![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mahabubabad Crime News: కోరిక తేర్చలేదని బావను చంపిన మరదలు - చెప్పుల దండ మెడలో వేసిన అవమానించిన గ్రామస్థులు
Mahabubabad Crime News: భర్త చనిపోయాడు. తండ్రి బాధ్యతలో ఉన్న బావను కోరిక తీర్చమంటూ వేధించింది. అది తప్పని చెప్పిన అతడిని అంతమెందించింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు చెప్పులదండ వేసి ఊరేగించారామెను.
![Mahabubabad Crime News: కోరిక తేర్చలేదని బావను చంపిన మరదలు - చెప్పుల దండ మెడలో వేసిన అవమానించిన గ్రామస్థులు Mahabubabad Crime News Woman Murdered His Brother in-law Due to Do Not Fullfill His Wish dnn Mahabubabad Crime News: కోరిక తేర్చలేదని బావను చంపిన మరదలు - చెప్పుల దండ మెడలో వేసిన అవమానించిన గ్రామస్థులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/14/890eeda8e58dea82f959942dfd5a30781676364865954215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mahabubabad Crime News: ఆరేళ్ల క్రితం ఓ మహిళ భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఒంటరిగానే అత్తారింట్లో ఉంటుంది. ఆమెను తన ఫ్యామిలీ మెంబర్ అనుకొని తండ్రి స్థానంలో ఉండి బావ పోషిస్తూ వచ్చాడు. అలాంటి బావపై కన్నేసిందామె. భర్త లేని లోటు తీర్చమంటూ వేధించడం మొదలు పెట్టింది. అది తప్పు వద్దని బావ చెప్పినా వినిపించుకోలేదు. దీంతో అతడిని హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. ఇద్దరు యువకుల సాయంతో బండరాళ్లతో మోది మరీ బావను చంపేసింది. విషయం వెలుగులోకి రాగానే గ్రామస్థులంతా నిలదీశారు. తప్పును ఒప్పుకున్న సదరు మహిళను గ్రామస్థులంతా కలిసి నిందించారు. ఇష్టం వచ్చినట్లుగా తిడుతూనే.. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించారు. ఆపై పోలీసులకు అప్పగించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారు సిగ్నల్ తండాలో దారుణం చోటు చేసుకుంది ఈ దారుణం. తండాకు చెందిన బానోతు రాజును ఆయన తమ్ముడి భార్యే హత్య చేసింది. రాజు తమ్ముడు గోపి ఆరేళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి అతని భార్య అత్తారింటి వద్దే ఒంటరిగా ఉంటోంది. అలా కాలం గడిచే కొద్ది బావ రాజుపై సదరు మహిళ మనసుపడింది. తరచుగా భర్త లేని లోటును తీర్చమంటూ.. వేధించడం మొదలు పెట్టింది.
అలా చేయడం తప్పు, నేనెలా చేయలేనని రాజు వాదించే సరికి అతడిపై కోపం పెంచుకుందా మహిళ. ఈ క్రమంలోనే అతడిని ఎలాగైనా సరే చంపేయాలని నిర్ణయించుకొని హత్యకు పన్నాగం పన్నింది. ఈనెల 10వ తేదీన బావ రాజును మున్నేరు వాగు సమీపంలోకి తీసుకు వెళ్ళింది. అయితే ముందుగానే మరో ఇద్దరు యువకులను కూడా అక్కడకు రమ్మని చెప్పింది. వారి సాయంతో వాగు వద్ద బండరాళ్లతో మోది బావ రాజును చంపేసింది.
చెప్పుల దండ వేసి ఊరేగించిన గ్రామస్థులు..!
ఆపై తనకు ఏమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లిపోయింది. రెండు మూడ్రోజుల తర్వాత రాజు మృతదేహం వెలుగులోకి వచ్చింది. అయితే రాజు మరదలుపై అందరికీ అనుమానం రావడంతో గ్రామస్థులు గట్టిగా నిలదీశారు. దీంతో భయపడిపోయిన ఆమె తన తప్పును ఒప్పుకుంది. కోరిక తీర్చలేదనే కోపంతోనే తన బావను మట్టుపెట్టానని వివరించింది. ఇందుకు మరో ఇద్దరు కూడా సహకరించారని వారి పేర్లను కూడా వెల్లడించింది. తండ్రిలా చూసుకున్న బావను చంపేయడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ చెప్పుల దండ మెడలో వేసి ఊరంతా తిప్పారు. విపరీతమైన బూతులు తిట్టుకుండా ఊరేగించారు. ఆపై పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళను అరెస్ట్ చేసి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. త్వరలోనే కోర్టుకు పంపుతామని చెప్పారు.
ఇటీవలే కూతుళ్లను బావిలో తోసి హత్య - ఆపై తండ్రి ఆత్మహత్య
పది రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో ఓ తండ్రి అత్యంత అమానవీయ రీతిలో తన కన్న కూతుర్లను బావిలో తోసేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లాలోని నర్సింగాపూర్లో జలపతి రెడ్డి అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసి తాను ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి తండ్రి జలపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆర్థిక సమస్యలు కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)