ద్వారా ప్రయోజనం పొందాలంటే ఇది కచ్చితంగా చేసుకోవాలి), ఏయే తేదీల్లో డబ్బు జమ అవుతుంది సహా కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించి ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా రైతులు ఇళ్లలో కూర్చొని పీఎం కిసాన్ కోసం ఎవరికి వారు స్వయంగా దరఖాస్తు చేసుకోచ్చని నరేంద్ర తోమర్ తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఈ యాప్ ను ఉపయోగిస్తారని చెప్పారు. ఒక్కో అధికారి 500 మంది వరకు రైతులను ఈ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసే వీలు ఉంటుందన్నారు. 

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు భారత్ కు తిరిగి రానున్నారు. వచ్చే సోమవారం  ప్రధాని మోదీ కర్ణాటకలోని బెలగావిలో వ్యవసాయదారులకు పీఎం కిసాన్ ఆదాయ బదిలీ పథకం కింద దాదాపు 80 కోట్ల మంది రైతులకు రూ. 16,800 కోట్ల విలువైన నగదును పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 

Also Read: ISRO News: ఇస్రో - నాసా జాయింట్ మిషన్, మోదీ పర్యటనలో కీలక ముందడుగు - పూర్తి వివరాలివీ

ప్రధానమంత్రి కిసాన్ యోజన అంటే ఏమిటి?

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, మోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి చిన్న మరియు మధ్య తరగతి రైతులకు ఏటా రూ. 6,000 రూపాయలు ఇస్తోంది. ఈ మొత్తాన్ని రూ. 2వేలు చొప్పున 3 విడతలుగా ఇస్తున్నారు.  ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద క్రెడిట్ కార్డునూ ఇస్తున్నారు. దీని ద్వారా సులభంగా కేసీసీను తయారుచేసుకోవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు 4 శాతం వడ్డీపై రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు రుణం లభిస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget