అన్వేషించండి

Kondabaridi dalam Present Situation | విప్లవ ఉద్యమాల పురిటిగడ్డ...ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డా

నక్జల్ బరి ఉద్యమం అంటే సీక్కోలు పురిటి గడ్డ అంటు చరిత్ర చెబుతుంది. అదికూడ ఇద్దరు మాష్టార్లుతో పుట్టింది. ఆరు దశాబ్దాల క్రితం అన్నింటా దోపిడీకి గురవుతున్న గిరిజన ప్రజలను చైతన్యపరచి వారి సహకారం, ప్రోత్సాహంతో శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటానికి శ్రీకారం చుట్టిన నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం లపేర్లు ముందుంటాయి. వారెవరు ఎక్కడి వారు అనేది పరిశీలిస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా  ఓ మారుమూల ప్రాంతమైన గిరిజన గ్రామం. అదేక్కడంటే ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా  కురుపాం మండలం కొండబారిడి గ్రామంలో 1962-63 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేసిన వెంపటాపు సత్యం నాటి గిరిజనుల అమాయకత్వం, అన్నింటా దోపిడీకి గురవడంపై చలించి పోయాడు. అప్పట్లో ఉద్యమానికి బీజం వేసీవారిలో చైతన్యానికి నాంది పలికారు. ఈ రోజు ఆప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా గిరిపుత్రులు కూడ ఉద్యోగాలను పొంది నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.వెంపటాపు సత్యం మాష్టారంటే ఈ తరం వారు గుండేల్లో నిలిచే వ్యక్తి ..ఆ రోజుల్లో   అమాయక గిరిపుత్రులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించి ఒకగాడిలో పెట్టి వారి బతుకుల మార్చడంలో దిక్సూచీగా నిలిచారని నక్జల్ బరి ఉద్యమంలోనే కాకుండా చరిత్ర చెబుతుంది.

 

  పగలు విద్యార్థులకు పాఠాలు చెబుతూ, ఖాళీ సమయాల్లో రాత్రి పూట గిరిజన గ్రామాల్లో తిరుగుతూ వారిని సంఘటిత పరుస్తూ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమ పంథాలో నడిపాడు. ఆ సమయంలో వీరఘట్టం ప్రాంతానికి చెందిన ఆదిభట్ల కైలాసం, చౌదరి తేజేశ్వరరావు, పాణిగ్రహి తదితర ఒకే భావజాలం గల పలువురు నాయకులు ఒక్కటవడం, వీరందరూ కమ్యూనిస్టు పార్టీ గొడుగు కింద సమష్టి నిర్ణయాలతో పోరటాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్లారు. గిరిజన ప్రజలను దోచుకొనే వ్యాపారులు, సొండీలు, ఇతర భూస్వాములను హత్యలు చేయడం, వీరి ఇళ్లను దోపిడీ చేసి పేద గిరిజన ప్రజలకు పంపిణీ చేయడం, భూ పోరాటాలు చేయడం తప్పని సరిస్థితులలో ప్రారంభించారు. 1967 అక్టోబరు 31న మొండెంఖల్లు గ్రామంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజన ప్రజలకు మద్దతుగా బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు  వేలాదిగా గిరిజన ప్రజలు సభకు తరలివస్తుండగా ఆ సమయంలో గుమ్మ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన భూస్వాములు ఈ సభను భగ్నం చేయడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా లేవిడి గ్రామం వద్ద దారికాచి సభకు వెళుతున్న గిరిజనుల్లో కోరన్న, మంగన్న లను హాత్య చేశారు. దీంతో గిరిజన ప్రజలు కసి పెంచుకోవడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది.  నాటి ప్రభుత్వం పోలీసు బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం తదితర నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లి సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఆతరానికి చెందిన వారిలో చౌదరి తేజేశ్వరరావు ఒక్కరే ఉన్నారు.  కాగా  భూస్వాములు హత్యలు, పోలీసు, సీఆర్పీఎఫ్ గాలింపు చర్యలు, ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో నక్సల్బరీ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఈ రెండు ఉద్యమాలకు భావసారూప్యత గల కారణాలుగా ఆ నాటి నక్సలైట్ పార్టీ జాతీయ నాయకులు చారూ మజుందార్, కానూసన్యాల్, నాగభూషణ్ పట్నాయిక్ తదితర నాయకులు ఉద్యమాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందించారు. చివరకు 1970, జూలై 10న వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలు కురుపాం సమీపంలోని కొండల్లో ఉన్నట్లు సమాచారంతో పోలీసులు వీరిని చుట్టుముట్టి ఎన్‌కౌంటరు చేశారు. ఆ తరువాత పలువురు నాయకులను అరెస్టులు చేయడంతో నాటి ఉద్యమం బలహీనపడింది.

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Comments on Tamil Politics: అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం
అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం
Pawan Kalyan on Nageshwar: జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
Breaking News: మే 28న జరగాల్సిన CUET యూజీ ఎగ్జామ్ వాయిదా
మే 28న జరగాల్సిన CUET యూజీ ఎగ్జామ్ వాయిదా
Anantha Sriram parents protection: చేగొండి జోగయ్య కుమారుడి నుంచి తల్లిదండ్రులకు ప్రాణహాని - పోలీసులకు అనంతశ్రీరామ్ ఫిర్యాదు - అసలు కేసేమిటంటే?
చేగొండి జోగయ్య కుమారుడి నుంచి తల్లిదండ్రులకు ప్రాణహాని - పోలీసులకు అనంతశ్రీరామ్ ఫిర్యాదు - అసలు కేసేమిటంటే?

వీడియోలు

RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Will Jacks Fielding in RR vs MI IPL 2026 | గాల్లో తేలుతూ విల్ జాక్స్ ఫీల్డింగ్
David Warner Blocked by SRH ? | డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH?
IPL 2026 RCB vs GT Qualifier | SRH ఫ్యాన్స్ ను భయపడుతున్న ప్లేఆఫ్స్ సెంటిమెంట్
Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan on Nageshwar: జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
GHMC MeeSeva WhatsApp Number: అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
Telangana Women Empowerment Schemes: మహిళా సంఘాలకు రైస్‌ మిల్లలు, గోదాములు, సూపర్ బజార్‌లు- ముఖ్యమంత్రి కీలక ప్రకటన
మహిళా సంఘాలకు రైస్‌ మిల్లలు, గోదాములు, సూపర్ బజార్‌లు- ముఖ్యమంత్రి కీలక ప్రకటన
Anantha Sriram parents protection: చేగొండి జోగయ్య కుమారుడి నుంచి తల్లిదండ్రులకు ప్రాణహాని - పోలీసులకు అనంతశ్రీరామ్ ఫిర్యాదు - అసలు కేసేమిటంటే?
చేగొండి జోగయ్య కుమారుడి నుంచి తల్లిదండ్రులకు ప్రాణహాని - పోలీసులకు అనంతశ్రీరామ్ ఫిర్యాదు - అసలు కేసేమిటంటే?
Maa Inti Bangaaram Trailer : మా ఇంటి బంగారం ట్రైలర్ - చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లో సమంత
మా ఇంటి బంగారం ట్రైలర్ - చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లో సమంత
AP DSC Merit List Controversy: ఏపీ మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ - భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు
ఏపీ మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ - భారీగా అక్రమాలు జరిగాయని సంచలన ఆరోపణలు
TamilNadu Farmers Loan Waiver: రైతులకు రూ.50వేల రుణమాఫీ - తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం
రైతులకు రూ.50వేల రుణమాఫీ - తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం
Rambha : నాన్నా ఐ మిస్ యూ - ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం
నాన్నా ఐ మిస్ యూ - ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం
Embed widget