By: ABP Desam | Updated at : 14 Sep 2023 04:16 PM (IST)
Edited By: jyothi
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రజలకు పగోళ్లుగా మారాయి: మంత్రి హరీష్ రావు ( Image Source : Minister Harish Rao )
Minister Harish Rao: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు పగోళ్లుగా మారాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా బాగా ఆలోచించే.. పని చేసే బీఆర్ఎస్ కావాలా, పగోళ్లు కావాలా ఆలోచించుకోవాలని సూచించారు. ఓటమి భయంతోనే బీజేపీ జమిలీ ఎన్నికలకు ప్లాన్ చేసిందని కామెంట్లు చేశారు. జనాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీకి జమిలి ఎన్నికలతో ఎలాంటి నష్టం లేదని చెప్పారు. కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎమ్మెల్సీ కవితపై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. కేసులు పెట్టారని అన్నారు. కానీ తమకు కోర్టులపై న్యాయం, ధర్మం మీద నమ్మకం ఉందన్నారు. ఎవరు ఏం చేసినా చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తుందన్నారు. ప్రతిపక్షాల ఎప్పుడూ కేసులు పెట్టే బీజేపీ.. ఒక్క కాషాయదళ నాయకుడిపై కూడా కేసు ఎందుకు పెట్టదో చెప్పాలని అడిగారు. అభివృద్ధి చేస్తూ.. అందరి మనసుల్లో స్థానాలు సంపాధించుకోవాలనే కానీ... ప్రతిపక్షాలను బలహీనం చేసి గెలవాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు.
Live: Minister Sri @BRSHarish addressing the Media at Khammam. https://t.co/6tiwtJWvag
— BRS Party (@BRSparty) September 14, 2023
ప్రజలకు ఏం కావాలో ఆలోచించి అదే చేసే సీఎం కేసీఆర్ ను గెలిపించుకుంటే.. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. పల్లెలు, పట్టణాలతో పాటు పాడి, ప్రాజెక్టులు ఇలా ఏం రంగంలో చూసినా తెలంగాణ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉందో, ఇప్పటి తెలంగాణ ఎలా ఉందో ఓ సారి ఆలోచిస్తే ప్రజలకు విషయం అంతా అర్థం అవుతుందని అన్నారు. నాడు కాలువల్లో నీలు లేక వెలవెలబోతే.. ఇప్పుడు కాలువలు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయన్నారు. వాటి ఫలితంగానే రాష్ట్రంలో అనుకున్న దానికంటే అధిక దిగుబడి వస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వచ్చి నీతులు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ... 50 ఏళ్ల పాలనలో రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, జిల్లాకో మెడికల్ కాలేజీ వంటి పథకాలను తీసుకురాలేదో చెప్పాలన్నారు. నిజంగానే రాష్ట్రాభివృద్ధిపై వాళ్లకు మనసు ఉంటే.. తెలంగాణ ఎప్పుడో బాగయ్యేదని చెప్పుకొచ్చారు.
తొమ్మిదేండ్లలో 29 కాలేజీలు
KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు అర్థమేంటి!
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
MLA Raja Singh: దమ్ముంటే ఆ పని చేయండి - సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్
Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ
PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి
బీఆర్ఎస్కు షాక్ల మీద షాక్లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'
/body>