అన్వేషించండి

Telangana: పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు

Indiramma housing scheme | తెలంగాణలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇందుకోసం ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది.

Indiramma committees for housing scheme in Telangana | హైదరాబాద్‌: పేద ప్రజలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో ముందడుగు పడింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శనివారంలోగా వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆ ఉత్తర్వులలో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఇదివరకే ప్రకటించింది.

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
అర్హులైన పేదల ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించనుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మొదటి దశలో రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో ఏర్పాటు కానున్న ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పిస్తాయి. సోషల్ ఆడిట్, అధికారులతో సంప్రదింపులు లాంటి కార్యక్రమాలలో కమిటీలు భాగస్వాములు కానున్నాయి. 

 గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు
గ్రామాల్లో సర్పంచ్ లేక స్పెషల్ ఆఫీసర్ కమిటీ చైర్మన్ గా మహిళా సంఘాల నుంచి ఇద్దరు మహిళా సభ్యులు గ్రామంలోని ముగ్గురు సభ్యులు (బీసీ, ఎస్సి, ఎస్టీ) ఉండాలి. పంచాయతీ సెక్రటరీ కమిటీ కన్వీనర్ గా వ్యవహరించనున్నారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

పట్టణాల్లో ఇందిరమ్మ కమిటీలు
పట్టణాల్లో మున్సిపల్‌ వార్డు స్థాయి కమిటీలో కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌ ఛైర్మన్‌గా ఉంటారు. మహిళా స్వయం సహాయక గ్రూప్‌ నుంచి ఇద్దరు సభ్యులు, ముగ్గురు స్థానికులు ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. స్థానిక సభ్యులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఒక్కొక్కరు చొప్పున ఉండాలి. వార్డు అధికారి ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. ఈ ఇందిరమ్మ కమిటీలకు పేర్లు పంపించాలని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. వీరు జిల్లా కలెక్టర్లకు పేర్లను సిఫార్స్ చేయాల్సి ఉంటుంది.

Also Read: Weather Latest Update: అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు - IMD ఎల్లో అలర్ట్ జారీ 

తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుల గణన

సమగ్ర కులగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయాలని జీవోలో పేర్కొంది. సామాజిక, విద్య, ఉద్యోగ ఆర్థిక, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ప్రణాళిక శాఖ 60 ఏరోజుల్లో సర్వే పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపైనా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు సర్కార్ సూచించింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాతే కొత్త జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Embed widget