అన్వేషించండి

Telangana: జీవో 46 రద్దుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం, కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!

జీవో 46 రద్దుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Telangana CM Revanth Reddy: హైదరాబాద్‌: జీవో 46 రద్దుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పోలీసుశాఖ నియామకాల్లో ఈ జీవో రద్దు అంశం వివాదాస్పదంగా మారింది. భవిష్యత్‌లో జారీచేసే నోటిఫికేషన్లకు జీవో 46 (GO 46) అమలు చేయాలా? లేక రద్దు చేయాలా? అనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో చర్చించాక దీనిపై ప్రకటన చేస్తామన్నారు.

ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో రేవంత్ చర్చలు 
జీవో 46పై ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి చర్చించారు. గత ప్రభుత్వం మార్చి 2022లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో నోటిఫికేషన్ జారీ చేసి సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతో పాటు, కొత్త పోస్టుల నోటిఫికేషన్ పై చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అక్టోబర్ 4, 2023కు ముందు 15,750 పోస్టులకు సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయింది. దాంతో పోలీసు శాఖలో సెలక్ట్ అయిన 15,750 మందికి నియామక పత్రాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని అధికారులు సీఎం రేవంత్ కు తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తయింది కనుక.. ఇప్పుడు జీవో 46 రద్దు చేయడం కొత్త వివాదాలకు తెరదీస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్లకు ఈ జీవో రద్దును అమలు చేయడం ఉత్తమమని సూచించారు.

జీవో 46ను జారీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం..
కొన్ని శాఖలకు జిల్లాలవారీగా యూనిట్లు లేకపోవడంతో జనాభా ప్రాతిపదికన పోస్టులు కేటాయిస్తూ 2022 ఏప్రిల్‌ 4న బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 46ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే దాదాపు 53శాతం ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. మిగతా 27 పోలీసు యూనిట్లలో 47 శాతం పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనిపై గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగియవచ్చింది. దాంతో 15,750 పోస్టులకు ఎంపిక అయిన వారికి నియామక పత్రాలు ఇవ్వడమే సరైనదని సీఎం రేవంత్ కు అధికారులు సూచించారు. ఇటీవల హైకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా.. నేరుగా హైకోర్టు తీర్పు అమలు చేస్తే న్యాయపరంగా కొత్త సమస్యలు రావని అడ్వకేట్ జనరల్, అదనపు ఏజీ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ సమావేశంలో కొందరు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Embed widget