అన్వేషించండి

Telangana elections 2023: తెలంగాణ ఎన్నికల్లో భారీగా పట్టుబడిన సొమ్ము, ఇప్పటివరకు ఎన్ని కోట్లో తెలుసా?

Money Seized in Telangana: అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓటింగ్ శాతం పెంచడంపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. నేడు ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్ జారీతో నామినేషన్ల ప్రక్రియ మొదలైందన్నారు. అభ్యర్థులు ఒక్కో స్థానం నుంచి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసుకోవచ్చని, సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం ఒక్క దానికే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు గరిష్టంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చునని పేర్కొన్నారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లను స్వీకరిస్తామని, ఎన్నికల్లో నామినేషన్ వేసేవారు అన్ని కాలమ్స్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 10 తర్వాత ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2 వేల పోలింగ్ కేంద్రాలను సిద్దం చేస్తున్నామని, ఓటింగ్ శాతాన్ని పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 

ఇప్పటివరకు పోలీసుల తనిఖీల్లో రూ.453 కోట్ల విలువైన సొమ్ము పట్టుబడినట్లు వికాస్ రాజ్ వివరించారు. సి విజిల్ యాప్ ద్వారా 2,487 ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై చర్యలు తీసుకుంటున్నట్లు వికాస్ రాజ్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 205 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, స్వాధీనం చేసుకున్న నగదుకు ఆధారాలు ఉంటే జల్లా కమిటీల ద్వారా వెంటనే విడుదల చేస్తున్నామన్నారు. ఇక ఇప్పటివరకు ఎన్నికల నిబంధనలకు సంబంధించి 362 కేసులు, 256 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

నవంబర్ 30న మావోయిస్టు ప్రాబల్యం ఉండే  13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. ఇక అక్టోబర్ 31 నుంచి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నవారి అప్లికేషన్లను నవంబర్ 10లోపు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత ఓటర్ ఇన్‌ఫర్మేషన్ ఆధారంగా స్లిప్పులు ముందుగా పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్ శాతం తగ్గుతుందని వివరించారు. అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సారి రాష్ట్రంలో కొత్తగా 9.10 లక్షల మంది యువత ఓటు నమోదు చేసుకున్నారని, వారిని ఆకట్టుకునేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఇక పోలింగ్ కేంద్రాల వద్ద వృద్దులు, వికలాంగుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 వేల వీల్ ఛైర్లు ఏర్పాటు చేస్తామని వికాస్ రాజ్ తెలిపారు. నవంబర్ రెండో తేదీ వరకు ఓటర్ల సంఖ్య 3,21,88,753గా ఉందన్నారు. అలాగే పోలింగ్ రోజు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే 375 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయన్నారు. అటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, స్పెషల్ ఇంటెలిజెన్స్ టీమ్‌లను రంగంలోకి దింపామన్నారు. ఇప్పటివరకు 137 ఎంపీసీ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయన్నారు. అలాగే కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 13, బీజేపీ 5, బీఎస్పీ3 అనుమానిత కేసులు ఉన్నాయన్నారు. ఇక రైతుబంధు నగదు జమకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని వికాస్ రాజ్ పేర్కొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget