By: ABP Desam | Updated at : 06 May 2023 09:39 AM (IST)
Edited By: jyothi
మహబూబ్ నగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన, అమరరాజా బ్యాటరీస్ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన ( Image Source : Minister KTR Facebook )
Minister KTR: మహబూబ్ నగర్ జిల్లాలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్ ను ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎనిమిది కంపెనీల ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎంవోయూలు కుదుర్చుకుంటారు. ఆయా కంపెనీలకు ఐటీ టవర్ లో స్థలాన్ని కేటాయిస్తారు. అనంతరం కారిడార్ వెనుక భాగంలో సుమారు 270 ఎకరాల్లో నిర్మించనునున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేస్తారు. ఈ కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ నమూనాపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, బ్యాటరీ కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఉంటుంది.
A Big step forward in electrifying Telangana’s ambitions to be a Hub for EVs & Sustainable Mobility ✊
— KTR (@KTRBRS) May 6, 2023
Will be breaking ground today for @AmaraRaja_Group Lithium Ion Battery manufacturing Giga plant with ₹9,500 Crore investment
One of the largest investments in India in this… pic.twitter.com/LaZSfqzJV9
మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని పలు జంక్షన్లను ప్రారంభిస్తారు. అనంతరం బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన వెంటనే మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించనున్న ఐల్యాండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జంగల్ సఫారీని కూడా ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ బయలు దేరుతారు. కాగా మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ నర్సింహ గౌడ్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు.
Telangana: 9 ఏండ్లల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ, లెక్కలు బయటపెట్టిన మంత్రి ఎర్రబెల్లి
Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు తొలగిన ఆటంకాలు, పరీక్ష వాయిదా పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
Minister Errabelli: ఉపాధి హామీ కూలీగా మారిన మంత్రి ఎర్రబెల్లి - త్వరలోనే కూలీలకు పలుగు, పార పథకం
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన