అన్వేషించండి

Errabelli Dayakar Rao: ఈ 27న స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన - ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత గ్రామాలకు సాగునీరు అందించేందుకు రూ.133 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

వరంగల్‌ : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 27న స్టేషన్ ఘన్ పూర్ లోని వేలేరులో పర్యటించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత గ్రామాలకు సాగునీరు అందించేందుకు రూ.133 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. 

కేసీఆర్ భగీరథ ప్రయత్నం, కేటీఆర్ చొరవ
తీవ్ర కరువుతో ఇబ్బందులు పడుతున్న స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వేలేరు, చిల్పూరు, ధర్మసాగర్ మండలాల రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం చేశారు, మంత్రి కేటీఆర్‌ చొరవ తీసుకోవడంతో నిధులు మంజూరు అయ్యాయన్నారు. ఇప్పుడు ప్రాజెక్టు శంకుస్థాపన చేసేందుకు మంత్రి కేటీఆర్‌ రానుండటం స్థానికులకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని వేలేరులో కేటీఆర్ పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సయన్వయంతో పని చేయాలని సూచించారు.

ఇంఛార్జీలను నియమించిన మంత్రులు
ఆయా విభాగాల వారీగా ఇంఛార్జిలను మంత్రి ఎర్రబెల్లి నియమించారు. మండలాలకు ఇంఛార్జీలుగా జాఫర్‌గఢ్‌, మార్నెని రవీందర్‌రావు, లింగాల ఘనపురానికి ఆర్‌ అండ్‌బీ సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ధర్మ సాగర్‌కు కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, రఘునాథపల్లికి రుణ విమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, వెలేరుకు దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, భీమదేవరపల్లికి హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, చిల్పూర్‌కు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డిలను నియమించారు. ఓవరాల్ గా సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య వ్యవహరిస్తారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన విజయవంతం కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే టీ రాజయ్య, కుడా చైర్మన్ సుందర్‌ రాజ్ యాదవ్, జడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీల కార్యకర్త చిన్నాల రమేశ్ కొద్ది నెలల కిందట ప్రమాదవశాత్తు చనిపోగా, ఆయన భార్య మౌనికకు బీఆర్ఎస్ తరుఫున మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును తిరుమలగిరిలో మంత్రి ఎర్రబెల్లి బుధవారం అందజేశారు.

దేశంలో 60 లక్షల మంది కార్యకర్తలున్న పార్టీ తమ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ కు వెన్నముక లాంటి కార్యకర్తలకు సీఎం కేసీఆర్, మంత్రులు, నేతలు అండగా ఉంటున్నామని చెప్పారు. దురదృష్టవాశాత్తు కార్యకర్త మరణిస్తే వారి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ ఆసరాగా ఉంటూ పార్టీ తరఫున వారికి బీమాను అందిస్తామని వెల్లడించారు. కనుక ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేసే పార్టీకి కార్యకర్తలు అండగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Naveen Polishetty Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం బారినపడ్డ నవీన్ పోలిశెట్టి.. ఎంత సీరియస్..?Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP DesamUS Reacts On Arvind Kejriwal Arrest | కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికాకు ఎందుకు..? | ABPNallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Embed widget