అన్వేషించండి

Bandi Sanjay: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం!- కేంద్ర మంత్రి బండి సంజయ్ అంత మాటన్నారేంటి!

Telangana Politics | బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకునే ప్రసక్తేలేదని, అది గంగలో కలిసిన పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లోని కోఠిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Bandi Sanjay sensational comments on BRS merger with BJP | హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరెత్తితేనే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని, కేసీఆర్ పార్టీని బీజేపీలో విలీనం చేసినా తమకు ఏ ప్రయోజనం ఉండదన్నారు. హైదరాబాద్ కోఠిలో మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బీజేపీ ఎప్పుడూ దూరంగా ఉంటుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల్ని ప్రజలు చీదరించుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుణాలు మాపీ కాని రైతులకు బ్యాంక్‌ల నుంచి ఎన్‌వోసీలు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రైతుల కోసం బీజేపీ కొట్లాడుతుంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. 

బీజేపీకి అంత ఖర్మ పట్టలేదు 
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తల్ని బండి సంజయ్ ఖండించారు. ‘బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడం ఖాయమని, కానీ కాంగ్రెస్ లో కలిసి పోతుంది. అందువల్లే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ లో మొదలైంది, ఇప్పుడు మళ్లీ హస్తం పార్టీ గూటికే చేరుతున్నారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్ తో పొత్తులు, విలీనం చేసుకోవాల్సిన ఖర్మ బీజేపీకి పట్టలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉంది. 6 గ్యారంటీల అమలుపై ఫోకస్ చేయకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 

రైతు రుణమాఫీ అమలుకాలేదని మండిపాటు

ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదు. రుణమాఫీ కావడంల లేదని, అప్పుల భారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. 64 లక్షల మంది రైతులు లోన్ తీసుకుంటే 22 లక్షల మందికే రుణమాఫీ చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మల్ని రైతులు, ప్రజలు దహనం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రైతుల రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే పార్టీల విలీనం అని డ్రామాలు ఆడుతున్నారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ఎన్నికల సమయంలో 40 వేల కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ లో రూ.26 వేలు కోట్లు కేటాయించి, ఇప్పుడు  రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా?’ అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

అయితే, తెలంగాణ వ్యవసాయశాఖ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులు అందరికీ రూ.2 లక్షల వరకు  రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వివరాలు సరిగ్గా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిన రైతులందరికీ మూడు విడతల్లో రుణమాఫీ చేసినట్లు తెలిపారు. అర్హులై ఉండి ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సంబంధిత వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి రైతులు తమ వివరాలు సమర్పించాలని సూచించారు. 

Also Read: KTR: రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
HYDRAA Ranganath High Court Orders: హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget