By: ABP Desam | Updated at : 15 Nov 2021 09:33 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థుల ఖరారుపై ఆ పార్టీ ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. అశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉన్నందున, గతంలో ఇచ్చిన హామీతో పాటు, సామాజిక, రాజకీయ సమీకరణలను కూడా అభ్యర్థుల ఎంపిక కోసం కుస్తీ పడుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో (నవంబరు 16) నామినేషన్లు ముగియనున్నాయి. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
అయితే, అసెంబ్లీలో టీఆర్ఎస్కు పూర్తి బలం ఉన్నందున.. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 6 స్థానాలను ఆ పార్టీకే దక్కనున్నాయి. సునాయాసంగా మండలిలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఎమ్మెల్యే కోటా టికెట్ కోసం తాజా మాజీలతో పాటు.. చాలా మంది నేతలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మధుసూదనచారి, కడియం శ్రీహరి, ఎర్రోళ్ల శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎల్.రమణ పేర్లు కూడా ఈ ప్రచారంలో ఉన్నాయి.
Also Read: AP Municipal Elections: ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల ఎన్నికలు ప్రారంభం..
గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ పదవి ఖాయమే అయినప్పటికీ.. ఏ కోటాలో అవకాశం ఇస్తారనేది మాత్రం స్పష్టత లేదు. సుఖేందర్ రెడ్డి, ఎల్.రమణకు గవర్నర్ కోటా లేదా స్థానిక సంస్థల కోటాలో మండలికి పంపించే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. నేడు అభ్యర్థులను ప్రకటిస్తే.. ఈరోజే కొందరు నామినేషన్లు కూడా దాఖలు చేసే అవకాశం ఉంది.
Also Read: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇలా..
మరోవైపు, స్థానిక సంస్థల కోటాలో నవంబరు 16 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల అభ్యర్థులపై కూడా టీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులతో పాటు స్థానిక సంస్థల కోటా అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలా లేక రెండు మూడు రోజులు ఆగి ప్రకటించాలా అనే తర్జనభర్జన కొనసాగుతోంది. కల్వకుంట్ల కవిత, బాలసాని లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, భానుప్రసాదరావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, సుంకరి రాజు పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. అందరూ మరోసారి కొనసాగాలని ఆశిస్తున్నారు.
Also Read: ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇలా!
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
Top Headlines Today: బాలాపూర్ గణేశ్ లడ్డూకు భారీ ధర; జస్టిస్ హిమబిందుపై పోస్టులు చేసిన వ్యక్తి అరెస్ట్ - నేటి టాప్ న్యూస్
Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర
Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్ రికార్డు బ్రేక్, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!
Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్
Nara Bramhani Politics : టీడీపీలో మోస్ట్ వాంటెడ్ లీడర్గా నారా బ్రాహ్మణి - రాజకీయాల్ని ఇక సీరియస్గా తీసుకుంటారా ?
Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!
Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!
/body>