అన్వేషించండి

Ntr Statue HighCourt : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే - ఎందుకంటే ?

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆవిష్కరించవద్దని స్పష్టం చేసింది.


Ntr Statue HighCourt :  ఖమ్మంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల రోజున ప్రారంభించాలనుకున్న ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో మొత్తం  14 పిటిషన్స్ దాఖలయ్యాయి.  శ్రీ కృష్ణ JAc,  అదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ్ సంఘం  వంటి సంస్థలు పిటిషన్లు వేశాయి. 

ఖమ్మంలోని ‘లకారం ట్యాంక్‌బండ్‌పై’ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందు కోసం దాదాపుగా వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని రెడీ చేయించారు.  28వ తేదీన ఈ విగ్రహావిష్కరణకు ‘జూనియర్ ఎన్టీఆర్’ ‌ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉది.  మంత్రి పువ్వాడ అజయ్ సారథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను కృష్ణుడి రూపంలో పెట్టడంతో భవిష్యత్ తరాల వారు ఎన్టీఅరే కృష్ణుడు అనుకునే ప్రమాదం ఉందని, హిందూ యాదవ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.  ఎన్టీఆర్‌ను మహానటుడుగా, అభిమాన నాయకునిగా అభిమానించినా భగవంతుని స్థాయిలో పోల్చరాదని వారంటున్నారు.   యాదవ, కమ్మ సంఘాల వారి ఓట్ల కోసమే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వారే కోర్టులకు వెళ్లారు. 

సినీ నటి కరాటే కళ్యాణి కూడా   ఈ విగ్రహావిష్కరణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు.  ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆధ్వర్యంలో హిందూ, యాదవ ఆందోళన కూడా నిర్వహించారు.. జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించారు..ప్రభుత్వ స్థలం లో ప్రైవేట్ కార్యక్రమం కు ఎలా అనుమతి ఇచ్చారు..అని ప్రశ్నించారు. అయితే   కరాటే కళ్యాణి అభ్యంతరాలను  ఖమ్మం బీఆర్ఎస్ లో ఉన్న యాదవ ప్రతినిధులు ఖండించారు.  ఖమ్మం లో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆమె వ్యవహరిస్తుందని బి ఆర్ ఎస్ యాదవ ప్రతినిది పగడాల నాగరాజు తెలిపారు. ఖమ్మం లో ఉన్న యాదవులు ఎవరిని ఆమె సంప్రదించలేదని.. ఆమె వెనుక ఎవరో ఉండి రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.. సూట్ కేసు ల్లో డబ్బులు తీసుకొని.. అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
  

శ్రీ కృష్ణుడు రూపం లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కొంత మంది యాదవ సంఘం నేతలు చెబుతున్నారు.  విగ్రహ ఏర్పాటు పై రాజకీయం చేయడం తగదంటున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూండగానే.. కోర్టు స్టే ఇవ్వడంతో.. నిర్వాహకులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఆ రోజున ప్రారంభిస్తే గొప్పగా ఉంటుందని అనుకుంటున్నారు. న్యాయపరమైన అడ్డంకులు రావడంతో  ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.                                          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget