అన్వేషించండి

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Jayalalitha మరణం తర్వాత అన్నాడీఎంకేను బీజేపీ నియంత్రిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడిపోయిన వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు జరిగాయి.

Vijayashanthi Meets VK Shashikala In Chennai: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళను (VK Shashikala) తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి (Vijayashanthi) కలిశారు. వీరి భేటీ రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. శశికళ (VK Shashikala) జైలు నుంచి విడుదలైన సమయంలో చెన్నైలోని ఆమె నివాసంలో విజయశాంతి (Vijayashanthi) బహిరంగంగానే సమావేశం అయ్యారు. తాజాగా ఇప్పుడు మరోసారి రహస్యంగా కలిశారు. ఈ భేటీలో వీరు ఇద్దరూ శశికళ (VK Shashikala News) భవిష్యత్ రాజకీయ ప్రయాణం గురించి కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. 

జయలలిత (Jaya Lalitha) మరణం తర్వాత అన్నాడీఎంకే కార్యకలాపాలను బీజేపీ నియంత్రిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే నుంచి విడిపోయిన వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు జరిగాయి. పార్టీ చీఫ్ గా ఉన్న ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా ఏకతాటిపైకి వచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్రయత్నాలు అప్పుడు సఫలం కాలేదు.

ఈ నేపథ్యంలో 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన వారిని మళ్లీ కలపాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే విజయశాంతి (Vijayashanthi) శశికళతో భేటీ అయినట్లుగా సమాచారం.

శశికళ ప్రస్తుతం తమిళనాడు అంతటా ఆధ్యాత్మిక యాత్ర (VK Shashikala Tour) చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆమె తన మద్దతుదారుల కోసం బహిరంగ సభలకు కూడా హాజరవుతున్నారు. ఇంకా త్వరలో తన రాజకీయ యాత్రను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు శశికళ గతంలోనే చెప్పారు. రెండు రోజుల క్రితం కూడా, అన్నాడీఎంకేకు తాను నాయకత్వం వహించాలని వాలంటీర్లు కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే నేతలు తనతో టచ్‌లో ఉన్నారని కూడా చెప్పారు. అన్నాడీఎంకేలోని కొందరు మాత్రమే తనను వ్యతిరేకిస్తున్నారని శశికళ ఇటీవల ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

అన్నాడీఎంకేకు తాను కచ్చితంగా నాయకత్వం వహిస్తానని, దానిపై తనకు 100 శాతం విశ్వాసం ఉందని శశికళ (VK Shashikala) గత వారం చెప్పారు. అధిష్టానాన్ని మళ్లీ పటిష్ఠం చేసేందుకు శశికళ సీక్రెట్ ప్లాన్ తో పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanthi) తాజాగా శశికళను (VK Shashikala) రహస్యంగా కలిశారు.

Also Read: TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

Also Read: Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget