అన్వేషించండి

Ayodhya Saryu River: అయోధ్య సరయూ నదిలో జనగామ జిల్లా యువతి గల్లంతు

Ayodhya Ram Mandir: అయోధ్యను సందర్శించేందుకు తెలంగాణ నుంచి వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. రాములోరి దర్శనానంతరం స్నానం చేస్తుండగా జనగామ పట్టణానికి చెందిన తేజశ్రీ అనే యువతి కొట్టుకుపోయింది.

Ayodhya Saryu River: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యను సందర్శించేందుకు తెలంగాణ నుంచి ఓ కుటుంబం వెళ్లింది. దైవదర్శనానికి వెళ్లిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.  సరయూ నదిలో ఆ కుటుంబానికి చెందిన యువతి గల్లంతు అయింది.  జనగామకు చెందిన తాళ్లపల్లి నాగరాజు, అతని సోదరుడి కుటుంబానికి చెందిన 15 మంది రెండురోజుల కిందట ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య సందర్శనకు వెళ్లారు.  రాములోరి దర్శనం అనంతరం సరయూ నదిలోకి పుణ్య స్నానాలు చేసేందుకని వెళ్లారు. ఈ నెల 29న సరియూ నదిలో లక్ష్మి ఘాట్ వద్ద స్నానాలు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా వరద ఉధృతి పెరగడంతో  నాగరాజు కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతు అయ్యారు. అందులో నలుగురిని స్థానికులు సురక్షితంగా రక్షించగా తేజశ్రీ అనే యువతి వరదలో కొట్టుకు పోయింది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో  అక్కడి రెస్క్యూ టీం నిన్నటి నుండీ గాలింపు చర్యలు చేపట్టారు. తేజశ్రీ జనగామ పట్టణంలోని ఏబీవీ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతుంది.  

ఆనందం ఆవిరి
దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనగామ జిల్లాకు చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబం జులై 28న ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య సందర్శనకు వెళ్లారు. జులై 29న దైవ దర్శనం కోసం కుటుంబ సమేతంగా సరయు నదిలో స్నానాలు చేస్తుండగా... ఐదుగురు అమ్మాయిలు గల్లంతయ్యారు. అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్న వారు ఒక్కసారే ఐదుగురు గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. వెంటనే స్థానికులు అప్రమత్తమైన నదిలో దూకి యువతులను కాపాడేందుకు ప్రయత్నించారు.

జాగ్రత్తగా ఉంటానని చెప్పి..
స్నానం కోసం నదిలో దిగిన  నలుగురు అమ్మాయిలను ప్రాణాలతో కాపాడగలిగారు. వారితో వెళ్లిన తేజశ్రీని మాత్రం కనుగొనలేకపోయారు. నిన్నటి నుంచి రెస్క్యూ టీం తేజశ్రీ కోసం వెతుకుతూనే ఉన్నారు.  తేజశ్రీ గల్లంతై 24 గంటలు కావొస్తున్న ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న ఉత్తర ప్రదేశ్ పోలీసులు తేజశ్రీని గాలిస్తున్నామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కూతురు తేజశ్రీ ఎంతో చలాకీగా ఉంటుందని... స్నానానికి వెళ్లే సమయంలో కూడా జాగ్రత్తగా ఉంటానని చెప్పి వెళ్లి ఇప్పుడు కనిపించకుండా పోయిందని వాపోయారు. విషయాన్ని కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. యూపీ అధికారులతో వారు మాట్లాడారు. యువతి  జాడ కోసం లక్ష్మణ్‌ ఘాట్‌ వద్దే కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు.  

జనవరి 22న ప్రాణ ప్రతిష్ట
ఉత్తర్ ప్రదేశ్‌లోని అయ్యోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మాణం జరిగింది. 2024 జనవరి 22న ప్రధాన మోదీ చేతుల మీదుగా రామ మందిరంలో రాములోరి  ప్రాణ ప్రతిష్ట జరిగింది. భారత దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్రతి హిందువులంతా ఆ ఆనంద క్షణాలు వీక్షించి పులకించారు. ప్రతి రోజూ అయోద్యకు లక్షలాది మంది భక్తులు వెల్లి బాలరాముడిని దర్శించుకుంటున్నారు. రామ మందిరంతో పాటు అక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యమైన ప్రదేశాలు తిలకించి వస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Stalin On Delimitation:  జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Grama Palana officers: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
Sharmila on Delimitation:  సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Embed widget