అన్వేషించండి

Kummera Jathara Tragedy: కుమ్మెర జాతర గొడవలో 2 చిన్నారి మృతిపై కేసు నమోదు- అసలు వివాదం ఏంటీ?

కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన తోపులాటలో చిన్నారి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు హామీ ఇచ్చారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో జరిగిన గొడవ కారణంగా రెండు నెలల చిన్నారి చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. జాతరకు వెళ్లిన భక్తులతో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు వారిపై దాడి జరగడం, తోపులాటలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డుపై 5 గంటలపాటు రాస్తారోకో చేయగా.. చివరకు డీఎస్పీ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబం ఆందోళన విరమించింది.

వివాదానికి కారణమైన టికెట్ ధర
కుమ్మెర గ్రామానికి చెందిన గణేశ్, తన భార్య మౌనిక, రెండు నెలల కుమార్తె, బంధువు చంద్రకళతో కలిసి ఈ నెల 18న మల్లన్న జాతరకు వెళ్లారు. బుధవారం రాత్రి దైవదర్శనం కోసం గణేష్ కుటుంబం వెళ్తుండగా, టికెట్ ధర విషయంలో ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి, భక్తురాలు చంద్రకళకు మధ్య వివాదం తలెత్తింది. రూ.100 చెల్లించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేయగా.. తాము మాత్రమే ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులకు, గణేశ్‌ కుటుంబానికి మధ్య గొడవ జరగగా, అది తోపులాటకు దారితీసింది. ఈ తోపులాటలో మౌనిక తన చిన్నారితో సహా కిందపడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన శిశువును ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అంతా బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ నెలల చిన్నారి శనివారం మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

కేసు నమోదు చేసిన పోలీసులు
చనిపోయిన చిన్నారి తల్లి మౌనిక ఫిర్యాదు మేరకు ఎస్సై గోవర్ధన్ కేసు నమోదు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని, రిపోర్టు ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే పోలీసులు అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం చేయడం లేదని బాధితులు ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 


Kummera Jathara Tragedy: కుమ్మెర జాతర గొడవలో 2 చిన్నారి మృతిపై కేసు నమోదు- అసలు వివాదం ఏంటీ?

చిన్నారి మృతిపై నాగర్‌కర్నూల్‌లో 5 గంటల పాటు రాస్తారోకో
కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో జరిగిన దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందిన ఘటనపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధితులతో కలిసి వివిధ ప్రజాసంఘాలు శనివారం రాత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రధాన రహదారిపై భారీ ఆందోళన చేపట్టాయి. ఈ నిరసన కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బాధితులకు మద్దతుగా BSP, DSP, BC-SC-ST-JAC, MRPS మరియు ఇతర సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


Kummera Jathara Tragedy: కుమ్మెర జాతర గొడవలో 2 చిన్నారి మృతిపై కేసు నమోదు- అసలు వివాదం ఏంటీ?

పోలీసుల హామీతో ఆందోళన విరమణ
సుమారు 5 గంటల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్తతను తగ్గించేందుకు నాగర్‌కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. డీఎస్పీ భరోసాతో రాత్రి 11:30 గంటల ప్రాంతంలో విశారదన్ మహరాజ్ సభ్యులు, బాధిత కుటుంబానికి చెందిన వారు ధర్నా విరమించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Breaking News: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Embed widget