అన్వేషించండి

Satyavathi Rathod: మంత్రి సత్యవతి రాథోడ్ సరికొత్త దీక్ష, కేసీఆర్ మరోసారి సీఎం అయ్యేవరకు ఆ పని చేయరట

Satyavathi Rathod: సీఎం కేసీఆర్ కోసం మంత్రి సత్యవతి రాథోడ్ సరికొత్త దీక్ష తీసుకున్నారు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు వేస్కోనని శపథం చేశారు.

Satyavathi Rathod: మునుగోడు ఉప ఎన్నికల కోసం మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాధానగర్ తండాలో పాదరక్షలు లేకుండానే ప్రచారం చేయడం కనిపించింది. ఇదే విషయమై ఆమెను అడగా... సీఎం కేసీఆర్ గిరిజన సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తి అని తెలిపారు. 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు. గిరిజనబంధు ప్రవేశ పెట్టారని తెలిపారు. ఊహించని విధంగా తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారన్నారు. మరోసారి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు వివరించారు. అప్పటి వరకు పాదరక్షలు వేసుకోనని సెప్టెంబర్ 17 నుంచి దీక్ష ప్రారంభించానని తెలిపారు. 

చివరి రక్తం బొట్టు వరకు కేసీఆర్ వెంటే..

గిరిజన జాతి మొత్తం సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆయన చేసిన సేవల గురించి గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. సంపన్నులుండే బంజారాహిల్స్ లో బంజారా, ఆదివాసి భవన్ లను నిర్మించిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.  ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలతో పాటు గిరిజనులను కడుపున పెట్టుకొని చూసుకుంటున్నారన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు, గిరిజన బంధు లాంటి పథకాలు తీసుకువస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఒక గిరిజన బిడ్డకు ఇచ్చిన గౌరవాన్ని తలుచుకొని ముఖ్యమంత్రికి శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నానని మంత్రి అన్నారు.

శిరస్సు వంచి పాదాభివందనం..

మహబూబాబాద్ జిల్లా గడ్డపై పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందని మంత్రి అన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన తనకు ఎమ్మెల్సీగా గుర్తింపు ఇచ్చి, మంత్రిగా చేసి ఉన్నతమైన స్థానాన్ని కల్పించారన్నారు. తన జీవితంలో ఊహించని విధంగా ఆదరించినందుకు తెలంగాణలో తనకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.  ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాలలో తన భాగస్వామ్యం ఉండడం, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుతూ, తన చివరి రక్తం బొట్టు వరకు కేసీఆర్  వెంటే ఉంటానని స్పష్టంచేశారు. 

బీజేపీ, కాంగ్రెస్ కు నూకల చెల్లాయ్..

బీజేపీ మాయమాటలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. సీఎ కేసీఆర్ రిజర్వేషన్లు ప్రకటించినప్పటి నుంచి బీజేపీకి వణుకు పుడుతుందని తెలిపారు. తెలంగాణ గడ్డపై ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీకి, దేశంలో ఎక్కువ కాలం పాలించి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని ఆరోపించారు. రిజర్వేషన్ల పెంపు జీవోకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తే బండి సంజయ్ పై గిరిజనులు తిరగబడతారన్నారు.  ముందే రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం సిగ్గుచేటు అన్నారు. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ఏంచేశారని ప్రశ్నించారు. సిగ్గు ఉంటే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చింది ఏముందో చెప్పి ప్రజల్లో తిరగాలని సవాల్ చేశారు. ఎంపీ సోయం బాబూరావు గిరిజన రిజర్వేషన్లపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని, కాస్త ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.  గిరిజనులు, ఆదివాసి బిడ్డల మధ్య రాజకీయ లబ్ధి కోసం, చిచ్చు పెట్టి  చౌకబారు ప్రకటన చేస్తే గిరిజన సోదరులు ఊరుకోరన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్ట హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget