By: ABP Desam | Updated at : 16 Sep 2021 07:42 PM (IST)
Edited By: Venkateshk
అధికారిణిపై పెట్రోల్తో దాడి చేస్తున్న పోడు రైతు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారిణిపై ఆదివాసీ రైతులు పెట్రోల్తో దాడికి పాల్పడ్డారు. అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటేందుకు రాగా.. అదే సమయంలో పోడు రైతు గిరిజనులు పెట్రోల్తో దాడి చేశారు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్ పరిధిలోని పందిపంపుల గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. తొలుత ఉద్రిక్తత చోటు చేసుకోగా.. అనంతరం అది తీవ్రమై దాడి చేసుకొనే వరకూ వెళ్లింది. పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బాధిత పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోడు భూమిలో అటవీ శాఖ అధికారులు గురువారం మధ్యాహ్నం మొక్కలు నాటేందుకు వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చి మొక్కలు నాటుతున్న అటవీ అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీ రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఎవరూ తగ్గకపోవడంతో ఆ గొడవ కాస్తా.. పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఆదివాసీ రైతులు ఓ అటవీ అధికారిణిపై సెట్రోల్ పోసి నిప్పటించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో గాయపడ్డ బాధితురాలిని భూపాలపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధికారులు తరలించారు. కాగా, ఈ ఘటనపై తోటి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలో గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ
Petrol-Diesel Price, 13 August: ఈ నగరంలో బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా
TDP YCP In BJP Trap : వైఎస్ఆర్సీపీ, టీడీపీలతో బీజేపీ పొలిటికల్ గేమ్ - తెలంగాణ కోసమే !
Petrol-Diesel Price, 11 August: నిలకడగా ఇంధన ధరలు- మీ నగరంలో ఈరోజు ఇలా
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?
Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!