అన్వేషించండి

BRS vs Congress: కన్నెపల్లి పంపుహౌస్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వివాదం- రైతుల ఆందోళన, రాజకీయ రచ్చ!

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ల మధ్య ఇటీవలి కాలంలో అనేక అంశాలపై మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా కన్నెపల్లి పంపుహౌస్ వివాదం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

Telangana Politics | అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ల మధ్య ఇటీవలి కాలంలో అనేక అంశాలపై మాటల యుద్ధం సాగుతోంది. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రెండు పార్టీల వాగ్వాదం జరుగుతుండగానే, తాజాగా కన్నెపల్లి పంపుహౌస్ వివాదం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపుహౌస్‌ను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, పంపుహౌస్ ఎప్పుడు ప్రారంభించాలో తమకు తెలుసని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తోంది. ఈ కన్నెపల్లి పంపు విషయంలో ప్రస్తుత, మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

కన్నెపల్లి పంపుహౌస్ (Kannepalli Pump House) వివాదానికి ప్రధాన కారణం ఇదే

కాళేశ్వరంలోని కీలకమైన కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటార్లు 2022 గోదావరి వరదల్లో మునిగి పాడయ్యాయి. రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. వీటిని మరమ్మతు చేసి పునరుద్ధరించడానికి వందల కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇదిలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పి.సి. ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసి విచారణ జరుపుతోంది. ఈ విచారణకు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ కమిషన్ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయాల్లో ముందుకు సాగాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం కన్నెపల్లి పంపుహౌస్ మోటార్ల మరమ్మతు పనులు సాగుతున్నట్లు సమాచారం.

కన్నెపల్లి పంపుహౌస్ వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ డిమాండ్

గోదావరి నదిలో ప్రస్తుతం నీటి ప్రవాహం ఉన్నా కేవలం రాజకీయ కక్షతో కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లు ఆన్ చేయడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. "గోదావరిలో నీళ్లున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నా, కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా రోజుకు 2 టీఎంసీల (వేల మిలియన్ క్యూబిక్ అడుగులు) నీటిని ఎత్తిపోయవచ్చు. రైతులు సాగునీరు లేక అల్లాడుతున్నారు. వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు న్యాయం చేయాలి," అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ రాజకీయానికి వాడుకుంటోందని హరీశ్ రావు విమర్శిస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీరు అవసరమని, ఇప్పుడు నీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని హరీశ్ రావు వాదన.

కాళేశ్వరం కమిషన్ నివేదిక తర్వాతే అంటోన్న కాంగ్రెస్

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లలో లోపాలు, కన్నెపల్లి పంపుహౌస్ నీట మునగడం వంటివి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అవినీతికి నిదర్శనమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారు. "కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసం, వారి దోపిడీ కోసం కట్టింది. మామూలు పగుళ్లు కావు, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లే కుంగిపోయాయి. అలాంటి ప్రమాదకరమైన నిర్మాణాలను మేము ఎలా నమ్మగలం? వాటిని సరిదిద్దకుండా, ప్రాజెక్టు భద్రతను నిర్ధారించుకోకుండా నీటిని ఎత్తిపోవడం అంటే రైతుల ప్రాణాలతో, ఆస్తులతో చెలగాటమాడటమే అవుతుంది," అని మంత్రి ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. "కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చేవరకు, నిపుణుల కమిటీ అనుమతి లేకుండా పంపుహౌస్‌లను పూర్తిగా ఆన్ చేయలేము. ఇది రాజకీయ నిర్ణయం కాదు, ప్రజల భద్రతకు సంబంధించినది," అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు.

నీటి కోసం ఆందోళనలో రైతన్నలు

ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంటే, వర్షాలు ఆశించిన రీతిలో రాకపోవడం, కన్నెపల్లి పంపుహౌస్ నుండి నీటి విడుదల కాకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీలు రాజకీయాలకతీతంగా సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సైతం తమ సమస్యను దృష్టిలో పెట్టుకుని స్పందించాలని కోరుతున్నారు.

అయితే, రెండు మూడు రోజులుగా కన్నెపల్లి పంపుహౌస్ చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. రైతులకు నీరు ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేస్తుంటే, నిపుణులు చెప్పకుండా నీరు ఇస్తే రైతుల ఆస్తులకే నష్టం జరుగుతుందని ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

వీడియోలు

రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Who is Sameer Minhas: వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
Embed widget