అన్వేషించండి

కోడి, కోటర్ మేటర్‌పై ఎన్నికల కమిషన్ సీరియస్

TRS Leader Rajanala Srihari: మద్యం, కోడి పంపిణీపై టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి ఈసీ నోటీసులిచ్చింది. మద్యం పంపిణీపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

TRS Leader Rajanala Srihari: దసరా సందర్బంగా వరంగల్ లోని  హమాలీలకు కోడి, క్వార్టర్ పంచినందుకు టీఆర్ఎస్ నేత మాజీ శాప్ డైరక్టర్ రాజనాల శ్రీహరికి ప్రధాన ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మునుగోడు ఓటర్లకు లిక్కర్ పంపిణీ చేశారు అన్న ఆరోపణలపై ఓ వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వరంగల్ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులను కలెక్టర్ రాజనాల శ్రీహరికి అందజేశారు. కోడి, క్వార్టర్ పంపిణీపై రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ ప్రకటన తర్వాత మద్యం పంపిణీ

అక్టోబర్ 5వ తేదీన దసరా సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తెలంగాణ రాష్ట్ర సమితి - టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి - బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇకపై టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా వ్యవహరించనున్నారని, బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు చెప్పిన విషయం విదితమే. అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉండి రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఎంపీ స్థానాల్లో గెలవాలని, కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని రాజనాల శ్రీహరి ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కు చంద్రశేఖర్ రావు అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కల్వకుంట్ల తారక రామారావు ఎంపిక కావాలని కోరుకున్నారు. రాష్ట్రానికి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని, దేశంలో కేసీఆర్ ప్రధానిగా ఉండాలని, కేసీఆర్ కుటుంబానికి విజయాలను సాధించి పెట్టాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 200 మంది హమాలీ కార్మికులకు ఒక్కొక్కరికి ఒక కోడి, ఒక క్వార్టర్ బాటిల్ చొప్పున పంపిణీ చేశారు. 

చర్చకు దారి తీసిన మద్యం పంపిణీ

రాజనాల శ్రీహరి చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. బహిరంగం మద్యం పంపిణీ చేయడంపై అన్ని పార్టీల నాయకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే మరి కొందరు మాత్రం రాజనాల శ్రీహరి తాను వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి కార్యక్రమం చేపట్టారని విమర్శలు వచ్చాయి. సొంత పార్టీకి చెందిన నాయకుల హస్తం ఉందని, వారే ఈసీకి ఫిర్యాదు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. 

మరోవైపు దిల్లీలో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. వసంత్ విహార్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లను పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నిన్న సుమారు 40 నిమిషాలపాటు కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో అన్ని అంశాలను పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్, దామోదర రావు, వద్ది రాజు రవిచంద్ర ఉన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget