అన్వేషించండి

తెలంగాణలోని ఇవాళ్టి మెయిన్ అప్‌డేట్స్ ఇవే

ఇప్పటికే 2 రోజులపాటు రోహిత్‌రెడ్డిని ప్రశ్నించిన ఈడీ..ఇవాళ మళ్లీ రావాలని ఆదేశించింది ఈడీ. నందకుమార్‌ ఇచ్చే స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది..!

ఇవాళ ఈడీ విచారణకు ఎమ్యెల్యే రోహిత్ రెడ్డి

ఎమ్మెల్యేలకు ఎర కేసులో రోహిత్‌రెడ్డి ఈడీ విచారణపై సస్సెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రోజులు రోహిత్‌ని ప్రశ్నించింది ఈడీ. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు రోహిత్‌రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కాదని సీబీఐకి కేసు విచారణ అప్పగించడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలనే హైకోర్టు నిర్ణయంపై స్పందించిన ఆయన.. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ, డివిజన్‌ బెంచ్‌కు వెళ్లాలా..? లేక సుప్రీం కోర్టును ఆశ్రయించాలా..? అనేది నిర్ణయించుకుంటామన్నారు. కేసును సీబీఐకి బదిలీ చేయడంపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు వెల్లడించారు.

మాణిక్‌చంద్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ అభిషేక్‌ను ఇప్పటికే విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. A2గా ఉన్న నందకుమార్‌ను ఇవాళ కూడా ప్రశ్నించనుంది ఈడీ. అసిస్టెంట్ డైరెక్టర్ దేవేందర్ సింగ్ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో కూడిన బృందం నందకుమార్ నుంచి ఇప్పటికే స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఈడీ అధికారుల తీరుపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు..! తనను దోషిగా చూపేందుకు మాస్టర్ ప్లాన్ వేశారన్నది ఆయన వర్షన్.

ఇప్పటికే 2 రోజులపాటు రోహిత్‌రెడ్డిని ప్రశ్నించిన ఈడీ..ఇవాళ మళ్లీ రావాలని ఆదేశించింది ఈడీ. నందకుమార్‌ ఇచ్చే స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది..! మరి రేపు రోహిత్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుంది..? ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నందకుమార్ మరో ఆరోపణ

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇవాళ మరోసారి నందకుమార్‌ని ఈడీ విచారించనుంది. సోమవారం చంచల్‌గూడ జైలులో 4గంటల పాటు నందు విచారణ సాగింది. విచారణలో నందకుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఈడీ.. ఇవాళ మరోసారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనుంది. ఇవాళ విచారణ అనంతరం కోర్టులో నివేదిక సమర్పించనుంది ఈడీ. నందుపై ఉన్న కేసుల వివరాలు సేకరించగా.. ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో ఉన్న సంబంధాలు, వ్యాపార లావాదేవీలపై ఆరా తీసింది.

బంజారాహిల్స్​లోని ఓ భూ వ్యవహరంలో మధ్యవర్తిగా వ్యవహరించిన నందకుమార్.. భూమిని కాజేయాలని యజమానిని వేధింపులకు గురిచేసినట్లు కేసు నమోదైంది. దీని ఆధారంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద నిందితుడిపై ఈడీ కేసు నమోదు చేసింది.

రామప్పలో రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శనకు విచ్చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రానున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఏఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకేన్, అదనపు కలెక్టర్ వైవి గణేష్‌తో కలిసి రామప్పలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  రాష్ట్రపతి పర్యటనకు రామప్ప దేవాలయం సుందరీకరణతో అలంకరణ పూర్తి చేసామని పేర్కొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుందని.. ఈ క్రమంలోనే బార్కెట్లు, పార్కింగ్ ఏరియా వంటి వివరాలు వెల్లడించారు.

ప్రసాద్ స్కీమ్ పైలెట్ ప్రాజెక్టు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం పైలెట్ ప్రాజెక్టు రామప్పలో రాష్ట్రపతి ప్రారంభించనున్నారని వివరించారు. ఈనెల 28న రాష్ట్రపతి రామప్ప రానుండగా.. ములుగు గిరిజన జిల్లా అయినందున ఆదివాసీ కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏర్పాట్లలో నిమగ్నమైన అన్ని శాఖల అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన వివరాలు చెప్పారు. రామప్ప గార్డెన్ అందంగా తీర్చిదిద్దినట్లు, తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రామప్ప ప్రాంగణం అంతా శానిటైజ చేశామన్నారు. కీటకాలు ప్రవేశించకుండా బ్లీచింగ్ కూడా చేసినట్లు కలెక్టర్ వివరించారు. భద్రతా చర్యల్లో భాగంగా రామప్ప పరిసర ప్రాంతాలన్నింటిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.


రైతుబంధు కు ఏర్పాట్లు పూర్తి

యాసంగికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం బుధవారం నుంచి రైతులకు అందనున్నది. ఆ రోజు ఉదయం నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు పైసలు జమ కానున్నాయి. ఈ సీజన్‌లో సుమారు 66 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.7,600 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. రైతుబంధుకు అవసరమైన నిధులను సిద్ధం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా చివరి రైతు వరకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఆర్థికశాఖల అధికారులు పెట్టుబడి సాయం పంపిణీపై పకడ్బందీ చర్యలు తీసుకొన్నారు. గత వానకాలం సీజన్‌లోనే రూ.50 వేల కోట్ల మార్క్‌ను దాటిన రైతుబంధు సాయం.. ఈ సీజన్‌తో రూ.65 వేల కోట్లకు చేరుతుంది.


గెజిటెడ్‌ పోస్టుల దరఖాస్తులకు నేడే ఆఖరు

భూగర్భ జలవనరుల శాఖలో 32 గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నది. 25 నాన్‌గెజిటెడ్‌ పోస్టులకు మాత్రం బుధవారం వరకు చాన్స్‌ ఉన్నది. రాష్ట్రంలోని భూగర్భ జల వనరుల శాఖలో 57 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది నవంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. వివరాలకు https://www.tspsc. gov.inలో సంప్రదించవచ్చును.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget