అన్వేషించండి

KTR Warangal Tour: ఈ 8న వరంగల్ కు కేటీఆర్, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8న వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వత గిరి మండలం, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణానికి మంత్రి కేటీఆర్ రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 

మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా వర్ధన్నపేట పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్ లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ హెలి ప్యాడ్, సభా స్థలం, పార్కింగ్ ప్లేస్ లను, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ చేయాల్సిన ఏర్పాట్లను అధికారులతో మంత్రి చర్చించారు. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయనున్న మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కేటీఆర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ 8వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ స్క్రీనింగ్ ని మహిళలు ఉపయోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి, బోయిన పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ సూచించారు.

పాలకుర్తి నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్
మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటనలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో మంత్రి ఎర్రబెల్లి ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 
మహిళలతో భారీ బహిరంగ సభ
పలు కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం 20 వేల మంది మహిళలతో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభలో కేటీఆర్ కొన్ని కీలక విషయాలపై ప్రసంగించనున్నారని తెలుస్తోంది. అదే సందర్భంగా డ్వాక్రా మహిళలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పే అవకాశం ఉందని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. సభ పూర్తయ్యాక బీఆర్ఎస్ నేతలు, ముఖ్య కార్యకర్తలతో స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో సమావేశం కానున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి, హెలిప్యాడ్, బహిరంగ సభా స్థలం, పార్కింగ్ స్థలాలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. తొర్రూరు పట్టణ అభివృద్ధికి కావాల్సిన మరిన్ని నిధులు, అవసరాల గురించి మంత్రి ఎర్రబెల్లి చర్చించారు. కేటీర్ పర్యటన సందర్భంగా అధికారులు, పార్టీ శ్రేణులకు అంశాల వారీగా బాధ్యతలు అప్పగించారు. 

త్వరలో ఆశా వర్కర్లకు జీతాల పెంపు..
ఆశా వర్కర్లకు అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కంటే ఎక్కువ వేతనాలు తెలంగాణలో ఇస్తున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్లలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వలాభం కోసం కొందరు ఆశా వర్కర్లను రెచ్చగొడతారని, దీనిపై ఆలోచించాలన్నారు. కరోనా సంక్షోభం వల్ల జీతాలు పెంచలేకపోయామని, పరిస్థితులు మారాక ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget