అన్వేషించండి

Ayodhya Saryu River: అయోధ్య సరయూ నదిలో జనగామ జిల్లా యువతి గల్లంతు

Ayodhya Ram Mandir: అయోధ్యను సందర్శించేందుకు తెలంగాణ నుంచి వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. రాములోరి దర్శనానంతరం స్నానం చేస్తుండగా జనగామ పట్టణానికి చెందిన తేజశ్రీ అనే యువతి కొట్టుకుపోయింది.

Ayodhya Saryu River: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యను సందర్శించేందుకు తెలంగాణ నుంచి ఓ కుటుంబం వెళ్లింది. దైవదర్శనానికి వెళ్లిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.  సరయూ నదిలో ఆ కుటుంబానికి చెందిన యువతి గల్లంతు అయింది.  జనగామకు చెందిన తాళ్లపల్లి నాగరాజు, అతని సోదరుడి కుటుంబానికి చెందిన 15 మంది రెండురోజుల కిందట ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య సందర్శనకు వెళ్లారు.  రాములోరి దర్శనం అనంతరం సరయూ నదిలోకి పుణ్య స్నానాలు చేసేందుకని వెళ్లారు. ఈ నెల 29న సరియూ నదిలో లక్ష్మి ఘాట్ వద్ద స్నానాలు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా వరద ఉధృతి పెరగడంతో  నాగరాజు కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతు అయ్యారు. అందులో నలుగురిని స్థానికులు సురక్షితంగా రక్షించగా తేజశ్రీ అనే యువతి వరదలో కొట్టుకు పోయింది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో  అక్కడి రెస్క్యూ టీం నిన్నటి నుండీ గాలింపు చర్యలు చేపట్టారు. తేజశ్రీ జనగామ పట్టణంలోని ఏబీవీ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతుంది.  

ఆనందం ఆవిరి
దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనగామ జిల్లాకు చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబం జులై 28న ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య సందర్శనకు వెళ్లారు. జులై 29న దైవ దర్శనం కోసం కుటుంబ సమేతంగా సరయు నదిలో స్నానాలు చేస్తుండగా... ఐదుగురు అమ్మాయిలు గల్లంతయ్యారు. అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్న వారు ఒక్కసారే ఐదుగురు గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. వెంటనే స్థానికులు అప్రమత్తమైన నదిలో దూకి యువతులను కాపాడేందుకు ప్రయత్నించారు.

జాగ్రత్తగా ఉంటానని చెప్పి..
స్నానం కోసం నదిలో దిగిన  నలుగురు అమ్మాయిలను ప్రాణాలతో కాపాడగలిగారు. వారితో వెళ్లిన తేజశ్రీని మాత్రం కనుగొనలేకపోయారు. నిన్నటి నుంచి రెస్క్యూ టీం తేజశ్రీ కోసం వెతుకుతూనే ఉన్నారు.  తేజశ్రీ గల్లంతై 24 గంటలు కావొస్తున్న ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న ఉత్తర ప్రదేశ్ పోలీసులు తేజశ్రీని గాలిస్తున్నామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కూతురు తేజశ్రీ ఎంతో చలాకీగా ఉంటుందని... స్నానానికి వెళ్లే సమయంలో కూడా జాగ్రత్తగా ఉంటానని చెప్పి వెళ్లి ఇప్పుడు కనిపించకుండా పోయిందని వాపోయారు. విషయాన్ని కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. యూపీ అధికారులతో వారు మాట్లాడారు. యువతి  జాడ కోసం లక్ష్మణ్‌ ఘాట్‌ వద్దే కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు.  

జనవరి 22న ప్రాణ ప్రతిష్ట
ఉత్తర్ ప్రదేశ్‌లోని అయ్యోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మాణం జరిగింది. 2024 జనవరి 22న ప్రధాన మోదీ చేతుల మీదుగా రామ మందిరంలో రాములోరి  ప్రాణ ప్రతిష్ట జరిగింది. భారత దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్రతి హిందువులంతా ఆ ఆనంద క్షణాలు వీక్షించి పులకించారు. ప్రతి రోజూ అయోద్యకు లక్షలాది మంది భక్తులు వెల్లి బాలరాముడిని దర్శించుకుంటున్నారు. రామ మందిరంతో పాటు అక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యమైన ప్రదేశాలు తిలకించి వస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget