అన్వేషించండి

Telangana : వాళ్లందరి దగ్గర రైతుబంధు రికవరీ - ఇవ్వకపోతే కేసులే - రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

CM Revanth Reddy : వెంచర్లకు ఇచ్చిన రైతు బంధును వెనక్కి తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నారు.

Rythu Bandhu :  వ్యవసాయం చేయకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా భూములను మార్చిన వారు తీసుకున్న రైతు బంధు పథకం  నిధులను వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. రేపో మాపో.. రైతుబంధు నిధుల రికవరీకి సంబంధించి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయనున్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ భూములన్నింటికీ రైతు బంధు వర్తింప చేశారు. అయితే వ్యవసాయ భూముల్లో చాలా వరకూ వెంచర్లుగా మార్చారు. వాటిలో వ్యవసాయం చేయడం లేదు. ఆ విషయంపై ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక రావడంతో పథకం కింద ఇచ్చిన డబ్బులన్నీ రికవరీ చేయాలని నిర్ణయించారు. అధికారిక ఆదేశాలు త్వరలో విడుదల కానున్నాయి. 

రైతు బంధు పథకంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు                           

రైతు బంధు పథకంపై ప్రభుత్వం పూర్తి  స్థాయిలో కసరత్తు చేస్తోంది. రైతుభరోసాగా మార్చి అమలు చేయనున్నారు. ఈ పథకం ఉద్దేశం పూర్తి స్థాయిలో రైతులకు పెట్టుబడి సాయం అందేలా చూడటం. అయితే రైతులు కాని వారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా రైతు  బంధు కింద పెద్ద ఎత్తున సాయం పొందారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే..  జిల్లాల కేంద్రాల్లో పెద్ద ఎత్తున భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్చేశారని వాటికి కూడా రైతు బంధు కింద సాయం అందిందని చెబుతున్నారు. వందల ఎకరాలున్న రియల్ ఎస్టేట్ కంపనీల ఖాతాల్లోనూ నగదు జమ అయిందని అంటున్నారు. 

నిధులు పేదలకు అందాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ                                   

ఇప్పుడు ప్రజాధనం పూర్తి స్థాయిలో పేదలకు..అర్హులకే అందాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో జరిపిన పరిశీలనలో అనర్హులకు వ్యవసాయం చేయని వారికి  నిధులు అందినట్లుగా గుర్తించారు. ఇందులో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండటంతో ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారు. మొత్తంగా పథకం అమలు చేసినప్పటి నుండి  తీసుకున్న డబ్బుల్ని రికవరీ చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు సమకూరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మోతుబరి రైతులకు రైతు  బంధు అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో90 శాతానికిపైగా రైతులు 5 ఎకరాలలోపు ఉన్న వారేనని వారికి ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. 

రుణమాఫీతో పాటు రైతు భరోసా నిధులు                             

ఆగస్టు పదిహేనో తేదీ కల్లా రుణమాఫీ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే సందర్భంలో .. రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా పంపిణీ చేయాల్సి ఉంది. విధి విధానాల ఖరారుకు వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల రైతు బంధు సొమ్మును తిరిగి ఇవ్వకపోతే.. రెవిన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Virat Kohli:విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Embed widget