అన్వేషించండి

Mlc Kadiyam Srihari : రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర, బీజేపీపై కడియం శ్రీహరి ఫైర్

Mlc Kadiyam Srihari : రిజర్వేషన్లు ఎత్తివేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియ శ్రీహరి విమర్శలు చేశారు.


Mlc Kadiyam Srihari : కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. హన్మకొండలో కడియం శ్రీహరితో పాటు మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఎంపీ పసునూరి దయాకర్ లు మీడియా సమావేశం నిర్వహించారు.

అసమానతలు పెంచేలా కేంద్రం వ్యవహరిస్తోంది-కడియం శ్రీహరి

దేశంలో అసమానతలను పెంచేలా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. దళిత మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తం కావాలన్నారు. కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని ఆయన విమర్శించారు. ఆహారపు ఆలవాట్లను కూడా నియంత్రణ చేస్తున్నారని ధ్వజమెత్తారు.  1961 నుంచి 2021 వరకు అరవై ఏళ్లలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కేంద్రం పెంచలేదని ఆరోపించారు. దేశ జనాభాలో ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతం ఉన్నారని, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో అంబేడ్కర్ ఇచ్చిన దళితుల హక్కులను కాలరాయొద్దని కేంద్రాన్ని కోరారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని ఆక్షేపించారు.

ఆర్ఎస్ఎస్ కుట్ర ఉంది- మాజీ ఎంపీ సీతారాం నాయక్

60 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచకపోవడంపై ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. యాభై శాతం కన్నా ఎక్కువైనా ప్రత్యేక చట్టం ద్వారా రిజర్వేషన్లు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతోందని ఎంపీ పసునూరి దయాకర్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మసీదులను కూలగొట్టాలంటుండు..సంజయ్ కు బుద్ధుందా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు యువతను వక్రమార్గంలో తీసుకెళుతున్నారని విమర్శించారు.

స్టేషన్ ఘణపూర్ లో శ్రీహరి వర్సెస్ రాజయ్య 

తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పలు జిల్లాల్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు, కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఓవైపు ప్రతిపక్షాలు ఊపిరి సలపని విధంగా విమర్శలు, ఆరోపణలతో అటాక్ చేస్తుంటే.. మరోవైపు సొంత పార్టీలోనే వేరు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు అధికార బీఆర్ఎస్ నేతలు. తాజాగా వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య డైలాగ్స్ వార్ కంటిన్యూ అవుతోంది. 

దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు 

కడియం శ్రీహరి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజయ్య ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని కడియం ఆరోపించగా.. చిల్లర మాటలు నమ్మవద్దంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజయ్య. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఆర్థిక చేయూత కల్పించేందుకు, సమాజంలో వారు మరో అడుగు ముందుకు వేసేందుకు దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. ఇప్పటికే పలు జిల్లాల్లో దళిత బంధు నిధులు విడుదల చేసి అర్హులైన లబ్ధిదారులను అందించారు. కొన్ని యూనిట్లుగా మారి సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్టుగా నిధుల పంపిణీ జరుగుతోంది.

ప్రజా ప్రతినిధుల బంధువులకు దళితబంధు నిధులు ! 

ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. కొందరు ప్రజా ప్రతినిధులు వాళ్ల బంధువులకు దళితబంధు నిధులు ఇవ్వడం, లేదంటే లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకోవడం లాంటివి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ ఎస్సీల కోసం తీసుకొచ్చిన పథకం దళిత బంధు అద్భుతమైన పథకం అని, కానీ కొందరు ఆ పథకాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని కడియం చెప్పారు .

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget