By: ABP Desam | Updated at : 11 May 2023 04:25 PM (IST)
కొత్త కొత్త రుచులు అస్వాదిస్తున్న వెంకయ్యనాయుడు
Venkaiah Naidu : ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత రాజకీయంగా పెద్దగా ఎలాంటి పని లేకపోవడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనకు ఇష్టమైన వ్యవహారాలపై దృష్టి పెడుతున్నారు. ఆయన ఫుడ్ ట్రావెలర్ మాదిరిగా వినూత్నమైన హోటల్స్ ను సందర్శిస్తూ..సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సింపుల్ గా ఎక్కువ జనాదరణ పొందిన హోటల్స్ ను ఆయన ఉదయమే బ్రేక్ ఫాస్ట్ కోసం సందర్శిస్తున్నారు. అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ హోటల్ గొప్పదనం గురించి చెబుతున్నారు. దీంతో ఆ హోటల్ మరింత ఫేమస్ అవుతోంది.
హైదరాబాద్ లో రాయలసీమ అల్పాహారానికి ప్రసిద్ధి చెందిన పంచెకట్టు దోశ హోటల్ ను సందర్శించి, మిత్రులతో కలిసి అక్కడి వంటకాలను రుచి చూశాను. మన సంప్రదాయ వంటకాలకు ప్రాముఖ్యత కల్పించిన నిర్వాహకుల చొరవను అభినందిస్తున్నాను. pic.twitter.com/xGfIxgrKL0
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) May 11, 2023
గురువారం రోజు హైదరాబాద్ లో రాయలసీమ అల్పాహారానికి ప్రసిద్ధి చెందిన పంచెకట్టు దోశ హోటల్ ను సందర్శించారు. మిత్రులతో కలిసి అక్కడి వంటకాలను రుచి చూశానని.. మన సంప్రదాయ వంటకాలకు ప్రాముఖ్యత కల్పించిన నిర్వాహకుల చొరవను అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇడ్లీ, దోశ లాంటి మన భారతీయ సంప్రదాయ వంటకాలకు రాయలసీమ రుచిని అదనంగా జోడించి, అందరి మన్ననలు పొందుతున్న పంచెకట్టు దోశ స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలి. మనవైన మరెన్నో రుచులను ఇదే విధంగా ప్రపంచానికి పరిచయం చేయాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.
మే రెండో తేదీన విజయవాడ లోని SSS పాక హోటల్ లో చక్కటి ఇడ్లీని ఆస్వాదించారు. నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయని ప్రశంసించారు.
గుబురు చెట్ల నీడన, సంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్లో ఒకసారైనా ఇడ్లీ రుచి చూడాలి. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి అభినందనలు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలి. pic.twitter.com/2US6uR7tw8
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) May 2, 2023
అత్యంత బిజీగా ఉండే రాజకీయ నాయకుడిగా దశాబ్దాల బాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వెంకయ్యనాయుడుకు ఇప్పుడు అనూహ్యంగా రిటైర్మెంట్ లభించినట్లయింది. అయితే ఆయనలో ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఎక్కడకు వెళ్లినా మార్నింగ్ వాకింగ్ కు వెళ్తారు. ఇప్పుడు సమయం చాలా ఉండటంతో.. ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హోటళ్లను సందర్శించి టిఫిన్ చేస్తున్నారు. వాటి గురించి సోషల్ మీడియాలో పెట్టి వాటికి మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు.
Telangana politics : కేసీఆర్ విమర్శించకపోవడమే అసలు కష్టం - బీజేపీ సమస్యకు పరిష్కారమేది ?
చాలా సింపుల్గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వివాహం
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! బిపర్జోయ్ తుపాను తీవ్రత ఎలా ఉందంటే?
Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ
RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam
Nabha Natesh: సమ్మర్.. అంటూ నభా ఫోటో షూట్ అదుర్స్