అన్వేషించండి

BJP First List : బీజేపీ మొదటి జాబితా ఎప్పుడు ? - పొత్తుల చర్చల కారణంగా వాయిదా వేస్తారా ?

బీజేపీ మొదటి జాబితా వస్తుందా ? పొత్తుల చర్చల కారణంగా ఆగిపోతుందా ?


BJP First List :  తెలంగాణ బీజేపీ మొదటి జాబితా కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. బీజేపీ ఎలక్షన్ కమిటీ  ఢిల్లీ సమావేశం అయి తొలి జాబితాను ఖరారు చేస్తారని భావిస్తున్నారు. తొలి విడతలో 38 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేయాలని ఆ పార్టీ భావించింది. అందులో సింగిల్ నేమ్‌తో 21 మంది అభ్యర్థులను పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. మిగతా స్థానాల్లో ఒక్కో సెగ్మెంట్‌కు ఇద్దరి పేర్లను అధిష్టానానికి పంపినట్లు చెబుతున్నారు. అయితే ఎలక్షన్ కమిటీ మీటింగ్  జరుగుతుందాలేదా అన్నదాని ఇంకా స్పష్టత రాలేదు. 

సీనియర్ నేతలందరూ పోటీ చేయబోతున్నారా ? 

తెలంగాణ ఎన్నికల్లో సీనియర్లు అందరూ పోటీ చేసే అవకాశం ఉంది. అంబర్ పేట అసెంబ్లీ నుంచే కిషన్ రెడ్డి బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే కిషన్ రెడ్డి కార్యకర్తలకు స్పష్టత ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో కే. లక్ష్మణ్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముషీరాబాద్ నుంచి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. నగర శివారు ప్రాంతాలపై కాషాయ నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎల్బీనగర్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంపై బూర నర్సయ్యగౌడ్ ఆసక్తి చూపుతున్నారు. రెండు స్థానాల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ఈటల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక కామారెడ్డి నుంచి అర్వింద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్, సిరిసిల్లలో బండి సంజయ్‌ పోటీ అంశంలో క్లారిటీ రావాల్సి ఉంది.  

బలమైన అభ్యర్థుల కోసం ఎదురు చూస్తారా ?                                
 
కాంగ్రెస్ ఇప్పటికే 55 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈనెల 20 తర్వాత సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశముంది. అయితే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తే బెటర్ అనే ఆలోచనలో స్థానిక నేతలున్నారని తెలిసింది. కాంగ్రెస్ ఫస్ట్, సెకండ్ లిస్టుల్లో టికెట్ రాని అసంతృప్తులను బీజేపీలో చేర్చుకోవాలని రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే బీజేపీ లిస్ట్ కోసం ఆశావహులు, పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.  

పొత్తులపైనా డైలమా !                                 

మరో వైపు కలసి పని చేసే అంశంపై  జనసేన పార్టీతో  బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతోనూ మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టిక్కెట్ ప్రకటన  జాబితా వాయిదా పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే తొలి జాబితాలో సీనియర్లు .. అదీ కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఇతర పార్టీలకు ఇవ్వని నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులే ఉంటారని చెబుతున్నారు. ప్రకటన వచ్చే వరకూ బీజేపీ నేతలకు టెన్షన్ తప్పదు.  మొత్తం టిక్కెట్ల కోసం ఆరు వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
Telangana Assembly Clash: అసెంబ్లీ ఘర్షణల రగడ - కాంగ్రెస్‌ది అతి రాజకీయమా? KTR పీఏ, పీఆర్వోల విచారణతో తిరగబడ్డ వ్యూహం!
అసెంబ్లీ ఘర్షణల రగడ - కాంగ్రెస్‌ది అతి రాజకీయమా? KTR పీఏ, పీఆర్వోల విచారణతో తిరగబడ్డ వ్యూహం!
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Embed widget