Breaking News Live Updates: మాజీ క్రికెటర్ యువరాజ్ అరెస్ట్... బెయిల్ పై విడుదల..!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 17న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 17న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
రేపు శ్రీవారిని దర్శించుకోనున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు, మంచు లక్ష్మీ. రేణిగుంట విమానాశ్రయం వద్ద వీరికి అభిమానులు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు. ఇవాళ రాత్రి తిరుమలలో బస చేసి రేపు ఉదయం వీ.ఐ.పీ విరామ సమయంలో మా ఫ్యానల్ సభ్యులతో కలిసి మా అధ్యక్షుడు మంచు విష్ణు స్వామి వారిని దర్శించుకోనున్నారు..
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులో ఒకరు చనిపోయగా, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,938కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 3,924 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 176 మంది కరోనాను జయించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
నిద్రపోతున్న బాలుడిని కాటేసిన పాము
తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఇందిరమ్మ కాలనిలో పాముకాటుతో సమీర్ అనే రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంట్లో నిద్రిస్తున్న బాలుడిని ఆదివారం తెల్లవారుజామున పాముకాటు వేసింది. బాలుడు ఏడువడంతో గమనించిన తల్లిదండ్రులు బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ముందస్తు ఎన్నికల అంశంపై నేతలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ
తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ ఎల్పీ సంయుక్త సమావేశం ముగిసింది. ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని సమావేశంలో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉందని.. చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయన్నారు. మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్టపడి పనిచేయాలని నేతలకు కేసీఆర్ సూచించారు. ఈ నెల 27 హుజురాబాద్ లో కేసీఆర్ ప్రచార సభ.. కాగా హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో తామే గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
విశాఖ ఏజెన్సీలో పోలీసులపై గంజాయి ముఠా రాళ్ల దాడి
విశాఖ ఏజెన్సీలో గంజాయి ముఠా పోలీసులపై దాడికి దిగింది. పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు 10 రౌండ్ల కాల్పులు చేసినట్లు తెలుస్తోంది.
ముగిసిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని కేసీఆర్ అన్నారు. 10 లక్షల మందితో వరంగల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీలో కొత్తగా 432 కరోనా కేసులు, 5 మరణాలు
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 432 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 586 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,034 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
ప్రారంభమైన టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సమావేశం
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. నవంబరు 15న వరంగల్ లో విజయగర్జన సభ నిర్వహణపై చర్చించనున్నారు. పార్టీ పురోగతిపై సీఎం నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
తిరుపతి-దిల్లీ మధ్య స్పైస్ జెట్ విమాన సేవలు ప్రారంభం
తిరుపతి- దిల్లీ మధ్య స్పైస్ జెట్ విమాన సర్వీసును కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ విమాన సర్వీస్ ఆధ్యాత్మిక రాజధానిని, జాతీయ రాజధానితో కలుపుతుందని మంత్రి అన్నారు.
आज देश की राजधानी नई दिल्ली और आध्यात्मिक शहर तिरुपति के बीच @flyspicejet की विमान सेवा का वर्चुअल उद्घाटन किया। इससे दोनों शहरों के नागरिकों को आवागमन एवं व्यवसाय की सुलभता के साथ ही दर्शनार्थियों को भी सहूलियत होगी।
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) October 17, 2021
1/2 pic.twitter.com/8rXX7TiZ7G
తిరుపతి - ఢిల్లీ మధ్య స్పైస్ జెట్ విమానాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి సింధియా
తిరుపతి - ఢిల్లీ మధ్య స్పైస్ జెట్ విమానాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ విమాన సర్వీస్ ఆధ్యాత్మిక నగరాన్ని, దేశ రాజధానితో కలుపుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets