అన్వేషించండి

మర్యాద ఇచ్చుకో రాయితీ పుచ్చుకో, ఆ రెస్టారెంట్‌లో అదిరిపోయే ఆఫర్

యూకేలో ఉండే ఓ రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లంతా, తమ సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించేలా చేయాలని అనుకున్నాడో యజమాని. అందుకోసం మర్యాదగా మాట్లాడే వారికి బిల్లు తగ్గిస్తున్నాడు.

ఈ మధ్య కొన్ని పనులు నెట్టింట చాలా వైరల్ అవుతున్నాయి. కొన్ని వైరల్ వార్తల వల్ల మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటిల్లో ఇప్పుడు చెప్పబోయే వార్త కూడా ఒకటి. 

హోటల్ అంటే.. రకరకాల వ్యక్తులు వచ్చిపోతుంటారు. కొందరు మర్యాదగా బిహేవ్ చేస్తే మరికొందరు.. రఫ్ అండ్ టఫ్‌గా ఉంటారు. దురుసుగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టేవారు కూడా లేకపోలేదు. ముఖ్యంగా బిల్లుల విషయంలో తేడా వస్తే.. కోపం కట్టలు తెంచుకుంటుంది. అలాంటి సమయంలో మర్యాదగా వ్యవహరించడం అంటే ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే, ఆ రెస్టారెంట్ ప్రకటించిన ఆఫర్ తెలిసిన తర్వాత.. మర్యాదగా ఉండటానికే కస్టమర్లు ఎక్కువ ఇష్టపడతారు.

దురుసుగా ప్రవర్తించే కస్టమర్లలో మార్పు తెచ్చేందుకు ఓ రెస్టారెంట్ యజమానికి కత్తిలాంటి ఐడియా వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ యజమాని ఐడియా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యూకేలోని ప్రీస్టన్‌లో ఉస్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి  ‘చాయ్ షాప్’ అనే వివిధ రకాల చాయ్ లు, స్నాక్స్ కు సంబంధించిన ఓ రెస్టారెంట్‌ను మార్చి నెలలో  ప్రారంభించాడు. దీనిలో టీ, డోనట్లు, స్ట్రీట్ ఫుడ్స్, డిసర్టులు, బిస్కట్లులాంటి పదార్థాలన్నీ దొరుకుతాయి. అయితే, వాటి ధర కస్టమర్లు ఇచ్చే మర్యాద మీద ఆధారపడి ఉంటుంది. మర్యాద ఇవ్వని కస్టమర్లకు ఎలాంటి ఆఫర్ ఉండదు. మర్యాద ఇస్తే మంచి రాయితీ లభిస్తుంది. 

ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. ‘‘మా రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లు, సిబ్బందితో పొలైట్‌గా వ్యవహరిస్తే.. వారి బిల్లులో తగ్గింపు ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. రెస్టారెంట్ బయట ఉండే బోర్డుపై కూడా ఇదే విషయాన్ని ప్రకటించానని తెలిపాడు. ఈ రెస్టారెంట్‌ లో టీ తాగాలని అనుకునే వాళ్లు.. ‘దేశీ చాయ్’ అని అడిగితే 5 యూరోలు (రూ.400) చెల్లించాల్సి ఉంటుందనీ, అదే ‘దేశీ చాయ్ ప్లీజ్’ అని అడిగితే కేవలం 3 యూరోలకే (రూ.240) ఇస్తాం అనీ పేర్కొన్నాడు. 

ఇక ఇంకాస్త మర్యాదగా ‘హలో.. దేశీ చాయ్ ప్లీజ్’ అని ఆర్డర్ ఇస్తే టీ రేటు 1.9 యూరోలే (రూ.152) చార్జ్ చేస్తాం అని రెస్టారెంట్ ముందు పెట్టిన బోర్డులో ఉస్మాన్ పేర్కొన్నాడు. అయితే ఇప్పటివరకు ఏ కస్టమర్ కూడా దురుసుగా ప్రవర్థించలేదని చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో అందరూ అతని ఆలోచనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బిల్లులో రాయితీ సంగతి పక్కనబెడితే కనీసం సిబ్బందితో ఎలా నడుచుకోవాలో దురుసుగా ప్రవర్తించే వారికి అర్థమవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chaii Stop™️ (@chaiistop_)

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Embed widget