T20 World Cup 2026 Ind vs Pak | ఐసీసీలో ఒంటరిగా మిగిలిన పాక్
T20 ప్రపంచ కప్2026లో భారత్తో ఆడటానికి పాకిస్తాన్ నో చెపింది. కానీ మిగితా టీమ్స్ తో ఆడదానికి రెడీగా ఉంది. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) ఇంకా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council ) కు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు. ఇంతలోనే పాకిస్తాన్ను షాక్కు గురిచేసే ఒక విషయం బయటపడింది.
భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించాలనే తన ప్రయత్నంలో పాకిస్తాన్కు ఏ దేశం నుంచి కూడా మద్దతు లభించడం లేదు. ఈ విషయంలో ఐసిసి బోర్డు వద్ద పాక్ ఒంటరిగా మిగిలిపోయింది. సరైన కారణం లేకుండానే భారత్తో జరిగే మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరిస్తోందని మిగితా క్రికెట్ బోర్డులు చెప్తునట్టుగా తెలుస్తుంది.
ఐసిసి నిబంధనల ప్రకారం, ఒక జట్టు మైదానంలోకి దిగకపోతే, వాకోవర్ నిబంధన అమలులోకి వస్తుంది. భారత్ తో పాక్ ఆడకపోతే.. మన టీమ్ కు రెండు పాయింట్లు వచ్చే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్పై వాకోవర్ పొందడానికి భారత్ మైదానంలో ఉండాలి. వాక్ ఓవర్ జరిగితే, పాకిస్తాన్ పూర్తి 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 0 పరుగులు చేసినట్లుగా పరిగణిస్తారు. ఇది వారి రన్ రేట్ను ప్రభావితం చేస్తుంది.























