అన్వేషించండి

YS Sharmila: బంగారు తెలంగాణ అని చెప్పి, బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ: వైఎస్‌ షర్మిల ఫైర్

YS Sharmila Comments: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కేజీ టూ పీజీ, ఉచిత విద్య హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు.

YS Sharmila criticises Telangana cm KCR: వరంగల్: ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఏం చేశారంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర వరంగల్ లో కొనసాగుతోంది. ప్రజా ప్రస్థాన పాదయాత్ర 3300 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు నీటి మీద రాతలే
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదని షర్మిల ఆరోపించారు. కేజీ టూ పీజీ, ఉచిత విద్య హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. పోడు రైతుల సమస్యలు కూడా పరిష్కరించకుండా అలాగే ఉన్నాయన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ షర్మిల మండిపడ్డారు. బంగారు తెలంగాణ అని చెప్పి.. బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ చేసిండన్నారు

పరకాల నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న పాదయాత్ర
 వైఎస్ షర్మిల పర్యటనలో భాగంగా  పరకాల నియోజకవర్గంలోని నర్సక్కపల్లి గ్రామంలో పాదయాత్ర కొనసాగుతుంది. గ్రామ ప్రజలు వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఅర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు.. ఇది దొరలు ఏలుతున్న.. దొంగల ప్రభుత్వం అన్నారు. ఇది దోపిడీ రాజ్యం, ఇది గూండాల, రౌడీల రాజ్యం అంటూ విమర్శించారు. కూటి కోసం పనిచేసే పోలీసులను, హక్కులు లేని జీతగాళ్ళులా వాడుకుని ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు ఓటుతో పోటు వేసి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే పరిపాలన చేస్తున్నారన్నారు. 

బంగారు తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
బంగారు తెలంగాణలో పేద ప్రజలకు బ్రతుకే లేని తెలంగాణ అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటివరకూ ఏ వర్గాన్ని ఆదుకొనే దిక్కు లేదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇచ్చే దిక్కు లేదంటూ మాటలు ఎక్కు పెట్టారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చనిపోతుంటే, వారి ఆత్మహత్యలకు కారణాలు తెలిసి కూడా ఆపడం చేతకాని ప్రభుత్వం తెలంగాణాలో ఉందన్నారు. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని డిపాజిట్లు గల్లంతు అయ్యేలా ఓడించి ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో మాటమీద నిలబడే నాయకులే లేరని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. హన్మకొండ జిల్లా ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నడికూడా, పరకాల మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా షర్మిల కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రైతుల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి భద్రంగా ఉన్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు గెలిచిన ఉపయోగం లేదని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలని తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget