By: ABP Desam | Updated at : 23 Aug 2021 03:23 PM (IST)
కొండా సురేఖ దంపతులు (ఫైల్ ఫోటో)
మాజీ మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులు ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 26న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు ఇందులో పాల్గొంటారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా అంశంపై కొండా సురేఖ, మురళి దంపతులు సోమవారం ఉదయం టీపీసీసీ వరంగల్ తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త కోటూరి మానవతారాయ్తో భేటీ అయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న 24 డివిజన్లలో దళిత, గిరిజనులతో కలిసి కొండా దంపతులు, సమన్వయ కర్త మానవతారాయ్ రచ్చబండ నిర్వహించనున్నారు.
రచ్చబండ కార్యక్రమాలు ముగిశాక భారీ ర్యాలీతో తరలి వచ్చి ఎమ్మార్వో లేదా ఆర్డీవోకు దళితబందు పథకం ద్వారా తూర్పు నియోజకవర్గంలోని దళిత గిరిజనులందరికి రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్తో కొండా దంపతులు, సమన్వయ కర్త మానవతారాయ్ వినతి పత్రం సమర్పించనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సెప్టెంబరు 17 వరకు దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో తెలంగాణ పీసీసీ తలపెట్టబోయే కార్యక్రమాలతో దండోరా యాత్రలు ముగుస్తాయని మానవతారాయ్ వెల్లడించారు. చివర్లో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని చెప్పారు. ఆ సభతోనే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాలు ముగుస్తాయని వరంగల్ తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త కోటూరి మానవతారాయ్ వెల్లడించారు.
Also Read: Hyderabad Murder: చార్మినార్ మధుసూధన్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. అసలు విషయం తేల్చేసిన పోలీసులు
సోమవారం మాజీ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ప్రతులను కోటూరి మానవతారాయ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మడిపల్లి కృష్ణాగౌడ్, నల్గొండ రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, హుజూరాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖను దాదాపుగా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరిశీలించాక ఆమె పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!
Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి
Petrol-Diesel Price, 14 May: వాహనదారులకు పెట్రో షాక్ ! ఇవాళ చాలా చోట్ల పెట్రోల్ ధరలు పెరుగుదల, ఇక్కడ మాత్రం స్థిరం
Warangal Student: జర్మనీలో పడవ ప్రమాదం- వరంగల్ విద్యార్థి గల్లంతు, సాయం కోసం ఫ్యామిలీ ఎదురుచూపులు
Teenmar Mallanna: లింగాల ఘనపూర్ వెళ్తున్న తీన్మార్ మల్లన్న అరెస్టు
Harish Rao About Rahul Gandhi: ఆ ఒక్క ప్రశ్నతో రాహుల్ గాంధీ చిత్తశుద్ధి ఏంటో అర్థమైంది: మంత్రి హరీష్ రావు సెటైర్
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
KCR On Central Government: పల్లె నిధులపై పంచాయితీ- కేంద్రంపై కేసీఆర్ సీరియస్
Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్లో ఉన్న దేశం అదే
Keerthy Suresh: రోజురోజుకి మహానటి అందం పెరిగిపోతోందిగా