అన్వేషించండి

Warangal: ప్రీతికి వాడిన ఇంజెక్షన్ ఏంటి? ఆ రిపోర్టుతో కేసులో ట్విస్ట్! వరంగల్ సీపీ కీలక వ్యాఖ్యలు

టాక్సికాలజీ రిపోర్టుతో ఏమీ తేలదని, పోస్టు మార్టం రిపోర్టు వస్తే అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని వరంగల్ సీపీ చెప్పారు. ఇందుకు మరో రెండు రోజులు సమయం పడుతుందని వెల్లడించారు.

వరంగల్ మెడికల్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కేసులో ఆమె వాడిన హానికర ఇంజక్షన్ ఏంటనేది ఇంకా తేలడం లేదు. ఆమె మరణించి వారం రోజులు గడిచినా ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా వెలువడిన టాక్సికాలజీ రిపోర్టులోనూ విష రసాయనాలు ఏం లేవని వచ్చింది. గుండె, కాలేయంతో పాటు, ఇతర అవయవాల్లో ఏ ఆనవాళ్లు లేవని నివేదిక వచ్చింది. దీంతో నేడు (మార్చి 6) వరంగల్ సీపీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాక్సికాలజీ రిపోర్టుతో ఏమీ తేలదని, పోస్టు మార్టం రిపోర్టు వస్తే అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని చెప్పారు. ఇందుకు మరో రెండు రోజులు సమయం పడుతుందని వెల్లడించారు. ఆ తర్వాత ప్రీతి మరణం గురించి అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. ప్రీతి కేసులో చర్చించేందుకు వరంగల్ సీపీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే డీజీపీ కూడా ఆయనకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

హత్య అని కుటుంబం వాదన
మరోవైపు, ప్రీతి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెది హత్య అనే అంటున్నారు. తాజాగా ప్రీతి సోదరుడు పృథ్వీ కూడా స్పందించాడు. ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రీతికి నిమ్స్‌లో బ్లడ్ డయాలసిస్ చేసి, ప్లాస్మా కూడా చేశారని అన్నాడు. దీనివల్లే టాక్సికాలజీ రిపోర్టులో విష పదార్థాలు ఏమీ లేవని వచ్చిందని అన్నాడు. శరీరం మొత్తం క్లీన్ చేసి రిపోర్టు తీస్తే టాక్సికాలజీ రిపోర్టులో ఏమీ రాదని చెప్పారు. గవర్నర్ తమిళిసై ప్రీతిని చూసేందుకు రాకముందే డయాలసిస్ చేశారని చెప్పారు. తమకు తెలియని విషయాలు గవర్నర్ కు చెప్పారని, ప్రీతి కళ్లకు టేప్  కూడా వేశారని చెప్పారు. ఈ కేసులో తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పారు. మరోవైపు తన కూతురిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి హత్యేనని ప్రీతి తండ్రి ధరావత్​ నరేందర్ ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యకు పాల్పడగా, 26న ప్రీతి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె హానికారక ఇంజెక్షన్‌ ఎక్కించుకున్నట్లుగానే వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స చేసిన డాక్టర్లు, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య స్థితిని బట్టి, వెంటిలేటర్‌పై తర్వాత ఎక్మోపై ఉంచి కూడా వైద్యం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. గత నెల 26న రాత్రి 9.10 గంటలకు ప్రీతి మరణించినట్లు నిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. 

విచారణలో నిందితుడు సైఫ్
ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్‌ను పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేశారు. సైఫ్ ప్రీతిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న విధంగా చిత్రీకరించాడా అనే కోణంలోనూ విచారణ చేశారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. ప్రీతి ఆత్మహత్య వ్యవహారంలో ఆమెను సైఫ్ మానసికంగా వేధింపులకు గురి చేయడం నిజమేనని ర్యాంగింగ్ నిరోధక కమిటీ పేర్కొంది. ప్రీవెంట్ అనస్థీషియా నివేదిక విషయంలో జరిగిన ఒక వివాదం ఒక్కటే వీరి మధ్య వివాదానికి కారణం కాదని తెలిపింది. వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన అనస్థీషియా వైద్య విభాగం చీఫ్ నాగార్జునరెడ్డి కూడా సైఫ్ ​ది తప్పేనని అంగీకరించారు. దీంతో నాగార్జున రెడ్డిని భూపాలపల్లి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ​గా ట్రాన్స్‌ఫర్ చేశారు.

ముగిసిన సైఫ్ కస్టడీ
మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఘటనలో సైఫ్ పోలీస్ కస్టడీ ముగిసింది. అడిషనల్ సెషన్స్ మెజిస్ట్రేట్ ముందు సైఫ్ ను పోలీసులు హాజరుపర్చారు. కస్టడీ పొడిగింపు కోసం పిటిషన్ దాఖలు చేయగా, మెజిస్ట్రేటు కేసును రేపటికి వాయిదా వేసింది. దీంతో సైఫ్ ను ఖమ్మం జైలుకి తరలించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Embed widget