అన్వేషించండి

Bandi Sanjay: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం!- కేంద్ర మంత్రి బండి సంజయ్ అంత మాటన్నారేంటి!

Telangana Politics | బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకునే ప్రసక్తేలేదని, అది గంగలో కలిసిన పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లోని కోఠిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Bandi Sanjay sensational comments on BRS merger with BJP | హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరెత్తితేనే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని, కేసీఆర్ పార్టీని బీజేపీలో విలీనం చేసినా తమకు ఏ ప్రయోజనం ఉండదన్నారు. హైదరాబాద్ కోఠిలో మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బీజేపీ ఎప్పుడూ దూరంగా ఉంటుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల్ని ప్రజలు చీదరించుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుణాలు మాపీ కాని రైతులకు బ్యాంక్‌ల నుంచి ఎన్‌వోసీలు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రైతుల కోసం బీజేపీ కొట్లాడుతుంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. 

బీజేపీకి అంత ఖర్మ పట్టలేదు 
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తల్ని బండి సంజయ్ ఖండించారు. ‘బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడం ఖాయమని, కానీ కాంగ్రెస్ లో కలిసి పోతుంది. అందువల్లే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ లో మొదలైంది, ఇప్పుడు మళ్లీ హస్తం పార్టీ గూటికే చేరుతున్నారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్ తో పొత్తులు, విలీనం చేసుకోవాల్సిన ఖర్మ బీజేపీకి పట్టలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉంది. 6 గ్యారంటీల అమలుపై ఫోకస్ చేయకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 

రైతు రుణమాఫీ అమలుకాలేదని మండిపాటు

ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదు. రుణమాఫీ కావడంల లేదని, అప్పుల భారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. 64 లక్షల మంది రైతులు లోన్ తీసుకుంటే 22 లక్షల మందికే రుణమాఫీ చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మల్ని రైతులు, ప్రజలు దహనం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రైతుల రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే పార్టీల విలీనం అని డ్రామాలు ఆడుతున్నారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ఎన్నికల సమయంలో 40 వేల కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ లో రూ.26 వేలు కోట్లు కేటాయించి, ఇప్పుడు  రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా?’ అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

అయితే, తెలంగాణ వ్యవసాయశాఖ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులు అందరికీ రూ.2 లక్షల వరకు  రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వివరాలు సరిగ్గా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిన రైతులందరికీ మూడు విడతల్లో రుణమాఫీ చేసినట్లు తెలిపారు. అర్హులై ఉండి ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సంబంధిత వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి రైతులు తమ వివరాలు సమర్పించాలని సూచించారు. 

Also Read: KTR: రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Nikhil Maliyakkal - Chinni Serial: 'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
Indira Mahila Shakti: కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
Donald Trump: ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మూడో ప్రపంచ యుద్ధం రావడం కన్ఫామ్: డొనాల్డ్ ట్రంప్
ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మూడో ప్రపంచ యుద్ధం రావడం కన్ఫామ్: డొనాల్డ్ ట్రంప్
AP News: ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
Embed widget