అన్వేషించండి

Dalitha Bandhu Telangana: దళితబంధు అమలు తేదీ ఖరారు, ఆ రోజు నుంచే హుజూరాబాద్‌లో.. కేబినెట్ నిర్ణయం

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం (ఆగస్టు 1) సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుంచి హుజూరాబాద్‌‌లో దళిత బంధు ప్రారంభించాలని నిర్ణయించింది.

తెలంగాణలో కొద్ది రోజుల క్రితం ప్రవేశపెట్టిన కొత్త పథకం దళిత బంధును ఈ నెల 16 నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం (ఆగస్టు 1) సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇంకా 15 రోజులే సమయం ఉన్నందున పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం పూర్వాపరాలను సీఎం కేసీఆర్ వివరించారు.

దళిత బంధుకు చట్టబద్ధత
దళితుల కష్టాలు తీర్చడానికి ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం అమలుకు సంబంధించి మంత్రులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా దళితబంధు పథకానికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టం తీసుకు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది. గతంలో ఎస్పీ ప్రగతినిధి చట్టం తెచ్చి, ఒక వార్షిక బడ్జెట్‌లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తరువాతి వార్షిక బడ్జెట్‌కు బదలాయించే విధానం తీసుకొచ్చామని గుర్తు చేసుకున్నారు. ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, అదే విధంగా దళిత బంధు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందనీ క్యాబినెట్ అభిప్రాయపడింది.

దళితుల అభివృద్ధి, అరకొర సహాయాలతో సాధ్యం కాదని, అందుకే దళితబంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి రూ.10 లక్షల పెద్ద మొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయంలో ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదనీ ముఖ్యమంత్రి తెలియజేశారు. ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ లబ్ధిదారులదే అని, ప్రభుత్వం అధికారులు, దళిత బంధు స్వచ్ఛంద కార్యకర్తలు వారికి మార్గదర్శనం చేస్తారని ముఖ్యమంత్రి అన్నారు.

లబ్ధి దారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వశాఖ శిక్షణ అవగాహన కల్పించాలని కేబినెట్ అభిప్రాయపడింది. శిక్షణ, పర్యవేక్షణ కోసం గ్రామస్థాయి నుంచీ రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటుచేయాలని కేబినెట్ నిర్ణయించింది. అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతిజిల్లాలో ‘‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’’  ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.

కచ్చితంగా ప్రభుత్వ పర్యవేక్షణ
యూనిట్ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని యూనిట్ సరిగ్గా నడుస్తుందా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించడం కూడా ముఖ్యమని క్యాబినెట్ తీర్మానించింది. దళిత బంధు పథకం అమలుకు పటిష్ఠమైన యంత్రాంగం అవసరమనీ వివిధ శాఖలలో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావును కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు ద్వారా ఎవరికైతే లబ్ధి చేకూరుస్తారో వారికి అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్ పరిశీలించింది. ఈ కార్డు ఆన్‌లైన్ అనుసంధానం చేసి లబ్ధిదారుడి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని వివరించింది. 

దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులూ దళితవాడలకు ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందనీ, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

ఉద్యోగాల భర్తీపై జరగని చర్చ
రాష్ట్రంలో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీలున్నాయని ప్రభుత్వం మంత్రిమండలికి నివేదించింది. ఈ జాబితాను అధ్యయనం చేస్తామని, వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి, నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ అన్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: కోల్‌కత్తా బ్యాటర్ల విధ్వంసం, పంజాబ్‌ లక్ష్యం 262
కోల్‌కత్తా బ్యాటర్ల విధ్వంసం, పంజాబ్‌ లక్ష్యం 262
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Boy Rescued 50 Members in Fire Accident | అగ్నిప్రమాదం నుంచి 50 మందిని కాపాడిన బాలుడు | ABP DesamFire Accident in Alwin Pharmacy Company Rangareddy | రంగారెడ్డిలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం | ABP DesamJamie Lever Interview | Allari Naresh | Aa Okkati Adakku |ఈ వీడియో చూస్తే నవ్వాగదు..Mega Heroes for Pawan kalyan | పిఠాపురానికి వస్తున్న వరుణ్ తేజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: కోల్‌కత్తా బ్యాటర్ల విధ్వంసం, పంజాబ్‌ లక్ష్యం 262
కోల్‌కత్తా బ్యాటర్ల విధ్వంసం, పంజాబ్‌ లక్ష్యం 262
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Anupama Parameswaran: అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
Warangal News: ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Embed widget