అన్వేషించండి

Revanth Reddy on TRS: కవిత అనుమతి తీసుకొని సీబీఐ విచారిస్తోంది! టీఆరెస్, బీజేపీ వార్ వీధి నాటకమన్న రేవంత్

Revanth Reddy on TRS: టీఆర్ఎస్ పాలన వల్లే కొడంగల్‌లో ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ధర్నా చేయాలని సూచించారు.  

Revanth Reddy on TRS: టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కు తుప్పు పట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. డ్రామారావు దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మంత్రి కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి తప్ప టీఆరెస్‌కు ఏ ప్రాజెక్టుతో సంబంధం లేదని ఆరోపించారు. అవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్ కు టీఆరెస్ ఎమ్మెల్యే ఉన్నారని... నాలుగేళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారో కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చే వరకు ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సూచించారు. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చుడో.. శాసన సభ్యుడు సచ్చుడో తేలాలంటూ కామెంట్లు చేశారు.

గ్రామగ్రామాన తిరిగి టీఆర్ఎస్ ను ఉతికి ఆరేస్తాం..

అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన జరగాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లేకపోతే గ్రామ గ్రామాన తిరిగి... టీఆరెస్ తీరును ఉతికి ఆరేస్తాం అన్నారు. గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించిందని తెలిపారు. కానీ టీఆరెస్, బీజేపీ నేతలు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారని అన్నారు. కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రేస్ ను దెబ్బ తీసేందుకే టీఆరెస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయన్నారు. 

టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అందరికీ నోటీసులు జారీ చేసి ఢిల్లీ పిలిపించి ప్రశ్నిస్తే కవితను మాత్రం సీబీఐ అధికారులు అనుమతి కోరుతున్నారని.. ఇక్కడే టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆరెస్, బీజేపీ చాలా కాలంగా  కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా భారతీయ జనతాపార్టీ వద్ద ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాను గతంలో ఫిర్యాదు చేసిన కోకాపేట భూములు, బంగారు కూలీ, ఇతర కేసులపై విచారణ చేపట్టాలన్నారు. గతంలో ఎన్నికల కమిషన్ కు చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 

రేపటి లోపు స్పందించకపోతే తీర్పు చెల్లదు..

కేసీఆర్ అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు తాను  ఢిల్లీలో అయిదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లకుండా పోతుందన్నారు. తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందని... టీఆరెస్, బీజేపీ వార్ ఒక వీధి నాటకమని విమర్శించారు.  అమరవీరుల స్థూపం కాంట్రాక్టు ఆంధ్రా వాళ్లకు అప్పగించారని.. ఎనిమిదేళ్లు దాటినా అమరవీరుల స్థూపం పూర్తి కాలేన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని రేవంత్ రెడ్డి పరిశీలించారు .

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Embed widget