News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Minister Harish Rao: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రజలకు పగోళ్లుగా మారాయి: మంత్రి హరీష్ రావు

Minister Harish Rao: ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజలకు పగోళ్లుగా మారాయని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఎన్నికల్లో గెలిచేందుకు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. 

FOLLOW US: 
Share:

Minister Harish Rao: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు పగోళ్లుగా మారాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా బాగా ఆలోచించే.. పని చేసే బీఆర్ఎస్ కావాలా, పగోళ్లు కావాలా ఆలోచించుకోవాలని సూచించారు. ఓటమి భయంతోనే బీజేపీ జమిలీ ఎన్నికలకు ప్లాన్ చేసిందని కామెంట్లు చేశారు. జనాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీకి జమిలి ఎన్నికలతో ఎలాంటి నష్టం లేదని చెప్పారు. కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎమ్మెల్సీ కవితపై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. కేసులు పెట్టారని అన్నారు. కానీ తమకు కోర్టులపై న్యాయం, ధర్మం మీద నమ్మకం ఉందన్నారు. ఎవరు ఏం చేసినా చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తుందన్నారు. ప్రతిపక్షాల ఎప్పుడూ కేసులు పెట్టే బీజేపీ.. ఒక్క కాషాయదళ నాయకుడిపై కూడా కేసు ఎందుకు పెట్టదో చెప్పాలని అడిగారు. అభివృద్ధి చేస్తూ.. అందరి మనసుల్లో స్థానాలు సంపాధించుకోవాలనే కానీ... ప్రతిపక్షాలను బలహీనం చేసి గెలవాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు. 

ప్రజలకు ఏం కావాలో ఆలోచించి అదే చేసే సీఎం కేసీఆర్ ను గెలిపించుకుంటే.. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. పల్లెలు, పట్టణాలతో పాటు పాడి, ప్రాజెక్టులు ఇలా ఏం రంగంలో చూసినా తెలంగాణ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉందో, ఇప్పటి తెలంగాణ ఎలా ఉందో ఓ సారి ఆలోచిస్తే ప్రజలకు విషయం అంతా అర్థం అవుతుందని అన్నారు. నాడు కాలువల్లో నీలు లేక వెలవెలబోతే.. ఇప్పుడు కాలువలు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయన్నారు. వాటి ఫలితంగానే రాష్ట్రంలో అనుకున్న దానికంటే అధిక దిగుబడి వస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వచ్చి నీతులు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ... 50 ఏళ్ల పాలనలో రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, జిల్లాకో మెడికల్ కాలేజీ వంటి పథకాలను తీసుకురాలేదో చెప్పాలన్నారు. నిజంగానే రాష్ట్రాభివృద్ధిపై వాళ్లకు మనసు ఉంటే.. తెలంగాణ ఎప్పుడో బాగయ్యేదని చెప్పుకొచ్చారు. 

తొమ్మిదేండ్లలో 29 కాలేజీలు

తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఉన్నవి 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమేనని మంత్రి హరీష్ రావు తెలిపారు. వీటిలో ఉస్మానియా (1946), గాంధీ (1954) మెడికల్‌ కాలేజీలు ఉమ్మడి ఏపీ ఆవిర్భావానికి ముందు నుంచే ఉన్నాయన్నారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీని ప్రైవేట్‌ సంస్థ ఏర్పాటు చేస్తే ఉమ్మడి ప్రభుత్వం తీసుకుందని.. అంటే దాదాపు ఆరు దశాబ్దాల్లో ఉమ్మడి పాలకులు తెలంగాణలో ఏర్పాటు చేసింది కేవలం రెండు కాలేజీలు మాత్రమేనని చెప్పుకొచ్చారు.
 
అవి ఆదిలాబాద్‌ లోని రిమ్స్‌, నిజామాబాద్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలని వివరించారు. మొత్తంగా చూస్తే కేవలం నాలుగు జిల్లాల్లోనే మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని.. కానీ సీఎం కేసీఆర్‌ తొమ్మిదేళ్లలో 29 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు. అంటే సగటున ఏడాదికి మూడు కాలేజీలు ఏర్పాటయ్యాయని... ఈ ఏడాది ఏకంగా ఒకేసారి 9 మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానుండడం దేశ వైద్యవిద్య రంగంలోనే సరికొత్త చరిత్రగా నిలిచిందన్నారు. ప్రజలంతా బాగా ఆలోచించుకుని.. సీఎం కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని సూచించారు. అలాగే తాము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 
Published at : 14 Sep 2023 04:16 PM (IST) Tags: Minister Harish Rao CM KCR Harish Rao On BJP BRS govt Harish Rao on Congress

ఇవి కూడా చూడండి

KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్‌ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు అర్థమేంటి!

KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్‌ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు అర్థమేంటి!

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

MLA Raja Singh: దమ్ముంటే ఆ పని చేయండి - సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్

MLA Raja Singh: దమ్ముంటే ఆ పని చేయండి - సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి

PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి

టాప్ స్టోరీస్

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'