అన్వేషించండి

Mahabubabad: అత్తాకోడళ్ల మధ్య గొడవ, తల్లిపై మటన్ కత్తితో దాడి చేసిన కొడుకు! అసలు సంగతి తెలిసి అంతా షాక్

ఆత్తకోడళ్ళ మధ్య  ఘర్షణకు కారణం తెలిసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో అత్తాకోడళ్ల మధ్య గొడవ తల్లీ కొడుకులు కొట్టుకొనే వరకూ వెళ్లింది. అంతటితో ఆగకుండా పట్టలేని ఆగ్రహం పెంచుకున్న కుమారుడు ఏకంగా తల్లిపై ఓ కత్తితో దాడి చేశాడు. మహబూబాబాద్ మండలం వేంనూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్తకోడళ్ళ మధ్య  ఘర్షణకు కారణం తెలిసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. అంత చిన్న విషయానికే కత్తులతో దాడి చేసుకొనే వరకూ పరిస్థితి వెళ్లడంపై అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పోలీసులు సైతం అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు.

మహబూబాబాద్ జిల్లా వేంనూరు గ్రామంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. అత్త బుజ్జి, కోడలు నందిని, కొడుకు మహేందర్ కలిసి ఉంటున్నారు. అయితే, శుక్రవారం కోడలు వండిన టమాటా కూర బాగలేదు అని కోడలిని ఆత్త బుజ్జి మందలించింది. తనను దూషించడంపై కలత చెంది, చిన్నబుచ్చుకున్న కోడలు నందిని భర్తకు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న కొడుకు తన భార్యను తిడతావా అంటూ కోపంతో మటన్ కత్తితో  కొడుకు మహేందర్ తల్లిపై దాడి చేశాడు. 

దీంతో తల్లి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే మహబూబాబాద్ ఏరియా హస్పిటల్ కి తరలించారు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి మహబూబాబాద్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయంపై ఆత్త కోడళ్ళ మధ్య జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. టమాటకూర బాగా వండలేదని అత్త బుజ్జి మందలించడం ఈ ఘటనకు ప్రధానంగా దారి తీసి ఉండదని, అంతకుముందు ఎన్నో రోజుల నుంచి విభేదాలు ఉండడంతో తాజా ఘటనతో అది పెద్ద గొడవకు దారి తీసిందని స్థానికులు చెప్పారు. 

కామారెడ్డిలో తల్లిని హత్య చేసిన కొడుకు
కన్నతల్లిని కన్నకొడుకు తీవ్రంగా చితకబాది హతమార్చిన ఘటన కామారెడ్డిలో జరిగింది. తానే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించి మృతి చెందిందని తెలిసి ఇంటికి తీసుకువచ్చాక.. జరిగిన పెనుగులాటలో ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామంలో చోటు చేసుకుంది. మృతి చెందిన తల్లి 65 సంవత్సరాల వయసుగల నర్సమ్మ కాగా కొడుకు 45 సంవత్సరాల వయసు గల నర్సారెడ్డిగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామానికి చెందిన నర్సారెడ్డి గత మూడు నెలలుగా భార్య లావణ్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో దూరంగా ఉంటూ అయ్యప్ప మాల వేసుకుని తల్లి నర్సమ్మ వద్ద ఉంటున్నాడు. గత రెండు రోజుల క్రితం శబరిమల వెళ్లి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం తల్లి నర్సమ్మతో నర్సారెడ్డి గొడవ పడి తీవ్రంగా చితక బాదాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన నర్సమ్మను స్వయంగా నర్సారెడ్డి 108 అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని నేరుగా భవానిపేట గ్రామంలోని ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటికే నర్సమ్మ మృతి చెందింది. 

విషయం తెలుసుకున్న భార్య లావణ్య, కొడుకులు దినేష్ రెడ్డి, చంద్ర రెడ్డి ఇదేమిటని తండ్రి నర్సారెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయంలో నర్సారెడ్డికి కుమారుల మధ్య ఘర్షణ జరిగింది. దీంట్లో నర్సారెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget