అన్వేషించండి

Medaram Jatara: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు... భక్తుల సౌకర్యార్థం 3,845 బస్సులు... జాతర నిర్వహణపై మంత్రుల సమీక్ష

మేడారం జాతర కోసం ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి చేశామని మంత్రులు తెలిపారు. జాతర నిర్వహణపై మంత్రులు రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జాతర జరగనుంది.

తెలంగాణ వచ్చాకే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రుల బృందం అభిప్రాయపడింది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర రాష్ట్ర స్థాయి విస్తృత సమీక్ష సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రులు అన్నారు. వసతులు పెరిగాయని, గత 4 జాతరలకు రూ.332 కోట్లు ఖర్చు చేశామని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జరనుందని తెలిపారు. జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం నేడు రాష్ట్ర స్థాయి  సమీక్ష నిర్వహించారు. 

పారిశుద్ధ్య నిర్వహణకు 4 వేల సిబ్బంది

మేడారం జాతరకు వచ్చే భక్తులు, పూజారుల మనోభావాలు దెబ్బతినకుండా జాతర నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. జాతర కోసం చేపట్టిన పనులలో ఇప్పటికే 90 శాతం పూర్తి అయ్యాయన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టామన్నారు. ఓమిక్రాన్, కరోనా తీవ్రంగా ఉన్న కారణంగా ఆరోగ్య శాఖకు కోటి రూపాయలు కేటాయించామని చెప్పారు. గత జాతరలో 4 రోజుల్లో కోటి 2 లక్షల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గొచ్చని తెలిపారు. రోడ్ల పనులు, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా శాఖ పనులు 90 శాతం పూర్తి అయ్యాయన్నారు. భక్తుల తాకిడికి తగినట్లు 320 కేంద్రాల్లో 6400 టాయ్లెట్స్ ఏర్పాటు చేశామన్నారు. జాతర పటిష్ట నిర్వహణ కోసం మొత్తం ప్రాంతాన్ని 8 జోన్లుగా, 34 సెక్టర్లుగా విభజించినట్లు తెలిపారు. 1100 ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతర సమయంలో పారిశుద్ద్య నిర్వహణ కోసం 450 మంది సబ్ సెక్టోరియల్ ఆఫీసర్లు, 50 మంది సెక్టరియల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. మొత్తం 4000 మందిని పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేశామన్నారు. వీరితో పాటు జాతర సమయంలో దుమ్ము లేవకుండా ఉండడానికి 30 ట్రాక్టర్లు, చెత్త తొలగింపునకు 8 జేసీబీలు, 20 టాటా ఏస్ వాహనాలు, సేకరించిన చెత్తను డంప్ యార్డుకు తరలించడానికి 70  ట్రాక్టర్లు పెట్టామన్నారు. 

భక్తుల కోసం 3,845 బస్సులు

జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం 50 బెడ్లతో సమ్మక్క-సారలమ్మ వైద్యశాల ఏర్పాటు చేసి, అక్కడే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6 పడకల వైద్య శాల, మరో 19 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రులు వివరించారు.  వీటితో పాటు ములుగు, ఏటూరు నాగారం, పరకాల వద్ద తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖనాలు, తాడ్వాయి దగ్గర 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పస్రా దగ్గర 5 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా మేడారం వచ్చే 8 మార్గాల్లో మార్గం పొడవున 42 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర వైద్య సదుపాయం కోసం 15 అంబులెన్సులు, 15 బైక్ అంబులెన్సులు ఏర్పాటు చేసామన్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఒక ఐసోలేషన్ షెడ్ ఏర్పాటు చేశామన్నారు.  మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 28.5 లక్షల వ్యయంతో తప్పిపోయిన వారి కోసం 6 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రవాణా సదుపాయాల కోసం 3,845 బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. 51 ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయన్నారు. 50 ఎకరాల్లో బస్ స్టేషన్ నిర్మించామని, 41 క్యు లైనర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు 42 సీసీ కెమెరాల సర్వియలెన్స్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 1500 మంది ప్రయాణికులు విశ్రాంతి, పడుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికులందరికీ శానిటైజ్ చేస్తామని, మాస్క్ లు అందిస్తామని మంత్రులు తెలిపారు. 

బెస్ట్ ఫొటోలకు రూ.లక్ష నజరానా

నార్లాపూర్ నుంచి జంపన్న వాగు వరకు 25 మినీ బస్సులు నిరంతరం నడిచే విధంగా ఉచిత బస్ సౌకర్యం కల్పించామని మంత్రులు తెలిపారు. జాతరలో నిత్యం వెలుగుల కోసం 4200 ఎల్.ఈ. డి బల్బులను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసామన్నారు. ఈసారి భక్తుల విడిది కోసం శాశ్వత ప్రాతిపదికన 5 భారీ షెడ్లు నిర్మించామన్నారు. 10,300 మంది పోలీస్ సిబ్బంది, ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, పశ్రా నుంచి ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, టోయింగ్ వాహనాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉందన్నారు. మీడియా కవరేజ్ కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు, 20 రోజుల పాటు ప్రైవేట్ ఏసీ బస్సులు, ఇన్నోవా కార్లు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మీడియా సెంటర్ లో వైఫై అవకాశం ఉంటుందన్నారు. 13 సాంస్కృతిక బృందాలతో సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత తెలిపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జాతర సందర్భంగా మంచి ఫోటోలు తీసిన వారిని గుర్తించి లక్ష రూపాయల బహుమతి ఇస్తామని తెలిపారు. సమావేశానికి ముందు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర అధికారులు, నేతలు అమ్మవార్లను దర్శించుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
Tirumala News: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్
Tirumala News: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్
Anil Ravipudi: మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
Bandi Sanjay Sensational Comments: కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది! ఆరు నెలల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం: బండి సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది! ఆరు నెలల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం: బండి సంజయ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABPSunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
Tirumala News: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్
Tirumala News: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్
Anil Ravipudi: మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
Bandi Sanjay Sensational Comments: కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది! ఆరు నెలల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం: బండి సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది! ఆరు నెలల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం: బండి సంజయ్
Chhatrapati Shivaji Jayanti 2025:  పదహారేళ్లకే కత్తి పట్టిన వీర యోధుడు ఛత్రపతి శివాజీ, మొఘలుల్ని వణికించిన రియల్ వారియర్
 పదహారేళ్లకే కత్తి పట్టిన వీర యోధుడు ఛత్రపతి శివాజీ, మొఘలుల్ని వణికించిన రియల్ వారియర్
Aadi Saikumar: ఆది సాయికుమార్ సినిమాకు రిలీజ్‌కు ముందే ఆరేడు కోట్లు... 'ఎస్ఐ యుగంధర్' డిజిటల్ డీల్ క్లోజ్, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?
ఆది సాయికుమార్ సినిమాకు రిలీజ్‌కు ముందే ఆరేడు కోట్లు... 'ఎస్ఐ యుగంధర్' డిజిటల్ డీల్ క్లోజ్, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?
HDFC Bank Personal Loan: వెంటనే రూ.40 లక్షలు కావాలా?, ఎక్స్‌ప్రెస్ లోన్ స్కీమ్‌ తీసుకొచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
వెంటనే రూ.40 లక్షలు కావాలా?, ఎక్స్‌ప్రెస్ లోన్ స్కీమ్‌ తీసుకొచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
Baby John OTT: ఓటీటీలో కీర్తి సురేష్ హిందీ సినిమా ఫ్రీగా చూసేయవచ్చు... భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎందులో ఉందంటే?
ఓటీటీలో కీర్తి సురేష్ హిందీ సినిమా ఫ్రీగా చూసేయవచ్చు... భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎందులో ఉందంటే?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.